కష్టాలు మనిషిని మరింత దృఢంగా చేస్తాయి. ఇక అవకాశాలు అట్టడుగున ఉన్నవారిని కూడా అందలం ఎక్కేలా చేస్తాయి. ఈ విషయం బుల్లితెర నటి పవిత్ర జైరామ్ జీవితంలో నిజమైంది. అలా జీవిత ప్రయాణంలో ఆమె సంతోషకరమైన దశకు చేరుకున్నారు.
ఆమె ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘త్రినయని’ సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ ని తన నటనతో ఆకట్టుకున్నారు. పవిత్ర జైరామ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. పవిత్ర జైరామ్ మాట్లాడుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో మాండ్య నుండి బెంగళూరు వచ్చినట్టుగా తెలిపారు. ఎక్కువగా చదువుకోలేదని, దాంతో హౌజ్ కీపింగ్ పని కూడా కొన్ని రోజులు చేశానని తెలిపారు. బట్టల షాప్ లో, లైబ్రరీలో కూడా ఉద్యోగాలు చేసినట్టుగా చెప్పారు.
అయితే తను ఇబ్బందులు పడటం చూసిన ఒక ఫ్రెండ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ అయిన సిరిగంధం శ్రీనివాసమూర్తి నంబర్ ఇచ్చారు. దాంతో వెళ్లి ఆయనను కలిశాను. అయితే ఆయన అప్పటికే గిరిజనుల మీద డాక్యుమెంటరీ సినిమాలు తీస్తున్నారు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చారు. ఆ క్రమంలో కన్నడ సీరియల్స్లో చేయాలనే ఐడియా వచ్చింది. దాంతో సీరియల్ ఆడిషన్స్కి వెళ్ళేదాన్నని, కానీ చిన్నచిన్న రోల్స్ వచ్చేవని అన్నారు. ఆ తరువాత ‘జోకాలి’ అనే కన్నడ సీరియల్లో హీరోకి చెల్లెలి క్యారెక్టర్ వచ్చింది.
అనంతరం తెలుగులో ‘నిన్నే పెళ్లాడుతా’ అనే సీరియల్ ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సమయానికి నాకు తెలుగు కొంచెం కూడా తెలియదని, కానీ అందులో నటించేవారంతా తెలుగువాళ్లే. వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఏమి అర్దం కాక సైలెంట్ ఉండేదాన్ని. దాంతో సీరియల్స్ వద్దని, పారిపోవాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే నా పరిస్థితి అర్ధం చేసుకున్న సహనటులు ధైర్యం చెప్పారు. అలాగే తెలుగు చదవడం, రాయడం నేర్పారు. అలా నేను తెలుగు నేర్చుకున్నానని తెలిపారు.
తెలుగులో బుచ్చినాయుడు కండ్రిగ అనే సినిమాలో నటించానని, కరోనా టైమ్ లో ఓటీటీలో రిలీజ్ అయిందని చెప్పారు. ప్రతి రోజూ జిమ్కు వెళ్తానని, గ్లామర్ రంగంలో ఉన్నప్పుడు అందం, ఆరోగ్యం రెండింటిని కాపాడుకోవాలని అన్నారు. తన ఫ్యామిలీ గురించి చెప్తూ తన భర్త పేరు చంద్రకాంత్ అని, ఒక పాప, ఒక బాబు ఉన్నారని తెలిపారు.
Also Read: ఇలాంటివి మన “సీరియల్స్” లో మాత్రమే జరుగుతాయి అనుకుంటా..? ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!



1.అల్లు అర్జున్:
2. విజయ్ దేవరకొండ:
3. రామ్ చరణ్:
4. మహేష్ బాబు:
5. ప్రభాస్:
6. జూనియర్ ఎన్టీఆర్:
7. నాని:
8. రామ్ పోతినేని:
9. వరుణ్ తేజ్:
10. అఖిల్ అక్కినేని:
Also Read: 



















మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ చక్రవర్తి. ఆయన 1950లో జూన్ 16న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో బెంగాలీ దిగువ మధ్యతరగతి హిందూ ఫ్యామిలిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి చక్రవర్తి దంపతులకు. అతను ఓరియంటల్ సెమినరీలో చదువుకున్నాడు మరియు తరువాత తన బీఎస్సి కోల్కతాలోని స్కాటిష్ చర్చి కళాశాల చేశాడు. ఆ తరువాత, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాడు.
బెంగాల్ లో నక్సలైట్ ఉద్యమం మొదలైన తరువాత ఇతర వేలాది బెంగాలీ యువకుల లాగానే, మిథున్ కూడా 1960ల చివరలో నక్సల్ పోరాటంలోకి వెళ్లారు. కోల్కతాలో నక్సలైట్ పోరాటం జరిగే టైమ్ లో చారు మజుందార్తో పనిచేశారు. అయితే నక్సలైట్ల పై పోలీసుల అణిచివేత వల్ల మిథున్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నక్సలైట్ గా మరడంతో ఆయన ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. అదే సమయంలో మిధున్ సోదరుడు యాక్సిడెంట్ లో మరణించడంతో తిరిగి ఇంటికి వచ్చిన మిథున్ మళ్ళీ అటు వైపు చూడలేదు.
ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఒక్క పూట భోజనం కూడా దొరికేది కాదు. కొరయోగ్రాఫర్ హెలెన్ దగ్గర చేరారు. స్టేజ్ పై డ్యాన్స్ చేసేవాడు. తన డ్యాన్స్ చూసి అయినా సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో అని. ఎన్ని రోజులు 1976లో మృగయా మూవీతో మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని సంచలనం సృష్టించారు. ఆ తరువాత పలు సినిమాలలో నటించినా, 1982లో వచ్చిన ‘డిస్కో డాన్సర్’ మూవీతో సూపర్స్టార్డమ్ అందుకున్నాడు.
దేశంలోనే తొలి వందకోట్ల మూవీగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఇండియాలోనే కాకుండా రష్యాలో కూడా పాపులారిటీ పొందారు. డ్యాన్స్ స్టార్గా పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు చేసి అగ్రహీరోగా మారారు. ఓ దశలో వరుసగా 33 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ చెక్కచెదరలేదు. 1979లో నటి యోగీతా బాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు మిమోహ్, ఉష్మే చక్రవర్తి , నమషి చక్రవర్తి , దత్తపుత్రిక దిశాని చక్రవర్తి. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన మిథున్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.
జైలర్ మూవీలో కు విలన్ గా, సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఈ మూవీలో నటనతో ఆకట్టుకున్న వ్యక్తి మలయాళ యాక్టర్ వినాయగన్. ఇతను నటుడు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కూడా. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించే వినాయగన్ పలు తమిళ చిత్రాలలో కూడా నటించారు
వినాయకన్ తొలిసారిగా 1995లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళంలో వచ్చిన ‘మాంత్రికం’ మూవీలో నటించాడు. వినాయకన్ తర్వాత కలి, ఒరుతీ, ట్రాన్స్, మరియు పద వంటి సినిమలలో నటించారు. 2016లో, దర్శకుడు రాజీవ్ రవి తెరకెక్కించిన ‘కమ్మటిపాడమ్‘ లో గంగ పాత్రలో తన నటనకు గాను వినాయకన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
తమిళంలో వినాయకన్ నటించిన ఏడవ సినిమా జైలర్. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఎంత క్రూరంగా ఉంటుందో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కనిపిస్తుంది. వినాయకన్ తెలుగులో కూడా నటించాడు. అయితే అతను ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘అసాధ్యుడు’. అనే సినిమాలో విలన్ నటించాడు.