AYODHYA RAM MANDIR: అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి సులభ మార్గాలు ఇవే.!

AYODHYA RAM MANDIR: అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి సులభ మార్గాలు ఇవే.!

by Mounika Singaluri

Ads

ఎట్టకేలకు యావత్ హిందువుల కల నెరవేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే సులభంగా అయోధ్యకు వెళ్లే మార్గాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

జనవరి 22న నరేంద్ర మోడీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం జనవరి 23 నుంచి బాలరాముడిని దర్శించుకునేందుకు సామాన్య ప్రజలకి అధికారులు అనుమతించారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫ్లైట్లో వెళ్లాలనుకునే వాళ్ళు మీ దగ్గరలోని విమానాశ్రయం నుంచి యూపీలోని లక్నో, వారణాసి విమానాశ్రయానికి చేరుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు.

అనంతరం అక్కడ నుంచి సులభంగా టాక్సీ బుక్ చేసుకుని ఆలయానికి చేరుకోవచ్చు. లేదంటే లక్నో విమానాశ్రయం నుంచి వెళ్లాలనుకుంటే ప్రైవేట్ టాక్సీలు ఇతర మార్గాల ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. అలాగే వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నట్లయితే అక్కడ నుంచి రైలు బస్సు టాక్సీ ల ద్వారా రామ మందిరానికి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు రైలు మార్గాన ప్రయాణించాలనుకుంటే మీ దగ్గరలోని రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యలో ఉన్న పైజాబాద్ జంక్షన్ అయోధ్య జంక్షన్ అనే రెండు రైల్వేస్టేషన్లో చేరుకోవాలి.

దేశంలోని నలుమూలల నుంచి ఈ స్టేషనులకు రైలు రాకపోకలు సాగించే వీలుంది. ఐ ఆర్ సి టి సి ద్వారా టికెట్ బుక్ చేసుకుని ఈ రెండు స్టేషనులకు ముందుగా చేరుకోవాలి. ఆ తరువాత అక్కడ నుంచి టాక్సీ లేదా ఇతర వాహనాల ద్వారా అయోధ్య మందిరానికి చేరుకోవచ్చు. ఇక బస్సు ద్వారా వచ్చేవాళ్ళు ఏదైనా బస్ బుకింగ్ యాప్ ద్వారా ఈజీగా బస్ బుక్ చేసుకొని అయోధ్యకు చేరుకోవచ్చు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్నో నుంచి అయోధ్యకు సాధారణ బస్సులను నడుపుతుంది. ప్రయాణ సమయం నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది.


End of Article

You may also like