2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం యాత్ర 2. ఈ చిత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇక వైయస్సార్ గా మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది.
ఈ టీజర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకులతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు అందరూ కనిపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు. అదే విషయాలను టీజర్ లో కూడా ఉంచారు.

రాజశేఖర్ రెడ్డి చనిపోవడం జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టడం దాన్ని కాంగ్రెస్ అధిష్టానం వ్యతిరేకించడంతో జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎన్నికలకు రావడం ఎలా అన్నీ టీజర్ లో కనబడ్డాయి. టీజర్ లో ఒరిజినల్ రాజకీయ నాయకులను పోలిన నటులను చాలామందిని ఉంచారు. అయితే ఇందులో ముఖ్యంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత్రను ఎక్కువగా చూపించారు.

ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ నటించారు. ఇక కీలకమైన సోనియాగాంధీ పాత్రలో హిందీ నటి సుజన్ బెర్నర్ట్ నటించారు. ఇక జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పాత్రలు కూడా ఈ టీజర్ లో కనిపించాయి. అలాగే టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాత్ర కూడా ఇందులో ఉంది. ఇక రోశయ్య పాత్ర కూడా ఈ టీజర్ లో కనిపించింది. ఈ టీజర్ అమాంతం సినిమా మీద అంచనాలను పెంచేసింది. రాబోయే రోజుల్లో యాత్ర 2 సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
watch video :
















రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసింది. ఆమె రాయ్రంగ్పూర్లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము 25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న జార్ఖండ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.



