జూన్ 11న నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని కోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో టీఎస్పీఎస్సీ బోర్డు మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీ బోర్డు హైకోర్టు ఇచ్చిన తీర్పు పై డివిజన్ బెంచ్కు వెళ్తామని ప్రకటించినా కూడా అభ్యర్థులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ ను ఎందుకు రద్దు చేసిందో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెల్సిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 కోసం 3 లక్షల 80 వేలమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 2,32,457 మంది మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను లీకేజీ వల్ల మొదటిసారి రద్దు చేశారు. ఆ తరువాత జూన్ 11న మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఇప్పుడు రెండవ సారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తిరిగి నిర్వహించాలని కోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ టైమ్ లో అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్లే రద్దు చేస్తున్నట్టుగా కోర్టు తెలిపింది. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ అమలు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేని ఓఎంఆర్ షీట్లు ఇవ్వడంతో అక్రమాలకు తావిచ్చేలా ఉందని కొందరు అభ్యర్థులు ఈ విషయం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ ఎగ్జామ్ ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా గవర్నమెంట్ ను, టీఎస్పీఎస్సీ బోర్డును ఆదేశించాలని అభ్యర్థులు బి. ప్రశాంత్, జి.హరికృష్ణ, బండి ప్రశాంత్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, పిటిషనర్ల తరఫున లాయర్ గిరిధర్రావు వాదనల అనంతరం, పరీక్షను రద్దు చేస్తూ ఏరోజు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో అభ్యర్థులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: కాకినాడ టీచర్ ఘటనలో నిజానికి ఏం జరిగింది..? అసలు ఇందులో తప్పు ఎవరిది..?

గుడిలో దేవుడి సన్నిధికి భక్తితో, స్కూల్ కు శ్రద్దాసక్తులతోనూ వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేవుడు అంటే పాపభీతి లేదు. చదువు నేర్పే గురువులకు గౌరవం ఇవ్వడం లేదు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు వినాయక చవితి వేడుకలను జరుపుకుంటూ, భక్తితో పూజలు చేస్తుంటే, మరో వైపు మండపాల వద్ద ఏమాత్రం ఆలోచన లేకుండా కొందరు దొంగతనాలు చేస్తుంటే మరికొందరు వెకిలి వేషాలు వేస్తున్నారు.
మియాపూర్లో రెండు రోజుల కిందట ఒక గణపతి మండపంలో దేవుడికి కూడా భయపడకుండా ఒక వ్యక్తి గణపతి చేతిలోని లడ్డును దొంగిలించడం తెలిసిందే. తాజాగా మేడ్చల్ లోని రాఘవేంద్రనగర్ కాలనీలో గణేష్ మండపంలో నిద్రిస్తున్న యువకుల వద్దకి వచ్చిన ఒక దొంగ, అర్ధరాత్రి 1: 50 నిమిషాలకు మండపలోకి వచ్చి, పడుకున్నవారి తల దగ్గర పెట్టుకున్న సెల్ ఫోన్లను సైలెంట్గా తీసుకున్నాడు. వారిలో ఒకరు కదులుతున్నా, కొంచెం కూడా భయపడకుండా మెల్లగా సెల్ ఫోన్లను తీసుకుని పారిపోయాడు.
అలికిడికి లేచిన ఒక యువకుడు చూసేసరికి, దొంగ పరారయ్యాడు. మిగతా ఫ్రెండ్స్ ను కూడా లేపి, దొంగ కోసం వెతికారు. అప్పటికే పారిపోయిన దొంగ దొరకలేదు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.



భారత్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఒక గురుద్వార్ బయట హత్య చేయబడ్డాడు. ఇద్దరు వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్ పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే నిజ్జర్ ను ఇండియాకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీలే మర్డర్ చేశాయని, ఈ హత్య పై దర్యాప్తు జరపబోతున్నామని కెనడా పిఎం జస్టిన్ ట్రూడో ఇటీవల ప్రకటించారు.
ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడాలో ఉన్న భారత రాయబారిని కెనడా, ఇండియాలో ఉన్న కెనడా రాయబారిని భారత్ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశాయి. గురువారం నుంచి కెనడా దేశస్థులు ఇండియా రావడానికి వీసాల జారిని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
మరోవైపు ఖలిస్థానీ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో నివసించే హిందువులు వెంటనే భారత్ కు వెళ్లిపోవాలని హెచ్చరికలు చేసింది. కెనడాలోని హిందువులకు ఒక అల్టిమేటంను కూడా జారీ చేసింది. బుధవారం నాడు రాత్రి కెనడాలో జరిగిన గ్యాంగ్ వార్ లో పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే కెనడా వీసాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తిరుమల నడక దారిలో పలు చోట్ల అమర్చిన కెమెరాల సహాయంతో చిరుతల కదలికల్ని అధికారులు గమనిస్తూ ఉన్నారు. చిరుతలను పట్టుకోవడం కోసం పలు చోట్ల ట్రాప్ ఏర్పాటు చేశారు. అలా ఐదు చిరుతలను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో చిరుత పులి, అలిపిరి నడక దారిలో లక్ష్మీ నరసింహా స్వామి గుడి, 2,850వ మెట్టు వద్ద చిన్నారి లక్షిత పై దాడి చేసిన స్థలంలోనే చిక్కినట్టు తెలుస్తోంది. అధికారులు రెండున్నర నెలల్లో ఆరు చిరుతలను పట్టుకున్నారు.
ఈ చిరుత పులిని కూడా తిరుపతి జూకు తరలించారు. గత వారం రోజులుగా ఈ చిరుత కదలికలను కెమెరాల ద్వారా గమనిస్తూ ట్రాప్ చేశామని అటవీశాఖ ఆఫీసర్లు తెలిపారు. ఈ చిరుతతో ఇప్పటివరకు మొత్తం 6 చిరుతల్ని బంధించారు. వీటిని తిరుపతి జూకు అటవీశాఖ ఆఫీసర్లు తరలించారు. అయితే 3 చిరుతల్ని అధికారులు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం జూలో 3 చిరుతలు ఉన్నాయని తెలుస్తోంది.
తిరుమల నడక దారిలోనే కాకుండా, చిరుత సంచారం తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో ఘాట్ రోడ్డులో భక్తులు చిరుతను చూసి వణికిపోయారు. వెంటనే వారు టీటీడీ ఆఫీసర్లకు సమాచారం అందించారు. ఇక ఎస్వీ యూనివర్శిటీలో చిరుత కనిపించింది. దానిని సీసీ కెమెరా ద్వారా గుర్తించారు.




హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీకి చెందిన నితిన్, ప్రవల్లికలు సంవత్సరం క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని, ఆ కాలనీలో జీవిస్తున్నారు. నితిన్ ఆటో నడుపుతూ ప్రవల్లికను పోషిస్తున్నాడు. ఈ జంటకు సెప్టెంబర్ 7న పాప జన్మించింది. అయితే పుట్టిన వెంటనే ఆ పాపకు అనారోగ్య సమస్యలు రావడంతో నిలోఫర్ హస్పటల్ లో జాయిన్ చేశారు. వెంటిలేటర్ పై ఉంచి పాపకు చికిత్స అందించారు.
పాప ఆరోగ్యం బాగుపడడంతో ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వెళ్ళిన తరువాత పాప శరీరంలో మార్పు రావటంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. పాపను పరిశీలించిన డాక్టర్, చికిత్స అవసరమని ప్రైవేటు హాస్పటల్ కు తీసుకువెళ్లాలని చెప్పడంతో పాపను పిసల్బండలోని ఒక ప్రైవేటు హాస్పటల్ కి తీసుకెళ్లారు. ఆ హాస్పటల్ లో జాయిన్ చేసుకున్న వైద్యులు పాపకు మెరుగైన చికిత్సను అందించారు. ఏడురోజుల చికిత్స తరువాత పాప కోలుకుంది.
వైద్యానికి లక్షా 16 వేల రూపాయల బిల్లు వేశారు. కానీ వారి దగ్గర 35 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ నిరుపేద దంపతులు దగ్గర ఉన్న రూ.35 వేలు హాస్పటల్ చెల్లించారు. మిగతా డబ్బు సర్దుబాటు అవకపోవడంతో బిల్లు కట్టలేక పాపను హస్పటల్ లోనే వదిలేసి వచ్చారు. మంగళవారం నాడు సేవాలాల్ బంజారా సంఘం ఆఫీస్ లో ఆ జంట మీడియాతో మాట్లాడుతూ తమ బాధను చెప్పుకున్నారు. సంఘం ప్రెసిడెంట్ కొర్ర మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ, ఎవరైనా దాతలు ఈ నిరుపేద ఫ్యామిలీకి హాస్పటల్ బిల్లు కట్టేందుకు సహాయం చేయమని కోరారు.
ఏపీ హైకోర్టులో హరీష్ సాల్వే వాదించిన విషయాలు..
సిద్ధార్థ లూథ్రా వాదనలు..
విజయ్ ఆంటోనీ తన ఫ్యామిలితో కలిసి చెన్నైలో డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. విజయ్ కుమార్తె పేరు మీరా ఆంటోనీ. ఆమె చర్చ్ పార్క్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. 16 ఏళ్ల మీరా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను గమనించిన ఫ్యామిలీమెంబర్స్ సమీపంలోని కావేరీ హాస్పటల్ కి తరలించారు. అయితే అప్పటికే మీరా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు మీరా మృతిని ఆ-త్మ-హ-త్య-గా కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన టైమ్ లో విజయ్ ఆంటోని ఇంట్లో లేరని అంటున్నారు.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?
అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనే విషయం పై మాట్లాడారు. “ఎవరినైనా అతిగా నమ్మి మోసపోవడం, కమిట్మెంట్ ఇచ్చి, ఆ పనిని చేయలేకపోవడం, చదువుకునే పిల్లలకు చదువుల వల్ల కలిగే ఒత్తిడితో ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పుకొచ్చాడు. బడి నుంచి వచ్చిన తరువాత పిల్లల్ని ట్యూషన్కి పో అంటూ ఉంటాం. పిల్లలను సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వడం లేదు. పిల్లలను కొంచెం ఫ్రీగా వదిలేయాలని” చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని కూడా తన కుమార్తె చదువు విషయంలో ఒక కామన్ ఫాదర్ లానే ప్రవర్తించాడా? అందువల్లే ఒత్తిడికి గురై ఆమె ప్రాణం తీసుకుందా అని అంటున్నారు.