కేన్ విలియమ్సన్ న్యూ జీలాండ్ లోనే కాదు అండి బాబు ! ఈయన్ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మరీ భారత్ లో ఇంకా ఎక్కువగానే అభిమానిస్తారు. ఇక తెలుగు క్రికెట్ అభిమానులతో కేన్ మామ కి ఉన్న అనుబంధం కొత్తగా చెప్పనవసరం లేదు ఆయన్ని రేలంగి మావయ్య గా పిలుచుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే వరల్డ్ కప్ లో భాగంగా నిన్న భారత్ న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడగా భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మొదట బాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ జట్టుకి ఆరంభం లోనే భారత బౌలర్లు వికెట్లు తీసి న్యూజీలాండ్ మీద ఒత్తిడి ని పెంచారు. ఇంతలోనే భారత ఫీల్డర్లు క్యాచ్లని వదిలి పెద్ద తప్పే చేసారు. దీనితో మరింత ఒత్తిడిలో ఉన్న న్యూజిలాండ్ మొదట రన్ రేట్ తక్కువగానే కొనసాగించింది. మరో వికెట్ పడకుండా రచీన్ రవీంద్ర – మిచెల్ లు కీలక భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టుని మంచి స్కోర్ కి చేరేలా తమ వంతు కృషి చేసారు.
డ్రింక్స్ బ్రేక్ లో కేన్ విలియమ్సన్ సిరీస్ లో ఉన్న ఆటగాళ్లతో ఏమి మాట్లాడారో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ల బౌలింగ్ లో ధాటిగా ఆది వరుస బౌండరీలు సాధించి పరుగులని పిండుకున్నారు. ధర్మశాల పిచ్ పేస్ కి అనుకూలంగా, స్పిన్ బాటింగ్ కి అనుకూలంగా ఉందని తమ వ్యూహాలని మార్చి ధీటుగా ఆడాలని సూచనలు అందించాడు.
గాయం కారణంగా విలియమ్సన్ ఇప్పటికే జట్టు నుంచి దూరంగా కాగా మరిన్ని మ్యాచ్లు మిగిలిఉండటం ఇప్పటికే న్యూజీలాండ్ టేబుల్ టాపర్స్ గా కొనసాగడం ఆ జట్టు సెమిస్ చేరటం పెద్ద కష్టం కాకపోవచ్చు. అందుకే సెమిస్ తో పోరులో కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమయినా కేన్ విలియమ్సన్ తాను జట్టులో లేకున్నా కెప్టెన్సీ బాధ్యతలని చాల బాగా వ్యవహరిస్తున్నారు.
నిన్నటి న్యూ జీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపు పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ మరియు మీమ్స్ ఇవే !
Kane Williamson giving his inputs to Rachin Ravindra and Daryl Mitchell in the drinks break. pic.twitter.com/o9tJAAmgUH
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2023











ఇటీవల 26 వారాల గర్భవిచ్ఛిత్తికి పర్మిషన్ ఇవ్వమని కోరుతూ 27 సంవత్సరాల మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తనకు ఇద్దరు పిల్లలున్నారని, తాను మానసికంగా, శారీరకంగా మరో బిడ్డను కనడానికి సిద్ధంగా లేనని కోర్టుకు వివరించింది. మహిళ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అ-బా-ర్ష-న్కి పర్మిషన్ ఇచ్చారు. వైద్య పరంగా అ-బా-ర్ష-న్ కు అక్టోబరు 9న అనుమతిని ఇచ్చింది.
కానీ, ఆ తరువాతి రోజు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 26 వారాల సమయంలో అబార్షన్ చేసినట్లయితే ప్రాణాలకే ముప్పు అని నివేదిక ఇచ్చారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, చీఫ్ జస్టిస్ బెంచ్ కు పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నేడు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. తల్లి గర్భంలోని శిశువు గుండెను ఆపడానికి కోర్టు సుముఖంగా లేదని అన్నారు. ఇప్పటికే గర్భిణికి 26 వారాల, 5 రోజులు అని, ప్రస్తుతం ఈ గర్భం వల్ల తల్లికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
తల్లి హక్కు మరియు గర్భస్థ శిశువు హక్కు మధ్య సమతౌల్యం పాటించాలని అన్నారు. అ-బా-ర్ష-న్ కి పర్మిషన్ ఇస్తే ‘మెడికల్ టె-ర్మి-నే-ష-న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ’ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 5 లను ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. ఈ మహిళ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును గవర్నమెంట్ భరిస్తుందని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తరువాత తాను పెంచుకోవాలా లేదా ఎవరికైనా దత్తత ఇవ్వాలా అనే విషయం పై తల్లిదండ్రులు డిసిషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నెలరోజులు దాటిన ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు నిరసనలు, ఆందోళన తెలుపుతున్నారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా ఆయన మద్ధతుదారులు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు స్త్రీల మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలో వారిద్దరూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి నెల దాటినా, ఇప్పటికి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని వారి ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. చంద్రబాబు అరెస్టు పై ఇప్పటికీ రెస్పాండ్ కాలేదు అని తిడుతూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ను వెళ్ళగక్కారు. వారిలో ఒక మహిళ, నోరు తెరిస్తే ధర్మం, హిందుత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రధాని,
తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అరాచకాల గురించి ఒక్కసారైన మాట్లాడలేదని అన్నారు. ఇండియా వరల్డ్ లో టాప్ 3 ప్లేస్ కి వచ్చిందని అంటారు. కానీ రోడ్ల పై నడిచే మహిళలకు టాయిలెట్లు కూడా లేని పరిస్థితిలో ఉందని ఇంకో మహిళ అన్నారు. ప్రపంచంలో 3 స్థానం కాదు, ముందు రోడ్ల పై వెళ్ళే స్త్రీల కోసం టాయిలెట్లు కట్టించి, గొప్పలు చెప్పుకోవాలి అని తన కోపాన్ని బయటపెట్టింది. వీళ్ల సీరియస్ చర్చను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలోని హామీలలో ఒకటైన ఆసరా పెన్షన్ను కూడా పెంచుతున్నట్టు ప్రకటించారు. రూ. 2016 గా ఉన్న పెన్షన్ను ఐదు వేలకు పెంచుతామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3000కు పెంచుతామని, ఆ తరువాత ఏడాది ఐదు వందల చొప్పున పెంచుకుంటూ, చివరి ఏడాది వచ్చే వరకు ఐదు వేలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ, ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పింఛన్ పథకాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. తాము ప్రకటించినపుడే, 2 వేల పింఛన్ను ప్రకటించి, సంవత్సరానికి 500 చొప్పున పింఛన్ను పెంచుతూ, ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్నారని వెల్లడించారు.
ఈ పథకాన్ని విజయవంతంగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని, తాము కూడా అదే పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.తమ పథకాల అమలులో దేశానికి తెలంగాణే ఆదర్శంగా నిలిచిందని ప్రతిసారి చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్, తానే స్వయంగా, ఏపీ గవర్నమెంట్ ని ప్రశంసించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఫాలో కానున్నట్టుగా కూడా ప్రకటించారని తెలుస్తోంది.
కానీ సోమవారం దాకా చంద్రబాబును అరెస్టు చేయవద్దని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీకి చెప్పారు. 17ఏ పై వాదనలు పూర్తి కాలేదు. అందువల్ల ఫైబర్ నెట్ కేసులో ఆర్డర్స్ ఇవ్వలేమని తెలిపారు. అయితే, సోమవారం నాడు చంద్రబాబు అరెస్ట్ చేయరని సీఐడీ తరపున ముకుల్ రోహత్గి హామీ ఇచ్చారు. ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారానికి వాయిదా వేయమని సమాచారం ఇస్తామని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు.