ఆడవాళ్ళకి వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం మనం నిత్యం ఎక్కడో ఒక చోట వార్తల్లో చూస్తూనే ఉంటాము…అది ఎలా పెరిగిపోయిందంటే..గతంలో ఎక్కడో ఒక చోట…కొన్ని సార్లు మాత్రం జరిగే..ఇలాంటి ఘటనలు..ఇప్పుడు ప్రతి రోజు మనకు తారస పడుతూనే ఉన్నాయి..నిజానికి చట్టాల్లో ఎన్ని మార్పులు తెచ్చిన కూడా ఆకతాయిలు తమ పనులు మానుకోవాటంలేదు…నిజానికి మార్పులు చట్టాల్లో కాదు..మనుషుల్లో రావాలి.! చరవాణీలు,అంతర్జాలాలు పెరిగిపోయిన తరువాత మరింత శృతి మించి పోతున్నారని చెప్పాలి..

అమ్మాయిల మీద వేధింపులు సామాన్యులకే కాదు..సెలెబ్రెటీలు కూడా బాధితులే..! వారు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలలో వారి లైఫ్ కి సంబంధించి చీకటి ఘటనలు మీడియా తో… చెబుతూ ఉంటారు..ఇలాంటి ఒక చెడు ఘటనే స్టార్ హీరోయిన్ రేజీనాకి ఎదురైన సందర్భాలు ఉన్నాయని ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.తన కాలేజీ,స్కూల్ సమయాల్లో ఎదురైన సంఘటనల గురించి తెలుపుతూ.

‘నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చెన్నైలోని ఈగ థియేటర్ బ్రిడ్జి వద్ద కొందరు యువకులు దుర్భాషలాడారు ఒక యువకుడు తన శరీరం పై చెప్పుకోలేని చోట చెయ్యి తో తాకే ప్రయత్నం కూడా చేసాడు..నా పెదవులపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు..తనకు జరగరాని ఘటన ఏదో జరుగబోతుందని ముందే గమనించి ..ఎదురించే ప్రయత్నం చేశాను..!

స్కూల్ లో కూడా ఇలాంటి కొన్ని ఘటనలే ఎదురయ్యాయి..! అవతల వారిని ఎదురించే అంత బలం నాలో ఉండేది కాదు..ఇలాంటి ఘటనలు కొన్ని ఎదురయ్యాక ఇక ఒక నిర్ణయానికి వచ్చేసా శారేరకంగానే కాదు మానసికంగా కూడా దృడంగా మారాలి అని.దీనితో కసరత్తులు మొదలు పెట్టాను.శరీరంకంగా దృడంగా మారాను.! .అప్పటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ ఒంటరిగా కాకుండా స్నేహితులతో వెళ్లే దాన్ని..మునుపటి తో పోలిస్తే నేటి కాలం యువతులకు మరిన్ని సమస్యలు ఎక్కువయాయ్యి.అనే చెప్పాలి.రోజుకో కొత్త టెక్నాలజీలు పుట్టుకు రావడంతో కొత్త రూపం లో సమస్యలు పుట్టుకు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.



























చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ , తర్వాత తేజ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కమెడియన్ సునీల్ హీరో ఉదయ్ కిరణ్ ల ది సూపర్ హిట్ కాంబో. చిత్రం, నువ్వునేను,మనసంతా నువ్వే ఇలా ఎన్నో చిత్రాల్లో సునీల్ ఉదయ్ కిరణ్ తో కలిసి నటించారు. ప్రేక్షకులని మెప్పించారు . ప్రేక్షకులని నవ్వించడమే కాదు మనసంతా నువ్వే సినిమాలో ఇద్దరి నటనతో ఏడిపించారు కూడా.
అప్పటి జ్ణాపకాలను తలుచుకుని సునీల్ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే .. నువ్వునేను సినిమాలో ఉదయ్ కిరణ్ అథ్లెట్ కదా . చదువులో సున్నా మార్కులు , స్పోర్ట్స్లో మాత్రం ఫ్రైజులన్ని ఉదయ్ వే . ఆ సీన్స్ ఇప్పటికి చాలా ఫన్నీగా ఉంటాయి , మనల్ని నవ్విస్తాయి . నిజానికి సినిమా షూటింగ్ సంధర్బంలో తేజా ఎంత ఫర్ఫెక్ట్ గా ఉంటారో మనకు తెలిసిందే . సీన్ ఫర్ఫెక్ట్ గా రాకపోతే నటీనటులని కొడతారని కూడా టాక్. ఇప్పడు విషయం అది కాదు.
నువ్వు నేను సినిమా ఓపెనింగ్ షాట్లో ఒక రన్నింగ్ రేసు సీనుంటుంది. ఆ సీన్లో రన్నింగ్ చేయడం కోసం అందరూ స్టేట్ రన్నర్స్ నే తీసుకున్నారంట తేజ . పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్ పొందుతూ , అక్కడ రన్నింగ్లో ఫస్ట్ ,సెకండ్ వచ్చిన వాళ్లంట . వాళ్లతో షాట్ ఉదయ్ రన్ చేయాలి . వాళ్లందరిని కూడా బీట్ చేసి ఉదయ్ ఫస్టొచ్చారట . అసలెలా? అంత ఫాస్ట్ గా ఎలా పరిగెత్తావ్ అని సునీల్ , ఉదయ్ ని అడిగితే “నేను చిన్నప్పటి నుండి సిటీ బస్సుల వెనక పరిగెత్తేవాన్ని అన్నారట” నిజంగా హౌ ఫన్నీ కదా .

