కొన్ని సందర్భాల్లో ఒక మనిషికి, మరొక మనిషికి ఎక్కడో ఒకచోట సిమిలారిటీస్ ఉంటాయి. పుట్టిన తేదీ కలవడం, లేదా పుట్టిన ఊరు ఒకటే అవ్వడం అలా అన్నమాట.
ఇలా మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక ఇద్దరికి కో – ఇన్సిడెంటల్ గా కొన్ని విషయాలు కలిశాయి. మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్.

అలాగే సినిమాకి, సినిమాకి సంబంధం లేకుండా ప్రతి సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనల్ని అలరిస్తున్నారు మంచు మనోజ్. ఎన్టీఆర్ ఇంకా మంచు మనోజ్ మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరికీ కో ఇన్సిడెంటల్ గా కొన్ని విషయాలు కలుస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ 1983 మే 20వ తేదీన పుట్టారు. మంచు మనోజ్ పుట్టిన తేదీ మే 20, 1983.

జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా 1991 లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఆ తర్వాత 1996 లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించారు జూనియర్ ఎన్టీఆర్. మంచు మనోజ్ 1993 లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించారు మంచు మనోజ్. జూనియర్ ఎన్టీఆర్ మొదటి చిత్రం అయిన బ్రహ్మర్షి విశ్వామిత్ర లోనూ, మంచు మనోజ్ మొదటి చిత్రం అయిన మేజర్ చంద్రకాంత్ లోనూ నందమూరి తారక రామారావు గారు ప్రధాన పాత్ర పోషించారు.

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే మాజీ ఎంపీ కూడా. మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు గారు కూడా ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు ఎంపీగా కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి 2011 లో మే నెలలో లక్ష్మీ ప్రణతి తో వివాహం జరిగింది. మంచు మనోజ్ కి 2015లో మే నెలలో వివాహం జరిగింది. మంచు మనోజ్ భార్య పేరు ప్రణతి.


















మరి ఎందుకు కనిపించడం లేదు అనే డౌట్ చాలామందిలో ఇప్పటికి ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని ఆలీ గారే ప్రస్తావిస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమస్య చాలా మంది సీనియర్ నటులు అనుభవిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ దీనిపై ఆయన ఏమన్నారంటే.. ఈ మధ్య చిన్న చిన్న సినిమాల్లో నాకు పాత్రలు ఇస్తున్నారు.పాత్ర చాలా బాగుంటుంది అని చెబుతూ.. కథ ఏంటో కూడా చెప్పకుండా డేట్స్ తీసుకుంటున్నారు. తీరా సినిమా విడుదలై థియేటర్ లోకి వచ్చాక అసలు ఆలీ ఈ సినిమాలో ఎందుకు నటించాడు అనేలా మూవీస్ ఉన్నాయి.
అభిమానులతో అలా అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వస్తున్నా కథ నచ్చితేనే ఓకే చెబుతున్నానని అన్నారు. ఈటీవీ సీరియల్ లో నటించడం గురించి కూడా ఆయన మాట్లాడారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోసం యమలీల సీరియల్ చేస్తున్నానని అన్నారు.
స్టార్ దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన నన్ను హీరోను చేశాడని, ఆయన ఏది చెప్పినా వెనకాడకుండా ఆలోచించకుండా చేస్తానని అన్నాడు ఆలీ. అందుకోసమే ఇప్పుడు యమలీల సీరియల్ చేశానని వివరించాడు. దీంతో పాటు ఇతర భాషల్లో సినీ అవకాశాల గురించి కూడా ఆలీ చెప్పుకొచ్చారు.
తెలుగులోనే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. మొన్న ఈ మధ్య కాలంలోనే నేపాలి సినిమాకు కూడా సంతకం చేశారట. ఒకప్పుడు మన తెలుగులో ఉత్తరాది వాళ్లని తీసుకువచ్చి నటన, భాషను నేర్పించి మరి దర్శకనిర్మాతలు డబ్బులు ఇచ్చేవారు.
కానీ ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీ వాళ్లే మనల్ని సంప్రదిస్తున్నారు. ఎందుకంటే మేం ఇండియన్ స్టార్స్ గా మారిపోయామంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు అలీ. అయితే నేపాల్ సినిమా వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఇలా వారు టీవీ చూస్తున్నప్పుడు తండ్రి దగ్గుతూ ఉండగా పక్కనే ఉన్న కూతురు తన తండ్రి వైపు అమాయకంగా చూస్తూ ఉండడం మనం సినిమా చూసినప్పుడల్లా చూస్తాం. ఆ చిన్న పాప ఒక్క చూపుతో ఆ తండ్రి సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని భావించి అవి మానేస్తాడు. ఆ చిన్న పాప ఇప్పుడు పెద్ద పాప అయిపోయింది. ప్రస్తుతం సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీ జీవితాన్ని గడుపుతోంది.
ఈ చిన్న పాప పేరు “సిమ్రాన్ నటేకర్” ముంబైలోని పుట్టి పెరిగింది. ప్రస్తుతం మోడలింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సిమ్రాన్ తల్లిదండ్రులు కూడా సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో నో స్మోకింగ్ అనే ప్రకటనలో నటించాల్సి వచ్చింది. ఈ ప్రకటన తర్వాత ఆ పాప 150 పైగా యాడ్స్ లో నటించడం విశేషం. ముంబైలో నో స్మోకింగ్ అవేర్నెస్ యాడ్ కు సంబంధించి ఈ పాప ఫోటోలు ఇప్పటికి కనిపిస్తూ ఉంటాయి. ఈ యాడ్ ద్వారా అందరి మన్ననలు పొందిన ఈ అమ్మాయి ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్లో ఉంది.
అలాగే చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో పూజ పాత్ర చేసింది కూడా ఈ అమ్మాయి. అలాగే ఈ అమ్మడు “జానే కహా సే ఆయు హై” అనే మూవీలో కూడా నటించింది. ఇప్పటికీ తన నటనకు సంబంధించి సరైన గుర్తింపు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతోంది. అంతే కాకుండా చాలా వరకు హిందీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య కాలంలో సిమ్రాన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారింది. అప్పుడప్పుడు అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.


ఇక చాలామంది స్టార్ హీరోలు కూడా తమన్ మాత్రమే సినిమాలో మ్యూజిక్ ఇవ్వాలని అంటున్నారు. అల వైకుంఠపురం మూవీలో సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అఖండ బిజీఎం విని థియేటర్లలో అభిమానులు ఎలా ఊగిపోయారో మనం చూశాం.
ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఆయన చేతిలో ఫాదర్- ఆర్ సి -15 మూవీస్ ఉన్నాయి. ఎన్నడూ లేనట్టుగా తమన్ మొదటిసారి తన భార్య మరియు ఆయన కొడుకు గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఆయన భార్య పేరు శ్రీ వర్దిని.. ఆమె కూడా ప్లే బ్యాక్ సింగర్.. ఆవిడను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె గతంలో మణిశర్మ – యువన్ శంకర్ రాజా వద్ద పని చేసింది. ఆమె తమను కంపోజింగ్ లో కూడా కొన్ని పాటలను పడిందట. కానీ తన సినిమాల ద్వారా ఆమెను ప్రమోట్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు.
ఆమె వాయిస్ చాలా బాగుంటుంది.నిర్మాతలు దర్శకులు భావిస్తేనే ఆమెతో పాటలు పాడిస్తానని అన్నారు.. అయితే రాబోయే రోజుల్లో తన భార్యతో కలిసి స్టేజ్ షోలు కూడా చేయాలని తమన్ భావిస్తున్నారట.. అలా చేయాలంటే ఆమె కనీసం 1,2 సూపర్ హిట్ పాటలు పాడి ఉండాలనే కండీషన్ పెట్టారు.
ఇక తమను కొడుకు అచ్యుత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడని, మొదటిగా నా ట్యూన్ అతనే వింటాడని, అలా విన్న తర్వాత అభిప్రాయం చెబుతాడు. అలాగే అచ్యుత్ కు సంగీతానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటంలో ఒక మంచి పట్టు ఉంది. పియానో వాయించడం లో నాలుగవ గ్రేడ్ కూడా పూర్తి చేశారు.. కానీ అతడు ఏ ప్రొఫెషన్ ను ఎంచుకుంటాడో..నాకు తెలియదని తమన్ చెప్పారు.



