రణబీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా యానిమల్. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.
హీరో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక తండ్రి-కొడుకుల గొడవల మధ్య సాగుతుంది. సినిమా మొత్తం యాక్షన్ అంటున్నారు. ట్రైలర్ కూడా అలాగే ఉంది అంటున్నారు.

కానీ ఈ ట్రైలర్ లో ఒక విషయం గమనించారా? ఇంత యాక్షన్ ఉన్న ట్రైలర్ లో ఒక సున్నితమైన అంశాన్ని కూడా చూపించారు. అదే పేరెంటల్ నెగ్లిజెన్స్. అంటే తల్లిదండ్రులు పిల్లలకి సరైన ప్రేమని ఇవ్వకపోవడం. చిన్నపుడు చాలా మంది పిల్లలు ఎదుర్కొనే సమస్య ఇది. ప్రేమ అంటే కేవలం పిల్లలకి అవసరం అయిన వస్తువులు ఇవ్వడం కాదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పనుల వల్ల, వారికి ఉన్న ఒత్తిడి వల్ల పిల్లలతో సమయం గడపలేకపోతారు.

వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోలేని వయసులో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఒక వేళ తల్లిదండ్రులు కోపంగా ఉంటే ఆ కోపాన్ని తమ పిల్లల మీద చూపిస్తారు. సున్నితమైన మనస్తత్వం ఉన్న పిల్లలు ఇలాంటి వాటికి చాలా బాధ పడుతారు. ఇవి పెద్దయ్యాక ఈ సమస్యలు ఎదుర్కొన్న పిల్లల మీద చాలా ప్రభావం చూపుతాయి.

తమ తల్లిదండ్రులు అలా ప్రవర్తించడం చూసిన పిల్లలు, వాళ్ళు పెద్దయ్యాక, వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక వారి పిల్లలతో కూడా పొరపాటున అలాగే ప్రవర్తించి, ఇలా ప్రవర్తించడం తప్పు అని గుర్తించకుండా, “తల్లిదండ్రులు అయ్యాక వచ్చే బాధ్యతల వల్ల ఇలాంటి కోపాలు వస్తుంటాయి. చిన్నప్పుడు మేము కూడా ఇలాంటివి చూశాం. కానీ మేము ఇలా బాధ పడలేదు” అని తమ ప్రవర్తనని సమర్ధించుకుంటారు. ఇదే విషయాన్ని సందీప్ ఈ సినిమా ట్రైలర్ లో చూపించారు. కానీ సినిమాలో ఇంకా ఎలా చూపించారో తెలియాలి అంటే రిలీజ్ అయ్యే అంత వరకు ఆగాల్సిందే.
ALSO READ : రాధ కూతురికి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా..?





అప్పుడు ఆమె చూసుకుంటే హారం లేదు.. ఆ వెంటనే వెళ్లి హారానికి సంబంధించిన వివరాలు చెప్పి తెచ్చుకున్నారు. పోయిన హారం దొరకడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలు అనసూయమ్మ, ఆలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిజాయితీపరులు ఉంటారా అంటూ నెటిజన్ లు అనసూయమ్మను అభినందిస్తున్నారు. భక్తురాలు నిజంగా చాలా అదృష్టవంతురాలు దేవుడి సన్నిధిలో పోయిన హారం ఆయన ఆశీర్వాదంతో తిరిగి దొరికింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే అలాంటి విలువైన వస్తువులు ఆలయానికి ఎందుకు వేసుకురావడం అంటూ ప్రశ్నిస్తున్నారు.


అసలు ఈ ఘటనకు ఎవరు కారణం అంటూ పోలీసులు విచారించాలని లోకల్ బాయ్ నాని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.అయితే నాని జనసేన కార్యకర్త అంటూ వైసీపీ తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాలో ప్రచురించింది. అయితే జనసేనకు లోకల్ బాయ్ నానికి ఎటువంటి సంబంధం లేదు అని జనసేన నాయకులు ప్రకటించారు.ఫిషింగ్ హార్బర్ ప్రమాద కారకులను వెంటనే పట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మత్స్యకారులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.






