ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నియమితురాలైన వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనులలో బిజీ బిజీగా ఉన్నారు. షర్మిల కుమారుడి నిశ్చితార్ధం హైదరాబాద్లో రేపు అనగా జనవరి 18న గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుక కోసం ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి.
షర్మిల నిశ్చితార్ధం మరియు వివాహానికి అన్న వైఎస్ జగన్ తో పాటు స్వపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందర్నీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా రాజారెడ్డి నిశ్చితార్ధ, పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వై ఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు రాజా రెడ్డి వివాహం ప్రియా అల్లూరితో ఫిబ్రవరి 17న జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లికి ఆహ్వానిస్తూ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
అంతేకాకుండా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలకు స్వయంగా ఆహ్వాన పత్రికలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్ధం హైదరాబాద్ లో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలుస్తోంది. వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా షర్మిల ఆహ్వానించారు. అయితే ఈ నిశ్చితార్ధంకు నారా లోకేష్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఈ ఆహ్వానంను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల కోరిన విషయం తెలిసిందే. దాంతో ఈ వేడుక పై అందరి దృష్టి పడింది. ఎవరెవరు హాజరు అవుతారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకంలో భాగంగా మహిళలు తెలంగాణలో ఏ మూల నుండి నుండి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం పల్లె వెలుగు బస్సులలో, సిటీఆర్డీనరీ మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ పధకాన్ని డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మొదటి వారం ఎలాంటి కార్డు లేకున్నా ఉచిత ప్రయాణించే సౌకర్యం ఉండగా, ఆ తర్వాత నుండి టీఎస్ఆర్టీసీ మహిళలకు జీరో టికెట్లు జారీ చేసింది. ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదొ ఒకటి కండక్టర్కు చూపించాలి.ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది.
గతంలో పన్నెండు లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, ఈ పథకం తరువాత దాదాపుగా 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ ఎవరికి ఉండాలో వారికే ఉండాలి. పేయింగ్ కెపాసిటీ ఉండి నెలకు పది వేలు సంపాదిస్తూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే, నా దృష్టిలో వారు బిచ్చమెత్తుకున్నట్లే” అంటూ వెంకటరమణా కామెంట్స్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవులు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జనవరి 22న జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, వీవీఐపీలు, అయోధ్యకు చేరుకోనున్నారు. ఇకపై అయోధ్య రామాలయం హిందూవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కానుంది. ఇక ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా 7 వేల కేజీల హల్వాను ప్రసాదంగా తయారు చేయనున్నారు. ఈ ప్రసాద తయారిని విష్ణు మనోహర్ దక్కించుకున్నారు. ఆయనెవరో కాదు దేశంలోనే ప్రముఖ చెఫ్. ఇప్పటికే విష్ణు మనోహర్ వంటలలో 12 వరల్డ్ రికార్డ్స్ ను సాధించారు.
విష్ణు మనోహర్ 1968లో ఫిబ్రవరి 18 నాగ్ పూర్ లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కుకింగ్ షో యాంకర్ మరియు చెఫ్. విష్ణు మనోహర్కి నాగ్పూర్, పూణే, ఔరంగాబాద్, ఇండోర్, థానే మరియు కళ్యాణ్ నగరాల్లో రసోయ్ పేరుతో చైన్ రెస్టారెంట్ ఉంది. 53 గంటల పాటు వంట చేసి ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక చెఫ్. 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ‘పొడవైన పరాటా’ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 3 గంటల్లో 7000 కిలోల మహా మిసల్ను తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక చెఫ్ మనోహర్.
2018 డిసెంబర్ 20న భారతదేశంలో 3200 కిలోల వంకాయలతో వంట చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3000 కిలోల కిచిడీని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తరువాత ఒక కుండలో 5000 కిలోల కిచిడి చేసిన తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఎన్నో వంటల పుస్తకాలను కూడా రాశారు. తాజాగా 285 నిమిషాలలో అన్నంతో పాటు 75 రకాల డిషెస్ ను తయారు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు రామ మందిర ప్రసాదంను తయారు చేసే బాధ్యతను విష్ణు మనోహర్ తీసుకున్నారు. 7000 కిలోల హల్వాను తయారు చేయడం కోసం 1400 కేజీల భారీ కడాయిని నాగ్ పూర్ నుండి అయోధ్యకు తెప్పించారు. ఈ ప్రసాదాన్ని 1.5 లక్షల భక్తులకు పంచిపెట్టనున్నారు.















కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జనవరి 14 నుండి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించబోతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుండి మొదలయ్యే ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,500 కిలోమీటర్లు సాగి ముంబైలో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బస్సు మరియు కాలినడకన, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ క్రమంలో వంద లోక్సభ స్థానాలను చూడుతూ ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ యాత్రకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా యాత్రకు సంబంధించిన పోస్టర్ ను స్వయంగా తానే తన వాహనానికి అతికించారు. ఆ పోస్టర్ లో రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, భారత్ జోడో న్యాయ్ యాత్ర అని ఉంది. ఈ పోటోలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
“ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను.”
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఝార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లా, కరమ్తాండ్ కు చెందిన సరస్వతి దేవి కు శ్రీరాముడంటే అమితమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చిన అనంతరం సరస్వతి అయోధ్యను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ తిరిగి రామ మందిరం నిర్మించే వరకూ మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇక అప్పటి నుండి తనకు ఏం కావాలన్నా సైగలతో మాత్రమే అడగటం ప్రారంభించారు. అయితే రోజులో సరస్వతి గంట సేపు మాత్రమే తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవారు.
2020లో ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మించడం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తరువాత సరస్వతి దేవి 24 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత ఆమె మౌనం వీడనుంది. ఇక రామ మందిర ప్రారంభోత్సవంకు ఆమెకు ఆహ్వానం అందింది.
సరస్వతి దేవి సోమవారం నాడే అయోధ్యకు ప్రయాణం అయ్యారు. రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆమె మౌనవ్రతాన్ని వీడుతుందని ఆమె కొడుకు హరే రామ్ అగర్వాల్ వెల్లడించారు. స్థానిక ప్రజలు ఆమెను ‘మౌనీమాత’ అని పిలుస్తారు. 1986లో సరస్వతి దేవి భర్త మరణించిన తర్వాత ఆమె తన జీవితాన్నిరామ స్మరణకే అంకితం చేసిందని, యాత్రలు ఎక్కువగా చేస్తారని హరేరామ్ చెప్పుకొచ్చారు.