చాలా మంది ఇంటికి బూడిద గుమ్మడికాయని కడుతూ ఉంటారు. మీరు కూడా మీ ఇంటికి బూడిద గుమ్మడికాయని అందరూ కడుతున్నారని కడుతున్నారా..? అయితే తప్పకుండా దాని వెనుక ఉండే కారణం తెలుసుకోవాలి. చాలా మంది ఎవరో చెప్పారనో లేదు అంటే అందరూ చేస్తున్నారనో బూడిద గుమ్మడికాయను ఇంటికి కడుతూ ఉంటారు. అయితే నిజానికి బూడిద గుమ్మడికాయని ఇంటి కట్టడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనం మనం పొందవచ్చు.
బూడిద గుమ్మడికాయ ఏడాది పొడవునా కూడా నిల్వ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా బూడిద గుమ్మడికాయ ఎంతో మేలు చేస్తుంది. ఇంటికి బూడిద గుమ్మడికాయ కడితే నెగటివ్ ఎనర్జీ అది లాక్కొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలానే ఇంటి పై పడిన చెడు ప్రభావం లేదా చెడు దోషాలను కూడా అది లాక్కుంటుంది. నరదృష్టి, చెడు ప్రభావం ఇంటి పైన పడకుండా అది కాపాడుతుంది.

ఇందుమూలంగానే బూడిద గుమ్మడికాయని ఇంటికి కడతారు. ఒక్కోసారి మనం చూస్తే ఆ గుమ్మడికాయ కుళ్ళి పోయి ఉంటుంది. ఒకవేళ కనుక అది కుళ్లిపోయి ఉన్నట్లయితే ఇంటి పైన చెడు ప్రభావం ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. కుళ్ళిన గుమ్మడికాయను తీసేసి ఆ స్థానం లో మరొక కొత్త బూడిద గుమ్మడికాయ కట్టాలి.

దీంతో ఇంటి పై చెడు ప్రభావం పడదు. బూడిద గుమ్మడికాయ కట్టిన తర్వాత అగరవత్తుల ధుపం వేసి వెలిగిస్తే మంచిది. చూశారు కదా చెడు ప్రభావం ఇంటిపై పడకుండా ఉండాలంటే ఏ విధంగా పాటించాలి అనేది.. మరి మీ ఇంటి మీద కూడా చెడు ప్రభావం కలగకుండా ఉండాలంటే ఇలా అనుసరించండి.

శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారము రామావతారము. దేవుడు అయినప్పటికి రాముడు జన్మించినప్పటి నుండి అవతారం చాలించే వరకు మానవుడుగానే జీవించారు. తన వ్యక్తిత్వంతో, సకల గుణాలతో అందరికి ఆదర్శంగా నిలిచి దేవుడిగా మారాడు. అందుకే సకల గుణాభిరాముడిగా పిలుస్తారు. తండ్రి మాట కోసం 14 ఏళ్ల పాటు అరణ్యవాసం చేసాడు. సీతను ఎత్తుకెళ్లిన రావణుడితో యుద్ధం చేసి, భార్యను తిరిగి పొందాడు. అయోధ్యకు తిరిగివచ్చిన తరువాత రాజుగా పట్టాభిషేక్తుడు అయ్యాడు. ఆయన పాలించిన సమయాన్ని రామరాజ్యం అని పిలుస్తారు.
రామాయణం ఉత్తర కాండలో రామరాజ్యం గురించి స్పష్టమైన వివరాలు లేనప్పటికీ, రామాయణం ప్రారంభం నుండి రాముడి వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి మహర్షి వాల్మీకి చెప్పిన విషయాలను అనుసరించి రామరాజ్యం గురించి అర్ధం చేసుకోవచ్చు. శ్రీ రాముడు పట్టాభిషిక్తుడైన అనంతరం 11 వేల సంవత్సరాల పాటు అయోధ్యని పాలించాడు. శ్రీ రాముడి పాలన చాలా ఆదర్శవంతమైనది. వేద శాస్త్రాల ప్రకారం ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వాడు. ఎవ్వరినీ కష్ట పెట్టలేదు. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు. ఎవరి ధర్మాలు వారు పాటించేవారు.
రాజ్యం బాగుండడం అంటే అక్కడి ప్రజలందరు ధనవంతులు అని కాదు. శ్రీ రాముని పాలనలో దొంగతనం, కరవు లేదని అంటారు. రాముని పాలనలో ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో సంతృప్తిగా జీవించేవారట. వర్షాలు సరైన సమయంలో పడేవట. నెలలో మూడు సార్లు వర్షం కురవడంతో పంటలు బాగా పండేవి. రాజ్యం సశ్యామలంగా ఉండేదట. రాముని రాజ్యంలో అందరికి సమంగా న్యాయం జరిగేది. అందువల్లనే రామరాజ్యం అని చెబుతారు.














ముఖేష్ అంబానీ దేశంలోని చాలా పుణ్యక్షేత్రాలకు తరచూగా వెళుతుంటారు. అయితే ఈ దేవాలయాలలో ఒకటైన నాథద్వారాలో ఉన్న శ్రీనాథ్ దేవాలయం. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి చాలాకాలం నుండి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. ఈ దేవాలయాన్ని అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్టుడు శ్రీనాథుడు అవతారంలో కొలువై వున్నాడు.
17వ శతాబ్ధంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మహారాజా రాజాసింగ్ ఈ ఆలయాన్ని కట్టించారు. శ్రీనాథ్ ఆలయానికి విశాలమైన ప్రాంగణం ఉంది. ఆలయంలోనికి వెళ్లేందుకు నాలుగు వైపులా ద్వారాలు నిర్మించి ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీనాథుడు శ్యామల వర్ణంలో కనిపిస్తాడు. ఈ ఆలయానికి రాజస్థాన్కు ప్రజలు తరచూగా వస్తుంటారు. హోలీ పండుగ రోజు ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో ఆలయం జనంతో నిండిపోతుంది.
ఈ త్రినాథ్ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని అంటారు. ఇక ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ నాథద్వారా ఉదయపూర్ కు దగ్గరగా ఉంది. నాథద్వారాకు ట్రైన్ లేదా విమానంలో ఉదయ్పూర్ వరకు వెళ్ళి, అక్కడి నుండి త్రినాథ్ ఆలయానికి వెళ్లవచ్చు.

భైరవకోన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి అనే గ్రామానికి సమీపంగా వుంది. కొత్తపల్లి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్య క్షేత్రం కలదు.చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, భైరవకోన ఆలయ చరిత్ర 7వ శతాబ్దానికి చెందినది. ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఏమిటంటే, ఒకప్పుడు కాల భైరవుడు ఈ ప్రాంతాన్ని పాలించాడని అందువల్లనే దీనికి భైరవకోన ఆలయం అని పేరు వచ్చిందని అంటారు. కాల భైరవుడు ఈ ప్రదేశానికి కాపలాగా ఉంటాడని చెబుతారు.
దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పురాతన హిందూ దేవాలయాలు కనుగొన్నది భైరవకోనలోనే. ఇక్కడ 8 హైందవ దేవాలయాలున్నాయి. పల్లవరాజులు ఈ శివాలయాలను అద్భుతంగా నిర్మించారు. కొండల్ని గుహాలయాలుగా మలచటం పల్లవరాజుల కాలంలోని గొప్ప కళ. ఇక ఈ గుహల గోడల పైన పల్లవుల కాలంలోని అనేక శిల్పకళలను చూడవచ్చును. వీటిని పల్లవ శిల్పులు అయిన దేరుకంతి, శ్రీశైలముని వంటివారు భైరవకోన క్షేత్రాన్ని మలిచినట్టుగా చరిత్ర చెబుతోంది. ఒకే కొండలో 8 ఆలయాలు, వాటి చుట్టూ ఎటు చూసినా నల్లమల అడవులు 8 ఆలయాలలో దేవుళ్ళు శిలా రూపంలో దర్శనమిస్తారు.
ఇక్కడ ఒకే కొండలో 8 ఆలయాలు చెక్కిన విధానం ఎంతో అపురూపంగా ఉంటుంది. అన్నీ శివాలయాలు. అవి శశినాగ, రుద్రేశ్వర, నగరికేశ్వర, విశ్వేశ్వర, మల్లికార్జున, భార్గేశ్వర, రామేశ్వర, పక్షమాలిక లింగ. ఇందులో 7 దేవాలయాలు తూర్పుముఖానికీ ఉండగా, ఒకటి దేవాలయం మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. ఆలయాలలోని శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కారు. ఇక్కడ త్రిమూర్తులను ఒకే ఆలయంలో పూజిస్తారు. శివలింగం మధ్యలో ఉండగా గుహ గోడల పై ఒకవైపు గోడ పై బ్రహ్మ, మరొక వైపు గోడ పై విష్ణువులు శిల్పారుపాలలో ఉన్నారు.
శివాలయాలన్నీ పై వరసలో ఉండగా, కింద ఉండే ఆలయంలో త్రిముఖ దుర్గ, శివలింగం పూజలు అందు కుంటున్నాయి. దుర్గ దేవి ఆలయంలో దుర్గాదేవి మూడు ముఖాలతో ఉంటుంది. దుర్గాదేవి కుడివైపున మహాకాళి ముఖం, నోట్లోంచి జ్వాల వస్తున్నట్టుగా వుంటుంది. మధ్యన మహాలక్ష్మి, ప్రసన్నమైన ముఖం. ఎడమవైపున ముఖం సరస్వతీదేవి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ సరస్వతీ దేవి అద్దం చూసుకుంటూ కనిపిస్తుంది.
అమ్మవారి విగ్రహం పైన కార్తీకపౌర్ణమి రోజున చంద్ర కిరణాలు పడటం భైరవకోన మరో విశేషం. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున చంద్ర బింబం, దుర్గ ఆలయాలనికి 3 అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి, ఆ చంద్ర కిరణాలు దుర్గాదేవి విగ్రహం పై పడుతాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు తరలి వస్తారు.