మీరెప్పుడైనా గమనించారా..? భారత దేశంలో చాలా దేవాలయాల్లో గుడి ప్రాంగణంలో ఉండే గోడలపైనా..గోపురాలపైనా శృంగార చిత్రాల తాలూకు బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని శిల్పిల చేత ప్రత్యేకంగా చెక్కిస్తారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణం లో ఇలాంటి బొమ్మలు ఎందుకు చెక్కిస్తారో తెలుసా..?
దేవాలయాల్లో ఇలాంటి బొమ్మలను చెక్కించడం వెనక నాలుగు థియరీలు కారణం అయి ఉండవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిది ఏంటంటే.. మానవ జీవితం ప్రధానంగా ధర్మం, అర్ధం, కామం, మోక్షం అన్న అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇందుకు తగ్గట్లే దేవాలయాల నిర్మాణం కూడా జరుగుతుంది. దేవాలయాల్లో ఉండే భగవంతుని విగ్రహాలు ధర్మానికి ప్రతీకలు. అలాగే.. దేవాలయాల్లో ఉండే నగలు, వజ్రాలు వంటివి అర్ధానికి (అర్ధం అనగా సంపద) కు ప్రతీకగా ఉంటాయి. ఇక కామం అన్న విషయాన్ని చూపించడానికే ఇటువంటి బొమ్మలను పెట్టారని తెలుస్తుంది. ఈ విషయాలను సక్రమంగా ఫాలో అయితేనే మోక్షం లభిస్తుందని చెప్పడం దీని వెనుక అసలు ఉద్దేశ్యం.
ఇక రెండవ థియరీకి వస్తే.. మన దేశాన్ని ఎక్కువగా బ్రిటిష్ వారు పరిపాలించారు. ఫారినర్స్ ఏ విషయంలో అయిన నిక్కచ్చితత్వాన్ని పాటిస్తారు. ఓపెన్ గా ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకి టైటానిక్ సినిమాలో కూడా ఆర్ట్ ను వ్యక్తపరిచే సీన్ లో హీరోయిన్ ని న్యూడ్ గా చూపిస్తారు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వారు అవడం వల్లే దేవాలయాల్లో ఈ విగ్రహాలను చెక్కించి ఉండవచ్చు.
మూడవ థియరీ ఏమిటంటే.. మనం జాగ్రత్తగా గమనించి చూస్తే.. ఈ విగ్రహాలు గుడికి బయట, గోడలపైనే ఉంటాయి తప్ప గుడి లోపల గాని, గర్భ గుడి వద్ద కానీ ఉండవు. అంటే.. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనసులో ఉండే దురాలోచనలు వదిలేసి.. గుడిలోకి నిశ్చల మనస్సుతో వెళ్లాలని అర్ధం. మరొక థియరీ ఏంటంటే.. అప్పట్లో జనాలకి లైంగిక విద్యపై అంత అవగాహన లేదు. కాబట్టి అది కల్పించడం కోసం.. అందరు వెళ్లే దేవాలయంలో ఇలా చెక్కించి ఉంటారు.
అశ్లీలం అనుకోకండి…అసలు కథ ఏంటో చూడండి…! 👇👇👇