రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే. ఇప్పటికే నాలుగు రోజులు యుద్ధం సాగి 5వ రోజు కూడా కొనసాగుతోంది. రష్యా యుద్ధం నుంచి వెనక్కి తిరిగేలా కనబడడం లేదు. ఇదిలా ఉంటే చాలా మంది విద్యార్థులు భారతదేశం నుండి ఉక్రెయిన్ కి వెళ్లి చదువుకుంటున్నారు.
అయితే వాళ్ళని ప్రభుత్వం తీసుకు రావాలని ఆపరేషన్ గంగా పేరుతో మిషన్ ని మొదలు పెట్టి… స్వదేశానికి భారత విద్యార్థులను తీసుకు వస్తున్నారు. పైగా ఇది సులభం కాదు.
ప్రభుత్వం ఎన్నో కష్టాలను వాళ్ళను తీసుకు రావడానికి ఎదుర్కొంటోంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుండి భారత దేశానికి తిరిగి వచ్చారు. తాజాగా ఒక అమ్మాయి విశాఖ ఎయిర్ పోర్ట్ కి ఉక్రెయిన్ నుండి రావడం జరిగింది. నిజంగా తల్లి ప్రేమ ఏమిటో ఇక్కడ మనం చూడొచ్చు. ఏ తల్లి కూడా బిడ్డ ఆకలితో ఉంటే చూడలేదు. ఉక్రెయిన్ నుండి వచ్చిన అమ్మాయికి తన తల్లి ఎయిర్ పోర్ట్ లోనే బిర్యాని తినిపించింది.
ఈ సంఘటన ఇప్పుడు అందరి మనసుని ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. తేజస్వి తూర్పు గోదావరి కి చెందిన అమ్మాయి. తను ఉక్రెయిన్ లో చదువుకుంటుంది. అయితే తన తల్లి రామలక్ష్మి విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కి ఆమె రాగానే తూర్పుగోదావరి జిల్లా నుండి వెళ్లి… ఆమెకి తన చేతితో బిర్యాని తినిపించింది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. పైగా వీడియో చూసిన అందరూ తల్లి ప్రేమను తలుచుకుని.. ఇలాగే ఉంటుంది తల్లి ప్రేమ అంటే అని అంటున్నారు. చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్ లో సతమతమవుతున్నారు. పైగా తిండి లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. వాళ్లను కూడా సురక్షితంగా ఇక్కడికి తీసుకు రావాలని ప్రభుత్వం చూస్తోంది.