వైయస్ షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ప్రాచుర్యం పొందారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి తరఫున 2019 ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ను విడిచిపెట్టి తెలంగాణ చేరి అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించారు.
అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు మొదలవులను నేపథ్యంలో వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను షర్మిలాకి అప్పగించనున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. నిన్న కాకినాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయని కుటుంబాలను వేరు చేసే విధంగా రాజకీయాలు చేస్తారని, పొత్తులు పెట్టుకుంటారు, మోసాలు చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. పరోక్షంగా కుటుంబాలను చీల్చుతారు అని చెప్పడంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు పాలు సెట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్న నేపథ్యంలో సీటు దక్కని వారు షర్మిల వెనకాల నడుస్తారని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిల తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
watch video :







రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసింది. ఆమె రాయ్రంగ్పూర్లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము 25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న జార్ఖండ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.








