మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తాజాగా నటించిన చిత్రం కాదల్ ది కోర్. ఈ చిత్రం నవంబర్ 23న విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ ని అందుకుంది. కానీ ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. మమ్ముట్టి ఎంత పెద్ద హీరో అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి తన కెరీర్ ని పై స్థాయిలో ఉంచుతూ మూడు జాతీయస్థాయి అవార్డులను కూడా గెలుచుకున్న మమ్ముట్టి ఈసారి కొత్తగా ఒక గే పాత్రలో కనిపించారు. ఒక సంసార బాధ్యతలతో ఉన్న గే సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనే కాన్సెప్ట్ ఈ చిత్రం ఉండబోతుంది.
అయితే ఈ చిత్రం గురించి చెప్పిన వెంటనే కాంట్రవర్సీలు ఎక్కువగానే వచ్చాయి. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది “ద గ్రేట్ ఇండియన్ కిచెన్” డైరెక్టర్ జియో బేబీ. జియో బేబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా అనగానే ఫాలోవర్స్ లోనూ, ఫ్యాన్స్ లోనూ ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ సినిమాలో కథానాయకగా జ్యోతిక నటించడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీ అంచనాలకు రేగాయి. కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారు అప్పుడే గే పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు అన్న విషయం మీద చాలామంది కాంట్రవర్సీలు వచ్చాయి.

ఈ వయసులో కూడా ఇలాంటి పాత్రలు అవసరమా? దీనివల్ల సమాజానికి చెప్పుకొస్తుంది ఏంటి? ఇంత మర్యాదగల మనిషి తన మర్యాదను కోల్పోయేటట్టు ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అని విమర్శలు ఇస్తున్నారు. ఇక ఈ కథ విషయానికొస్తే సినిమాలో మమ్ముట్టి పెళ్లయిన తర్వాత పాలిటిక్స్ లోకి రావాలనుకుంటారు. అదే సమయంలో తన భార్య అయిన జ్యోతిక విడాకులకు అప్లై చేస్తుంది. దానికి కారణం అతను గే అని తెలియడం. సమాజంలో అతనికి ఎలాంటి సమస్యలు వస్తాయి అనే దానిమీద ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా ఎన్ని కాంట్రవర్సీలకు గురైనా సరే మంచి రెస్పాన్స్ నే ప్రజల దగ్గర నుంచి అందుకుంది. సినిమా విడుదలై మంచి కలెక్షన్స్ ని కూడా సంపాదిస్తుంది. ఇప్పటికీ కేరళలో హౌస్ ఫుల్ షోస్ నడుస్తున్నాయి.

ఈ సినిమా మీద కాంట్రవర్సీల గురించి జవాబు ఇస్తూ ఈ సినిమా కేవలం ఇప్పుడున్న మనుషులకు ఒక ఇన్స్పైరింగ్ మూవీ గా అనిపించాలి. అదే పరిస్థితుల్లో ఎవరు ఉన్నా వాళ్ళకి ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అందుకే అలాంటి వాళ్ల కోసమని ఈ సినిమా తీశాము. నేను ఈ కథ చెప్పిన వెంటనే మమ్ముట్టి గారికి ఈ సినిమా స్టోరీ అర్థమయ్యి ఈ కథకు ఒప్పుకున్నారు అని జియో బేబీ చెప్పారు. ఎన్ని కాంట్రవర్సీలకు గురైన సరే ఆఖరికి సినిమా హిట్ గా నిలవడంతో మంచి కలెక్షన్లు అందుకుని హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాత్రలను పోషించినందుకు మమ్ముట్టి ,జ్యోతికలకి కూడా మంచి పేరు వచ్చింది.













లెజెండరీ దర్శకుడు కె వి రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక చిత్రంలో శివుడిగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఆ సమయంలో ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్. పరమశివుడి క్యారెక్టర్ చేసేటపుడు శివుడి మెడలో నాగుపాము కూడా ఉండాలి. నాగుపాము కోసం అప్పట్లో రబ్బర్ పాములను కొందరు ఉపయోగించేవారు. మరికొందరు కోరలు తీసిన పాములను షూటింగ్ కోసం వాడేవారు. ఎన్టీఆర్ కి రబ్బర్ పామును వాడడం వల్ల ఎలర్జీ రావడంతో ఈ మూవీ షూటింగ్ లో కోరలు లేని పామును ఉపయోగించారు.
సన్నివేశాన్ని షూట్ చేసే ముందు పాములను ఆడించే అతను ఆ పాముకి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ క్రమంలోనే పాముకి ట్రైనింగ్ ఇవ్వడం చూసిన ఎన్టీఆర్, అతన్ని ఏమి చేస్తున్నారని ప్రశ్నించారంట. దానికి సింగీతం శ్రీనివాస్ పాము మెడలోకి వెళ్ళేలా ట్రైనింగ్ ఇస్తున్నారని అన్నారంట. అప్పుడు ఎన్టీఆర్ “అలాంటిది ఏమి అవసరం లేదు. వారిని వదిలిపెట్టండి. మెడలోకి ఆయనే వస్తారు” అని అన్నారంట. ఎన్టీఆర్ అలా అనగానే దర్శకుడు కె వి రెడ్డి “ఆయనికి బ్రెయిన్ ఉందని, పాముకి కూడా బ్రెయిన్ ఉంటదని భావిస్తున్నాడా ” అని అన్నారంట.
ఈ సన్నివేశం మొదలై, వెనకాల సౌండ్ స్టార్ట్ కాగానే ఆ పాము నెమ్మదిగా వెళ్లి ఎన్టీఆర్ మెడకి చుట్టుకుని ఆభరణంలా కనిపించిందంట. ఆ దృశ్యాన్ని చూసిన కె వి రెడ్డి, “రామారావు నువ్వు చాలా గొప్పవాడివి, అంతకుమించిన వాడివి” అంటూ దణ్ణం పెట్టారంట. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గత ఏడాది మే 28 నుండి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు.


కళాతపస్వి కె విశ్వనాధ్ మూవీ అంటేనే, దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో సంగీత, నృత్య, సాహిత్య, కళాత్మక విలువల గురించి అద్భుతంగా చూపిస్తుంటారు. అదేకోవలో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్వర్ణ కమలం. ఈ మూవీ అప్పట్లో బంపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్, భానుప్రియ జంటగా నటించగా కీలక పాత్రలలో చాలామంది నటీనటులు కనిపించారు.
కళ అనేది జన్మ జన్మల పుణ్యం వల్లే వస్తుందని గ్రహించలేని వేదపండితుడి కూతురు కథే ఈ మూవీ. సమాజం వేగంగా మారుతోంది. దానితో పాటే మనమూ వెళ్లాలి. సంప్రదాయ కళలనే నమ్ముకుని బావిలో కప్పల బతకడం ఏమిటి అనుకునే మీనాక్షి పాత్రలో భానుప్రియ అద్భుతంగా నటించింది. మూవీ ప్రారంభంలో తండ్రి నేర్పించిన కూచిపూడి నాట్యం కడుపు నింపదనే భావనతో అయిష్టత ప్రదర్శస్తుంటుంది. ఆ సమయంలో ఆమె తయారయ్యే విధానం కూడా గందరగోళంగా ఉంటుంది.
కానీ ఆమెలో మార్పు వచ్చిన తరువాత ఆమె తయారయ్యే విధానంలో మార్పును చూపిస్తూ, దర్శకుడు ఆ విషయాన్ని స్పష్టంగా ఆ సన్నివేశంలో చూపించారు. అప్పటి ప్రేక్షకులు ఈ విషయాన్ని ఎంతవరకు గ్రహించారో లేదో కానీ, ఒక మూవీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించారు. ఆ ఇంటర్వ్యూ కు ఈ రెండు సీన్స్ ను కలిపి చందమామ కథలు అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేస్తూ, అసలు పాత సినిమాలలోనే చాలా కొత్త విషయాలు ఉన్నాయి. కానీ మనం గ్రహించలేదు అంటూ రాసుకొచ్చారు.






