భారత్ లోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్నిసీఎం జగన్ ఆవిష్కరించి, జాతికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ బందరు రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కర కార్యక్రమం శుక్రవారం నాడు సాయంత్రం జరిగింది.
ఈ కార్యక్రమంలో టూరిజం మినిస్టర్ రోజా, హోం మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజిని, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు. అయితే అంబేద్కర్ విగ్రహ సందర్శనకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. కానీ వారిని పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 205 అడుగుల ఎత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 18.18 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ.404.35 కోట్ల ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం జరిగిన అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.
ఈరోజు నుండి అంబేద్కర్ విగ్రహ సందర్శనకు పర్మిషన్ ఇచ్చినట్టు ప్రకటించారు. దాంతో ఉదయం నుండే అంబేద్కర్ విగ్రహం సందర్శనకు స్మృతి వనంకు ప్రజలు రావడం ప్రారంభించారు. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత పోలీసులు, అధికారులు ప్రజలను అడ్డుకుని, లోపలకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని వెనక్కి పంపిస్తున్నారు. ప్రజలు విశాఖ, అమలాపురం వంటి ప్రాంతాల నుండి వచ్చామని చెప్పినా కూడా అధికారులు రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది.
స్మృతి వనంలోపలికి ప్రజలను అనుమతించక పోవడానికి, మినీ థియేటర్లో ఐప్యాక్ టీం ఆధ్వర్యంలో మంత్రులతో పార్టీ ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. స్మృతివనం దగ్గర రోడ్డు పైన ఆరుగురు మినిస్టర్ల కాన్వాయ్ వెహికిల్స్ ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అనుమతి ప్రకటించి, తీరా అక్కడకు వెళ్ళాక అడ్డుకోవడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తిప్పి పంపుతున్నారంటూ అధికారుల పై ప్రజలు మండిపడుతున్నారు. ఐప్యాక్ టీం, పార్టీ కార్యక్రమ షూటింగ్ కోసం దూరం నుండి వచ్చిన ప్రజలను పోలీసులు అనుమతించకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.





2010 ఏప్రిల్లో షోయబ్ మాలిక్, సానియా మీర్జాల పెళ్లి హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది. ఆ సమయంలో వీరి వివాహం పై పెద్ద ఎత్తున్న చర్చలు జరిగాయి. ఈ జంటకు కుమారుడు ఇజాన్ 2018లో జన్మించారు. సానియా, మాలిక్ మధ్య విభేదాలు వచ్చినట్టు రెండు సంవత్సరాలుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇజాన్ సానియా దగ్గరే దుబాయ్ లో ఉండగా, షోయబ్ మాలిక్ ఎక్కువగా పాక్ లో ఉంటున్నాడు. విడాకుల పై ఇద్దరు బహిరంగంగా మాట్లాడలేదు.
కానీ నెట్టింట్లో క్రిప్టిక్ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే విడాకులు ఇంకా కష్టం అంటూ సానియా పోస్ట్ షేర్ చేసింది. దాంతో విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే సనా జావేద్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. సనా జావేద్ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.
ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్ను పెళ్లి చేసుకుంది. 2023లో నవంబర్ 28న అతనికి విడాకులు ఇచ్చింది. తాజాగా షోయబ్ మాలిక్ని రెండవ సారి పెళ్లి చేసుకుంది. మాలిక్, సనా జావేద్ రిలేషన్ లో ఉన్నారని గత ఏడాది నుండి రూమర్లు వస్తున్నాయి.
విగ్రహాం కింది భాగంలో 3 ఫ్లోర్లు కలవు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 4 హాళ్లను నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున నిర్మించారు. వీటిలో ఒక సినిమా హాలు, మూడు హాళ్లలో డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి ఫ్లోర్లో 4 హాళ్లు, రెండవ ఫ్లోర్లో 4 హాళ్లు కలవు. అంబేద్కర్ విగ్రహం మరియు స్మృతివనంకోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే తెలంగాణలో మాజీ సీఎం కేసిఆర్ 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గత ఏప్రిల్ లో ఆవిష్కరించారు. అయితే ఆ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
తాజాగా విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంను టిడిపి దళిత నాయకులు సందర్శించారు. ఈ క్రమంలో తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని రూ.150 కోట్ల రూపాయలలోపే ఏర్పాటు చేశారు. విజయవాడలో అంతే ఎత్తు అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు మాత్రం 400 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయ్యిందని టీడీపీ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. నక్కా ఆనంద్ బాబు “తమ ప్రభుత్వం ఉన్నప్పుడే 137 కోట్ల రూపాయలతో స్మృతివనం ఏర్పాటుకోసం పనులను మొదలుపెట్టామని, 26 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.
అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పీఎం మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఆయన చేతుల మీదుగా అయోధ్య రామమందిర గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. ఈ క్రమంలోనే జనవరి 12న అనుష్ఠాన కార్యక్రమాన్నిమొదలుపెట్టారు. అప్పుడే 11 రోజుల పాటు అనుష్ఠాన దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు నుండి ప్రధాని నరేంద్ర మోదీ కఠిన దీక్ష చేస్తున్నారు.
ఈ దీక్షలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. ప్రధాని మోదీ ఆహారం తీసుకోకుండా కొబ్బరి నీళ్లను మాత్రమే తీసుకుంటూ, నేలపై నిద్రపోతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఈ దీక్షలో భాగంగా ఎనిమిదవ రోజు సైతం ఆహారం తినకుండా కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించాయి. మోదీ ఈ దీక్షలో భాగంగా కఠినమైన నియమాలు, వ్యాయామాన్ని పాటిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రధాని మోదీ కఠిన దీక్షలో ఉన్నా, పర్యటనలు విస్తృతంగా చేస్తూనే ఉన్నారు. గత వారంలో కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పర్యటించి, పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. శంకుస్థాపనలు చేశారు. అంతే కాకుండా ఆ రాష్ట్రాలకు వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న పలు దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రతినిధిగా తనను ఆ అయోధ్య రాముడు ఎంపిక చేసుకున్నాడని ప్రధాని చెప్పుకొచ్చారు.
తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు ఆఫీస్ లో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇద్దరు తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సీఎం జగన్ పంచెకట్టుతో, భుజంమీద కండువాతో కనిపించారు. తన సతీమణి భారతితో కలిసి పూజలు చేశారు. గోమాతకు పూజ కూడా చేశారు. ఆ తరువాత భోగి మంటను వెలిగించారు. అయితే పూజలు పూర్తయిన తరువాత పూజారులు ఇచ్చిన తీర్ధ, ప్రసాదాలు ఇచ్చారు.
అయితే కొందరు వైఎస్ భారతి తీర్థాన్ని ఒంపేసిందని, ప్రసాదాన్ని పొట్లం కట్టిందంటూ విమర్శిస్తూ కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు. అయితే ఆమెకు తీర్ధం ఇవ్వగా, తీసుకుంది. ఆ తరువాత తల పై రాసుకుంది. ఇలా అందరు సాధారణంగా చేస్తారు.
తీర్థాన్నికిందపడానివ్వకుండా తలకు రాసుకోవడం అనేది ఎప్పటి నుండో ఉన్న విషయమే. ఆ విధంగానే ఆమె చేసింది. ఇక ప్రసాదాన్ని తీసుకున్న తరువాత పక్కన ఉన్నావారెవరో టిష్యూ ఇవ్వగా, దానితో తన చేతిని తుడుచుకుంది. ప్రసాదాన్ని పొట్లం కట్టడం కానీ పడేయడం కానీ చేయలేదు. ఇదంతా కావాలని చేస్తున్న ప్రచారం అని అంటున్నారు.
వైఎస్ షర్మిల తనయుడి ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికలను గత పది రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను కలిసి అందచేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే షర్మిల అందరికన్నా ముందుగా ఆహ్వాన పత్రికను తన అన్న జగన్ కు అందచేశారు. కానీ దానికి సంబంధించిన ఫోటో లేదా వీడియో ఎక్కడా కనిపించలేదు. అటు వైసీపీ కానీ ఇటు షర్మిల కానీ వాటిని రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా నిశ్చితార్థంకు జగన్ హాజరైన ఫోటోలు, వీడియోలు సీఎంఓ ప్రతినిధులే రిలీజ్ చేశారు. ఇందుకు కారణం ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా షర్మిల అవడమే అంటున్నారు.
ఇక కొడుకు నిశ్చితార్థంకు ఆహ్వానించిన షర్మిల, వైఎస్ జగన్, భారతిలను పట్టించుకోలేదని, జగన్ వచ్చి, వెళ్లేంత వరకు అన్నా చెల్లెళ్ళు అంతగా కలవలేదని టాక్. ఫోటో దిగడం కోసం స్వయంగా జగన్ పిలిచినా షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ పట్టించుకోలేదు. దాంతో జగన్, భారతి బొకే ఇచ్చి వెంటనే వేడుక నుండి వెళ్లిపోయారు. ఇదంతా చూసినవారు జగన్ కలవాలని చూసినా షర్మిలే దూరంగా ఉంటున్నారని అక్కడికి వచ్చినవారు అంటున్నారు. జగన్ తన చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఆమె అన్న వైపు చూడలేదని ఇతర అతిథులు అంటున్నారు.
అయితే ఇదే వేడుకకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ స్వయంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నంత సమయం ఆయనతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్నతో ఫోటోకు దూరంగా ఉన్న షర్మిల, బ్రదర్ అనిల్, పవన్ కళ్యాణ్ పక్కన ఫోటో దిగడం. రాజకీయంగా జగన్ శత్రువు అయిన పవన్ కళ్యాణ్ కు షర్మిల ఇంతటి ఆదరం చూపడంతో అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు పెరిగిపోయాయని అంటున్నారు.


