తెలంగాణలో ఎలెక్షన్స్ హడావుడి ప్రారంభం అయ్యింది. రాజకీయ పార్టీలన్ని ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ మీటింగ్ తో ఎలెక్షన్ల శంఖారావం పూరించారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు.
సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలోని హామీలను ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ గవర్నమెంట్ అమలు చేస్తున్నఒక పథకం గురించి చెబుతూ అభినందించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలోని హామీలలో ఒకటైన ఆసరా పెన్షన్ను కూడా పెంచుతున్నట్టు ప్రకటించారు. రూ. 2016 గా ఉన్న పెన్షన్ను ఐదు వేలకు పెంచుతామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3000కు పెంచుతామని, ఆ తరువాత ఏడాది ఐదు వందల చొప్పున పెంచుకుంటూ, చివరి ఏడాది వచ్చే వరకు ఐదు వేలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ, ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పింఛన్ పథకాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. తాము ప్రకటించినపుడే, 2 వేల పింఛన్ను ప్రకటించి, సంవత్సరానికి 500 చొప్పున పింఛన్ను పెంచుతూ, ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్నారని వెల్లడించారు.
ఈ పథకాన్ని విజయవంతంగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని, తాము కూడా అదే పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.తమ పథకాల అమలులో దేశానికి తెలంగాణే ఆదర్శంగా నిలిచిందని ప్రతిసారి చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్, తానే స్వయంగా, ఏపీ గవర్నమెంట్ ని ప్రశంసించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఫాలో కానున్నట్టుగా కూడా ప్రకటించారని తెలుస్తోంది.
Also Read: ఫైబర్నెట్ కేసులో చంద్రబాబును అప్పటివరకు అరెస్టు చేయొద్దు.. సుప్రీంకోర్టు..!

సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా తన వాదనలు వినిపించారు. ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చారని, ఇద్దరికి సాధారణ బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో కొందరికి ముందస్తు బెయిల్, కొందరికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు, చంద్రబాబుకు ఎందుకు బెయిల్ ఇవ్వరని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
జస్టిస్ అనిరుద్ద బోస్ ఫైబర్ నెట్ కేసులో సెక్షన్ 17ఏ ప్రస్తావన ఉండడం వల్ల తరువాతి విచారణను అక్టోబర్ 17 మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. దాంతో అక్టోబర్ 17కి విచారణ వాయిదా వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పీటీ వారంట్ ప్రకారం చంద్రబాబు నాయుడును సోమవారం నాడు ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారని, ఆ రోజు హాజరుపరిస్తే చంద్రబాబుని అరెస్ట్ చేస్తారని, లూథ్రా న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దాంతో జస్టిస్ బోస్ మాట్లాడుతూ ఆర్డర్ ను పాస్ చేయడం లేదు.
కానీ సోమవారం దాకా చంద్రబాబును అరెస్టు చేయవద్దని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీకి చెప్పారు. 17ఏ పై వాదనలు పూర్తి కాలేదు. అందువల్ల ఫైబర్ నెట్ కేసులో ఆర్డర్స్ ఇవ్వలేమని తెలిపారు. అయితే, సోమవారం నాడు చంద్రబాబు అరెస్ట్ చేయరని సీఐడీ తరపున ముకుల్ రోహత్గి హామీ ఇచ్చారు. ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారానికి వాయిదా వేయమని సమాచారం ఇస్తామని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఐటీ మేజర్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024 రెండవ త్రైమాసికంలో 6,333 మంది ఉద్యోగుల తగ్గి, మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కి చేరుకుంది. అయితే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7,186 తగ్గింది. టీసీఎస్ మొదటి త్రైమాసికంలో కేవలం 523 మంది ఉద్యోగుల్ని మాత్రమే కొత్తగా తీసుకుంది. అయితే ఉద్యోగుల వలసలు (అట్రిషన్ రేటు) 17.8 శాతం – 14.9 శాతానికి తగ్గిపోయింది.
టీసీఎస్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుదలతో ఐటీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో అయితే ఉద్యోగుల సంఖ్య వరుసగా పెరుగుకుంటూ వెళ్ళేది. ఈ కంపెనీలో సగానికిపైగా ఉద్యోగులు దాదాపు 2020 తర్వాత చేరారని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుకుంటూ వెళ్తోందంటే ఇది ఐటీ రంగానికే ప్రమాదం అని తెలుస్తోంది. ఇక ఐదే విధంగా ఇతర ఐటీ సంస్థలు అయిన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రోలో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గేపోయే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ అయిన అసెంచర్ ఇటీవల ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. కేవలం 951 మంది ఎంప్లాయీస్ ను మాత్రమే కొత్తగా తీసుకున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్లనే ఈ విధంగా జరుగుతున్నట్లుగా పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వందేభారత్ ట్రైన్స్ తో రైల్వే డిపార్ట్మెంట్ లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ రైళ్లు వేగవంతంగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. అది మాత్రమే కాకుండా ప్రయాణికుల కోరిక మేరకు ప్రతి నెలా కొత్త వందే భారత్ రైళ్లను మొదలుపెడుతున్నారు. ఇక ఇప్పటిదాకా మధ్యాహ్న సమయంలో మాత్రమే ఈ ట్రైన్స్ నడుస్తున్నాయి. అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
అయితే రైలు, బస్సు, విమానం వంటి వాటిలో ప్రయాణం చేయాలంటే ఎవరైనా సరే టికెట్ ఉండాల్సిందే. అయితే తాజాగా యూపీకి చెందిన కానిస్టేబుల్ వందే భారత్ రైలులో టికెట్ లేకుండా ప్రయాణించాడు. ఆయన తన పక్క సీట్లో తన లగేజ్ పెట్టుకున్నారు. టీసీ ప్రయాణికులందరి దగ్గర టికెట్ చెక్ చేస్తూ వచ్చారు. కానిస్టేబుల్ ను టికెట్ చూపించమని ఆడడడంతో టికెట్ లేదని, తాను ఎక్కాల్సిన రైలు మిస్ అవడంతో, ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందని చెప్పారు.
దాంతో టికెట్ లేకుండా ఎలా ఎక్కుతారని, అలా అసలు ఎక్కకూడదని టీసీ చెప్పారు. నెక్స్ట్ స్టేషన్లో అతన్ని దిగిపోమని సూచించారు. ఈ ఘటనను రైల్లో ఉన్న పాసింజర్లు వీడియో తీసి, నెట్టింట్లోషేర్ చేశారు. ఆవీడియో వైరల్ అవడంతో ఈ విషయం రైల్వే శాఖ వరకూ వెళ్లింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. https://twitter.com/razzbsingh/status/1711266701483159844?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1711266701483159844%7Ctwgr%5E9112c634cf91eb6f719a50387a6ea7f88a8eab96%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fnational%2Fviral-video-up-police-personnel-boarded-vande-bharat-without-ticket-tte-reprimanded-719966.html 
ఇజ్రాయెల్లో భారత సంతతికి చెందిన యూదులు సుమారు 95,000 మంది, భారతీయులు 18,000 మంది నివసిస్తున్నారని తెలుస్తోంది. యుద్ధం జరుగుతున్నప్పటికీ కొందరు భారతీయులు పెద్దగా ఆందోళన పడడం లేదు. సెక్యూరిటీకి సంబంధించిన సూచనలను పాటించినట్లయితే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. దాడి ఎక్కువగా ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోనే జరుగుతుందని, మిగతా ప్రాంతాల్లో అంతగా దాడులు జరగట్లేదు. అందువల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటే దాడుల వల్ల కలిగే ప్రమాదం తక్కువ అని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు.
రాకెట్లు ఎక్కువగా అష్కెలోన్ సిటీలోనే పడ్డాయి. ఇక ఈ ప్రాంతంలో ఉండే తెలంగాణకు చెందిన ఎల్లే ప్రసాద్ ”చాలా అలర్ట్ గా ఉండాలి, సైరన్ మోగిన వెంటనే షెల్టర్కు వెళ్ళాలి” అని అన్నారు. హిబ్రూ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ స్టూడెంట్ బిందు మాట్లాడుతూ సేఫ్టీ ప్రోటోకాల్లను ఫాలో అయ్యానని, సురక్షితంగా ఉన్నానని వెల్లడించారు. అలాగే ఇండియన్ స్టూడెంట్స్ అందరూ పరస్పరం టచ్లోనే ఉన్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారని తెలిపారు.
రజాకార్ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తుండగా, బిజీపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్కు రాలేదంటూ ఈ టీజర్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు.చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయని, అందుకే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఐ ఫోన్ సిరీస్ లు వచ్చిన వెంటనే అమ్ముడవుతాయి. రీసెంట్ గా కొత్తగా ఐఫోన్ 15, ప్రో మాక్స్ రిలీజ్ అయ్యాయి. అలా రాగానే ఐ ఫోన్ లవర్స్ ఎగబడి మరి వాటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఐఫోన్ అంటే ఇష్టం ఉన్న ఒక బిచ్చగాడు చిల్లర నాణేలను యాపిల్ స్టోర్కు తీసుకువచ్చి, ఆ నాణేలతో యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ వీడియోలో మాసిపోయిన బనియన్, లుంగీతో శరీరం అంతా మురికితో ఒక బిచ్చగాడు, జనాలతో రద్దీగా ఉన్న యాపిల్ స్టోర్కు వెళ్ళాడు. ఒక సంచీని భుజానికి వేసుకుని ఉన్నాడు. అయితే స్టోర్ లో ఉన్నవారు ఏం జరుగుతుందో అర్థం కాక అతన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ బిచ్చగాడు కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ యాపిల్ ఫోన్ కొనడం కోసం స్టోర్కు వచ్చినట్లు చెప్పాడు. అది విన్నవారు అతను జోక్ చేస్తున్నాడని భావించారు. అయితే అతను తాను తీసుకువచ్చిన సంచీలో ఉన్న డబ్బును చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
సంచిలో తీసుకువచ్చిన చిల్లర అంతా స్టోర్లోని ఫ్లోర్ పై పోసి, వాటిని తీసుకుని యాపిల్ ఫోన్ 15 ప్రో మాక్స్ ఇవ్వామని అడిగాడు. ఇక ఆ స్టోర్ సిబ్బంది అందరూ ఆ నాణేలను లెక్కించగా, రూ.1.59 లక్షల ఉంది. అవి తీసుకుని అతనికి ఐఫోన్ ను ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియోను తీసి, సామాజిక మధ్యమంలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ గా మారింది. కానీ కొంత మంది మాత్రం ఇది ప్రాంక్ వీడియో అని అంటున్నారు. మరి కొంత మంది అయితే నిజంగానే ఇలా జరిగింది అంటున్నారు. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ కేసులో ముఖ్యంగా సెక్షన్ 17A చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే 17A సెక్షన్కు చెందిన వివిధ అంశాలు, గతంలో కొన్ని కేసుల్లో ఇచ్చిన తీర్పుల గురించి ధర్మాసనం ముందు ఉంచారు. వాటిలో రఫేల్ కొనుగోళ్ల విషయంలో యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అలాగే రఫేల్ కేసులో ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ముందు ఉంచారు. రఫేల్ కొనుగోళ్ల పై 2019లో యశ్వంత్ సిన్హా వేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ డిస్మిస్ చేసిన విషయాన్ని కోర్టుకు గుర్తుచేశారు.
బుల్లర్ కేసుతో పాటు పలు కేసులలో తీర్పులను వివరించిన సాల్వే, స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదని అన్నారు. ఈ కేసులో బుల్లర్ కేసులో ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నానని ధర్మాసనాన్ని సాల్వే కోరారు. చంద్రబాబు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ను తాను సవాల్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దానిలో ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు లేదని సాల్వే వాదించారు. ఆ తరువాత ఏపీ సీఐడీ తరఫున లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఫైబర్నెట్, అమరావతి రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు A-24గా, అమరావతి రింగ్ రోడ్డు కేసులో A-1 గా, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. అయితే సీఐడీ అధికారులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ను కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
మరో వైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తన పై రిజిస్టర్ చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తరపున దాఖలు అయిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేదీ బెంచ్ ముందు సీఐడీ తరపున లాయర్ రోహత్గీ, మాజీ సీఎం చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే, మనుషేక్ సింగ్ సింఘ్వీ వాదించారు. 17ఏ చుట్టూనే వాదనలు జరుగుతున్నాయి. రాజకీయల వల్ల కక్ష సాధింపుకు పాల్పడకుండానే సెక్షన్ 17ఏను తీసుకొచ్చారని లాయర్ హరీశ్ సాల్వే వాదిస్తున్నారు.