కరోనా మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చిన తరువాత మనం ఇంటికే పరిమితం అయిపోయాం. మరీ అత్యవసరాలకు తప్పిస్తే.. బయటకు వెళ్ళడానికి ఎవరు పెద్ద గా ఆసక్తి కనబరచడం లేదు. మరో వైపు పిల్లలను పాఠశాలలకు కూడా పంపించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ స్కూలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

ఉపాధ్యాయులు జూమ్ మీటింగ్ ద్వారానే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమం లో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే చిన్న పిల్లలను త్వరగా అట్ట్రాక్ట్ చేసే అడ్వేర్టైజ్మెంట్ లు మరో వైపు. ఇటీవల ఓ పిల్లాడు ఆన్ లైన్ క్లాస్ టైం లో పాఠం వింటూ ఉండగా వచ్చిన నోటిఫికేషన్ ను చూసాడు. “వంద రూపాయలతో ఆడి రెండు వందల రూపాయలు గెలవండి..” అంటూ వచ్చిన నోటిఫికేషన్ ను చూసి ఆత్రుత కొద్దీ క్లిక్ చేసాడు.

అంతే వెంటనే.. ఆ ఫోన్ కు లింక్ అప్ అయ్యి ఉన్న బ్యాంకు ఖాతా నుంచి లక్ష యాభై వేల రూపాయలు కట్ అయ్యాయి. దీనితో.. ఆ పిల్లవాడి తల్లి తండ్రులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ లో ఓ గిరిజన తండా కు చెందిన వెంకన్న ఖాతా లో ఇటీవలే ధాన్యం విక్రయం కింద 86 వేల రూపాయలు, రైతు బంధు పధకానికి సంబంధించి పదకొండు వేల రూపాయలు జమ అయ్యాయి. మొత్తం గా అతని అకౌంట్ లో లక్షన్నర నగదు ఉంది.

ఇటీవల విత్తనాలు కొనుక్కోవడానికి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కోసం బ్యాంకు కు వెళ్లగా.. అందులో కేవలం 613 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. దీనితో వెంకన్న హతాశుడయ్యాడు. బ్యాంకు స్టేట్ మెంట్ ను చెక్ చేసుకుని చూడగా జూన్ 15 వ తేదీ నుంచి 17 వ తేదీ లోపు లక్షన్నర రూపాయలు బదిలీ అయినట్లు కనిపించింది. 9 వ తరగతి చదువుతున్న తన కొడుకు ఆన్ లైన్ క్లాస్ ల కోసం ఫోన్ ను కొనిచ్చాడు. ఆ ఫోన్ కె బ్యాంకు ను లింక్ అప్ చేసాడు. దీనివల్లనే ఎక్కడో ఎదో జరిగిందని వెంకన్న అర్ధం చేసుకుని.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను సంప్రదించాడు.


















టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో కోచింగ్ నిమిత్తం విజయనగరం వెళుతోంది. అదే రైలులో ప్రయాణిస్తున్న కొంకి వెంకటేష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడిది వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామం. వెంకటేశ్ దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రెయిన్ దిగిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ తన ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్కు సంబంధించిన ఐడీ కార్డును అక్కడే మర్చిపోయి వెళ్లిపోయాడు.
ఆ కార్డు ప్రమీల కంటపడడంతో, అతడికి అవసరమవుతుందని ఆలోచించి దానిపై ఉన్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసింది. అయితే,ఇక్కడే కథ ప్రారంభమయింది. తాను కావాలనే ఐడీ కార్డు వదిలివెళ్లానని,నిన్ను ప్రేమిస్తున్నానని ప్రమీలకి చెప్పాడు వెంకటేష్.ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెప్పాడు.
కొత్త కాపురం మొదలు పెట్టారు . పదిహేను రోజుల బాగానే కాపురం చేసిన వెంకటేశ్ , వాళ్లింటికి వెళ్లొస్తానని ఒకరోజు వెళ్లాడు .ఇంటి నుండి వచ్చిన నాటినుండి ప్రమీలను గర్భం తీయించేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ప్రమీల ఒప్పుకోలేదు . దాంతో ఇంటికి రావడం మానేసి , ప్రమీలకి పూర్తిగా ముఖం చాటేశాడు.
ప్రమీల ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా కలవకపోగా , కలిసినప్పుడు తక్కువ కులం దానివంటూ దూషించడం మొదలుపెట్టాడు. చేసేదేం లేక , బాధితురాలు తన తల్లితో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు అల్లకల్లోలం కావడం తప్ప ఫలితం ఉండదు . ఇద్దరూ చదువుకుంటున్నవాళ్లు , వీరిద్దరే తల్లిదండ్రులపై ఆధారాపడాల్సిన పరిస్థితి . ఇప్పుడు కడుపులో బిడ్డ భవిష్యత్ ఏంటి??








