కర్ణాటక టీచర్ దీపిక హ-త్య కేసులో ఒక్కొక్కటిగా నిజాలు బయటికి వస్తున్నాయి. మొదట మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ కేసు తరువాత మ-ర్డర్ కేస్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే జనవరి 20వ తేదీన పాఠశాలకు వెళ్లిన దీపిక మూడు రోజుల తర్వాత శవమై కనిపించిన సంగతి తెలిసినదే. స్కూటర్ ఒకచోట ఆమె మృతదోహాన్ని మరొకచోట పోలీసులు గుర్తించారు.దీంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్రవ్యాప్తంగా దీపిక హ-త్య కేసు వైరల్ అయింది కొండ దిగువన మట్టిలో పాతిపెట్టిన మృతదేహం పోలీసులకు లభ్యమైనది కాగా విచారణ చేపట్టిన పోలీసులు మాణిక్యానహళ్లి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

దీపికను హతమార్చేందుకు ముందుగా పదకం పన్నాడు నితీష్. అయితే ప్లాన్ కు ఒకరోజు ముందే దీపికను అదే స్థలంలో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు నిందితుడు లేడీ టీచర్లు గొంతును-లిమి హ-త్య చేసి ఊపిరాడకుండా చేసి చంపేసాడని పోలీసులు చెప్తున్నారు. మాణిక్యానహళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమార్తె దీపిక అదే గ్రామానికి చెందిన లోకేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపికకు ఒక బిడ్డ కూడా ఉంది.
ఈమె ఎస్ ఇ టి స్కూల్లో టీచర్ గా పని చేసేది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజలకు కూడా దీపిక సుపరిచితురాలు అయ్యింది. జనవరి 20 న స్కూల్ కి వెళ్ళిన దీపిక తర్వాత ఇంటికి రాకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు కుటుంబ సభ్యులు. మేలుకోటే యోగ నరసింహస్వామి కొండ దిగిన ఒక మహిళపై ఒక యువకుడు దాడి చేస్తున్న దృశ్యాన్ని ఒక పర్యాటకుడు చిత్రించి దానిని పోలీసులు అందించాడు. దీని ఆధారంగా పరిసర ప్రాంతాల్లో వెతకగా దీపిక స్కూటర్ లభ్యమయింది.

జనవరి 22వ తేదీన యోగ నరసింహస్వామి కొండ దిగిన దుర్వాసన వెదజల్లుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ మట్టిని తొలగించగా ఉపాధ్యాయురాలు దీపికా మృతదేహం లభ్యమయింది. అయితే దీపిక భర్త నితీష్ గురించి చెప్పి నిత్యం అక్క, అక్క అని పిలిచేవాడు అతనే హ-త్య చేసి ఉండవచ్చు అని చెప్పటంతో అతనిపై నిఘాపెట్టిన పోలీసులు కర్ణాటక బోర్డర్లో నితీష్ ని పట్టుకుని అరెస్టు చేశారు.




















మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.