కొన్ని సంఘటనలు మనలని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాయి. అయితే ఈ సంఘటనల పరిణామాలని చూస్తే ఒక్కోసారి జాలి కలుగుతూ ఉంటుంది. అలాంటి సంఘటనే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మదనపల్లిలో చోటు చేసుకుంది. ఇంటర్ లో పరిచయమైన స్నేహం ప్రేమగా మారింది. ఇందులో విచిత్రం ఏమీ లేదు. కానీ స్నేహం ప్రేమగా మారింది ఇద్దరు అబ్బాయిల మధ్య.
ఏపీలోని మదనపల్లి మండలం వెంగంవారిపల్లె కు చెందిన ఓ కాలేజీలో అదే గ్రామానికి చెందిన లోకేష్ కు ములకలచెరువు మండలం పత్తికోటకు చెందిన మహేష్ కు పరిచయం ఏర్పడింది.
వీరు మదనపల్లి లోనే ఇంటర్ పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తరువాత వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. చివరకు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనితో లోకేష్ ను అమ్మాయిగా మారాలంటూ మహేష్ కోరడంతో లోకేష్ కూడా అందుకు అంగీకరించాడు. స్వీటీ గా మారిపోయాడు. ఆ తరువాత వీరిద్దరూ ఆరేళ్ళ పాటు సహజీవనం చేసారు.
అయితే ఉన్నట్లుండి మహేష్ లో మార్పు వచ్చింది. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని.. తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. దీనితో షాక్ అయిన స్వీటీ పోలీసులను ఆశ్రయించింది. లోకేష్ కోసం తాను మగతనాన్ని త్యాగం చేసానని.. కానీ నన్ను అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరినీ పిలిపించి విచారిస్తున్నారు.













కోయంబత్తూరు సోమయం పాల్యంకు చెందినటువంటి ప్రశాంత్.. రఘునాథ పురానికి చెందినటువంటి హెచ్.తేజస్విని ఒక ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా దగ్గర అయిపోయారు. అది ఎంతలా అంటే ఒకరికొకరు ఏదైనా చేసే అంత.
ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు చాలా అలవాటు పడ్డాడు. వాటి కోసం పదిహేను లక్షల రూపాయల వరకు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. దీంతో అప్పిచ్చిన వాళ్లంతా ప్రశాంత్ పై ఒత్తిడి చేయడంతో ఆ విషయాన్ని తన లవర్ తేజస్వికి చెప్పుకున్నాడు. దీంతో ఇద్దరూ ఎలాగైనా మనీ సంపాదించాలని ఈజి మని కోసం దొంగతనాల బాటపట్టారు. తేజస్వినికి స్కూటీ కూడా ఉంది. ఆ బండి పై తొండమూత్తూరు వైపు వెళ్లారు.
అక్కడ ఫైర్ స్టేషన్ సమీపంలో మేకలు కాస్తున్న వృద్ధురాలి దగ్గరికి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెళ్లారు. ఆ ముసలావిడను అడ్రస్ అడిగినట్టే అడిగి మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కొని స్కూటీపై ఇద్దరు పరారయ్యారు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ పరిశీలించి తమదైన శైలిలో విచారణ చేపట్టి తేజస్విని బైక్ నెంబర్ ను గుర్తించారు. దాని ఆధారంగా అడ్రస్ పట్టుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టైల్ లో విచారించగా జరిగిన విషయం అంతా ఒప్పుకున్నది. కొన్ని నెలల కిందట ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా కనిపించడం లేదని ప్రశాంత్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో ప్రశాంత్ ఆ బంగారాన్ని దొంగిలించినట్లు కూడా తేలింది. ఈ డబ్బంతా ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నామని ప్రశాంత్ తెలియజేశాడు. దీంతో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రశాంత్ మరియు తేజస్విని తల్లిదండ్రులు ఇద్దరు బడా వ్యాపారస్తులే..


#2
#3
#4
#5
#6
#7



