తిరుమల నడక దారిలో చిన్నారి లక్షిత చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయినప్పటి నుండి తిరుమలకు నడక దారిలో వెళ్ళే భక్తులను చిరుత భయం వెంటాడుతోంది. అటవీశాఖ అధికారులు నడక దారిలో ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నారు.
ఒక చిరుత బోనులో చిక్కిందని అనుకునే లోపు. మరొక చిరుత నడక మార్గంలో సంచరించడం భక్తులను మరింతగా భయపెడుతోంది. ఇప్పటివరకు ఐదు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. తాజాగా మరోక చిరుత కూడా బోనులో చిక్కినట్టు తెల్సుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తిరుమల నడక దారిలో పలు చోట్ల అమర్చిన కెమెరాల సహాయంతో చిరుతల కదలికల్ని అధికారులు గమనిస్తూ ఉన్నారు. చిరుతలను పట్టుకోవడం కోసం పలు చోట్ల ట్రాప్ ఏర్పాటు చేశారు. అలా ఐదు చిరుతలను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో చిరుత పులి, అలిపిరి నడక దారిలో లక్ష్మీ నరసింహా స్వామి గుడి, 2,850వ మెట్టు వద్ద చిన్నారి లక్షిత పై దాడి చేసిన స్థలంలోనే చిక్కినట్టు తెలుస్తోంది. అధికారులు రెండున్నర నెలల్లో ఆరు చిరుతలను పట్టుకున్నారు.
ఈ చిరుత పులిని కూడా తిరుపతి జూకు తరలించారు. గత వారం రోజులుగా ఈ చిరుత కదలికలను కెమెరాల ద్వారా గమనిస్తూ ట్రాప్ చేశామని అటవీశాఖ ఆఫీసర్లు తెలిపారు. ఈ చిరుతతో ఇప్పటివరకు మొత్తం 6 చిరుతల్ని బంధించారు. వీటిని తిరుపతి జూకు అటవీశాఖ ఆఫీసర్లు తరలించారు. అయితే 3 చిరుతల్ని అధికారులు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం జూలో 3 చిరుతలు ఉన్నాయని తెలుస్తోంది.
తిరుమల నడక దారిలోనే కాకుండా, చిరుత సంచారం తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో ఘాట్ రోడ్డులో భక్తులు చిరుతను చూసి వణికిపోయారు. వెంటనే వారు టీటీడీ ఆఫీసర్లకు సమాచారం అందించారు. ఇక ఎస్వీ యూనివర్శిటీలో చిరుత కనిపించింది. దానిని సీసీ కెమెరా ద్వారా గుర్తించారు.
Also Read: బిల్లు కట్టడానికి డబ్బులు లేవు… చివరికి..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!






హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీకి చెందిన నితిన్, ప్రవల్లికలు సంవత్సరం క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని, ఆ కాలనీలో జీవిస్తున్నారు. నితిన్ ఆటో నడుపుతూ ప్రవల్లికను పోషిస్తున్నాడు. ఈ జంటకు సెప్టెంబర్ 7న పాప జన్మించింది. అయితే పుట్టిన వెంటనే ఆ పాపకు అనారోగ్య సమస్యలు రావడంతో నిలోఫర్ హస్పటల్ లో జాయిన్ చేశారు. వెంటిలేటర్ పై ఉంచి పాపకు చికిత్స అందించారు.
పాప ఆరోగ్యం బాగుపడడంతో ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వెళ్ళిన తరువాత పాప శరీరంలో మార్పు రావటంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. పాపను పరిశీలించిన డాక్టర్, చికిత్స అవసరమని ప్రైవేటు హాస్పటల్ కు తీసుకువెళ్లాలని చెప్పడంతో పాపను పిసల్బండలోని ఒక ప్రైవేటు హాస్పటల్ కి తీసుకెళ్లారు. ఆ హాస్పటల్ లో జాయిన్ చేసుకున్న వైద్యులు పాపకు మెరుగైన చికిత్సను అందించారు. ఏడురోజుల చికిత్స తరువాత పాప కోలుకుంది.
వైద్యానికి లక్షా 16 వేల రూపాయల బిల్లు వేశారు. కానీ వారి దగ్గర 35 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ నిరుపేద దంపతులు దగ్గర ఉన్న రూ.35 వేలు హాస్పటల్ చెల్లించారు. మిగతా డబ్బు సర్దుబాటు అవకపోవడంతో బిల్లు కట్టలేక పాపను హస్పటల్ లోనే వదిలేసి వచ్చారు. మంగళవారం నాడు సేవాలాల్ బంజారా సంఘం ఆఫీస్ లో ఆ జంట మీడియాతో మాట్లాడుతూ తమ బాధను చెప్పుకున్నారు. సంఘం ప్రెసిడెంట్ కొర్ర మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ, ఎవరైనా దాతలు ఈ నిరుపేద ఫ్యామిలీకి హాస్పటల్ బిల్లు కట్టేందుకు సహాయం చేయమని కోరారు.
ఏపీ హైకోర్టులో హరీష్ సాల్వే వాదించిన విషయాలు..
సిద్ధార్థ లూథ్రా వాదనలు..
విజయ్ ఆంటోనీ తన ఫ్యామిలితో కలిసి చెన్నైలో డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. విజయ్ కుమార్తె పేరు మీరా ఆంటోనీ. ఆమె చర్చ్ పార్క్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. 16 ఏళ్ల మీరా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను గమనించిన ఫ్యామిలీమెంబర్స్ సమీపంలోని కావేరీ హాస్పటల్ కి తరలించారు. అయితే అప్పటికే మీరా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు మీరా మృతిని ఆ-త్మ-హ-త్య-గా కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన టైమ్ లో విజయ్ ఆంటోని ఇంట్లో లేరని అంటున్నారు.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?
అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనే విషయం పై మాట్లాడారు. “ఎవరినైనా అతిగా నమ్మి మోసపోవడం, కమిట్మెంట్ ఇచ్చి, ఆ పనిని చేయలేకపోవడం, చదువుకునే పిల్లలకు చదువుల వల్ల కలిగే ఒత్తిడితో ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పుకొచ్చాడు. బడి నుంచి వచ్చిన తరువాత పిల్లల్ని ట్యూషన్కి పో అంటూ ఉంటాం. పిల్లలను సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వడం లేదు. పిల్లలను కొంచెం ఫ్రీగా వదిలేయాలని” చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని కూడా తన కుమార్తె చదువు విషయంలో ఒక కామన్ ఫాదర్ లానే ప్రవర్తించాడా? అందువల్లే ఒత్తిడికి గురై ఆమె ప్రాణం తీసుకుందా అని అంటున్నారు.
19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్గా 41 సంవత్సరాల కల్నల్ మన్ప్రీత్ సింగ్ వర్క్ చేస్తున్నారు. బుధవారం నాడు జమ్మూ కశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో రావడంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో కల్నల్ మన్ప్రీత్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్, మేజర్ ఆశిష్ ధోంచక్ మరణించారు.
ముగ్గురు అమర వీరుల భౌతిక కాయాలను వారి స్వగ్రామలకు తరలించారు. ఈ క్రమంలో కల్నల్ మన్ప్రీత్ సింగ్ భౌతిక కాయాన్ని పంజాబ్ రాష్ట్రంలోని మల్లాన్పూర్ కు తరలించారు. ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు వచ్చారు. కన్నిటితో కల్నల్ మన్ప్రీత్ సింగ్ అంతిమ సంస్కారాలను జరిపించారు. అయితే ఆయన భౌతిక కాయం వద్ద చోటు చేసుకున్న ఒక సన్నివేశం అక్కడ ఉన్న వారి మనసులను కలిచివేసింది.
కల్నల్ మన్ప్రీత్ సింగ్ ఆరేళ్ళ కుమారుడు కబీర్ ఆర్మీ డ్రెస్ వేసుకుని, కనిపించాడు. అక్కడ ఏం జరిగిందో అర్ధం కానీ చిన్న వయసులో ఉన్న ఆ బాబు తన నాన్న భౌతిక కాయానికి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. అన్న సెల్యూట్ చేయడం చూసిన ఆ బాబు చెల్లెలు రెండేళ్ల పాప కూడా సెల్యూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1. రిమాండ్ ప్రిజనర్స్ ఈ ఖైదీలకు కేటాయించే నంబర్ రికార్డులో ఆర్.పి. అనే లెటర్స్ తర్వాత ఉంటుంది.
ప్రస్తుతం పైన చెప్పిన నాలుగు కేటగిరీల క్రిందనే ఖైదీలకు నంబర్లు కేటాయిస్తున్నారు. ఇక నంబర్ ఎలా ఇస్తారంటే, జైలు ఏర్పటు చేసినప్పటి నుండి వస్తున్న ఖైదీల క్రమ సంఖ్య ఆధారంగా ఆయా కేటగిరీల క్రింద నంబర్ కేటాయిస్తారని తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డిఐజి ఒకరు బీబీసీతో చెప్పారు.
రిమాండ్ ఖైదీ అంటే, ”నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పై తగిన ఆధారం దొరికినపుడు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో లేదా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఇలా చేయడాన్ని రిమాండ్ అంటారు. కోర్టులో జడ్జి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ఆ వ్యక్తిని జైలుకు తరలిస్తారని బీబీసీతో తెలంగాణ హైకోర్టు సీనియర్ లాయర్ చింతపల్లి లక్ష్మీనారాయణ చెప్పారు. చంద్రబాబు నాయుడికి రిమాండ్ ఖైదీ వరుస సంఖ్యను బట్టి 7691 నంబర్ ను కేటాయించారని తెలుస్తోంది.

