నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి చాలామందిని కాపాడడంతో ప్రాణ నష్టం కొద్దిగా తగ్గింది. ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమయి మంటలను ఆర్పి వేశారు. అయితే అపార్ట్మెంట్ సెల్లార్ లో చెలరేగిన మంటలు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు దర్యాప్తులో తేలింది.
5 అంతస్తుల అపార్ట్మెంట్ లో మంటలు 4 అంతస్థుల వరకు వ్యాపించాయి.ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు తీవ్రంగా శ్రమించి పలువురిని కాపాడారు.21 మందిని రక్షించి హాస్పిటల్ కి తరలించారు.

అయితే అపార్ట్మెంట్ కింద గ్యారేజ్ లో కార్ రిపేర్ చేస్తుండగా ఆయిల్ డ్రమ్ములు, కెమికల్ డ్రమ్ములు పేలి ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. ఎక్కువగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తులే మృత్యువాత పడినట్లు ఫైర్ డీజి నాగిరెడ్డి తెలిపారు.అపార్ట్మెంట్ సెల్లార్ లో ఉన్న వాహనాలన్నీ అగ్ని ఆహుతై బూడిద అయిపోయాయి. థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వారికి పొగ కారణంగా ఊపిరి ఆడక స్పృహ తప్పి పడిపోయారు. వారందరినీ హాస్పిటల్ కి చేర్చారు.ఇది బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ కి సంబంధించిన షాపే కావడం గమనార్హం.
కార్ గ్యారేజ్ లో కారుని రిపేర్ చేస్తుండగా స్పార్క్ వచ్చి మంటలు వ్యాపించి కెమికల్ డ్రమ్ములు అంటుకుపోయాయి. దీంతో ప్రమాదం జరిగి అపార్ట్మెంట్ అంతా మంటలు వ్యాపించాయి.
ఈ బిల్డింగ్ ఓనర్ కి పలుచోట్ల కెమికల్ కి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కెమికల్స్ అన్నిటిని అనధికారికంగా బిల్డింగ్ కింద స్టోర్ చేశాడు. వాటి కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులైతే బిల్లింగ్ ఓనర్ పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా మార్చురికి తరలించారు.
Also Read:చిరు ఇంట పార్టీలో ఆ ఒక్క హీరోకి ఆహ్వానం లేదా? ఆయన తప్ప అందరు ఉన్నారుగా ఫొటోల్లో.!





చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1942లో కృష్ణాజిల్లాలోని పమిడిముక్కలలో మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం అనే సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ ను అందుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన చంద్రమోహన్, 175 పైగా సినిమాలలో హీరోగా చేశారు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించిన ఆయన మొత్తం 932 చిత్రాలలో నటించాడు.
సెకండ్ హీరోగా, హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్ మనసులో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చంద్రమోహన్ను లక్కీ హీరోగా చెబుతారు. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలారు. వారిలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వరకు చాలా మంది ఉన్నారు. వారంతా కెరీర్ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే.
చంద్రమోహన్ కెరీర్ లో ఆయన నటనకు గానూ 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన భార్య పేరు జలంధర. మంచి రచయిత్రి. పలు కథా సంకలనాలను రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షీ అమెరికాలో స్థిరపడింది. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో స్థిరపడింది.
విషయం తెలియగానే ఇంటికి వచ్చిన బాలిక కుటుంబసభ్యులు రూమ్ బయట వైపు తాళం వేశారు. ఆ తరువాత కొందర్ని పిలిచి ఆ యువకుడి పై దాడి చేశారు. దారుణంగా కొట్టి, దాదాపు 3 గంటల పాటు అతన్ని చిత్ర-హిం-స-ల-కు గురి చేసి, కుమార్తెకు జోలికి మళ్ళీ రావద్దని వార్నింగ్ ఇచ్చి, విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు తన ఇంటికి వెళ్ళి, కిందపడి అపస్మారక స్థితికి వెళ్లాడు.
కరణ్ కుటుంబసభ్యులు అతన్ని వెంటనే ఘట్కేసర్ గవర్నమెంట్ హాస్పటల్ కి తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు, అప్పటికే అతడు మరణించినట్టుగా ధ్రువీకరించారు. కరణ్ తల్లి సుశీల కంప్లైంట్ చేయడంతో, ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, కరణ్ పై దాడి చేసిన 10 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోలీసులు ఈ సంఘటన పై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో మానవత్వానికి విలువనివ్వడం లేదు. డబ్బుకి, ఆస్తులకు ఇచ్చే విలువలో సగం కూడా కుటుంబ బంధాలకు ఇవ్వడం లేదు. అలా అనడానికి తాజాగా జరిగిన ఒక సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని గామాలపాడు చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మలకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని తమకున్నంతలో పెంచి, పెద్ద చేసి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అయితే వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడు వెంకటేష్ కు వారు భారమయ్యారు.
ఇక ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల వల్ల వెంకటరత్నం పై కొడుకు, కోడలు దాడి చేశారు. దాంతో వెంకటరత్నం చెయ్యి విరిగింది. విషయం బయటికి వస్తుందని కుమారుడు తల్లి పై కాస్త జాలి కూడా లేకుండా నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఒక తండాలోని శ్మశానవాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడికి మొక్కలకు నీళ్ళు పోసే పని చేసే గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకటరత్నం చూసి వెంటనే సర్పంచ్ కు తెలియచేశాడు.
దాంతో సర్పంచ్, గ్రామస్తులు వెంకటరత్నం వివరాలు తెలుసుకుని పోలీసులకు తెలిపారు. ఆమె ఇంటికి వెళితే కొడుకు, కోడలు తనను చంపేస్తారని భయాందోళనను వ్యక్తం చేసింది. హాస్పటల్ కి తీసుకు వెళ్లమని కన్నీటితో వేడుకొంది. గాయాలతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని పోలీసులు మిర్యాలగూడ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి, దాచేపల్లి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.






