నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఒక సంఘటన ఇటీవల కలకలం రేపింది. ఆర్టీసీ డ్రైవర్ మీద కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే, విజయవాడ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి కావలి నుండి విజయవాడకి వెళుతుంది.
కావలిలో ట్రంక్ రోడ్ లో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్ డ్రైవర్ అయిన రాంసింగ్ తన ముందు ఉన్న బైక్ అడ్డు తొలగించాలి అంటూ హారన్ మోగించారు. దాంతో ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి డ్రైవర్ తో వాదించడం మొదలు పెట్టాడు. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసి వారిని పంపించేశారు.

కానీ బైక్ నడిపిన వ్యక్తి ఈ విషయాన్ని తన మిత్రులకు చెప్పడంతో 14 మంది ఆ ఆర్టీసీ బస్సులు వెంబడించి, పట్టణ శివార్లలో ఉన్న మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల దగ్గర బస్సుని ఆపారు. డ్రైవర్ ని దుర్భాషలు ఆడి తీవ్రంగా గాయపరిచారు. అక్కడ జరిగిన సంఘటనని బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తన మొబైల్ లో వీడియో తీస్తూ ఉన్నాడు. దాంతో అతని మీద కూడా దాడి చేశారు. అతని మొబైల్ ని ధ్వంసం చేశారు.

ఇదంతా కావలి రూరల్ సీఐకి తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని తెలుసుకున్నారు. డ్రైవర్ ని కావలిలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, “ప్రజల మధ్యలో ఉండి విధులు నిర్వహించే ఆర్టీసీ కార్మికుల పట్ల ఇలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము” అని చెప్పారు. అంతే కాకుండా కావలి రూరల్ పోలీసులు దాడి చేసిన వారిపై సెక్షన్ 217/23 u/s 143, 341, 332, 307, 323, 427, IPC, Dt.26.10.23 లో కేసు నమోదు చేశారు.

నిందితుల కోసం గాలిస్తున్నట్టు కావలి పోలీసులు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ దాడిని ఖండిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డ్రైవర్ పై దాడి చేసిన నిందితుల మీద ఇప్పటికే పలు నేరాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి అని పోలీసులు చెప్పారు. అంతే కాకుండా ఈ నిందితులు ఎంతటి వారు అయినా సరే, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని, లేదంటే ఆందోళన చేస్తాము అని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు తెలిపారు.
watch video :
ALSO READ : నిజంగా ఇలాంటి తండ్రులు ఉంటారా…!















ఇటీవల 26 వారాల గర్భవిచ్ఛిత్తికి పర్మిషన్ ఇవ్వమని కోరుతూ 27 సంవత్సరాల మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తనకు ఇద్దరు పిల్లలున్నారని, తాను మానసికంగా, శారీరకంగా మరో బిడ్డను కనడానికి సిద్ధంగా లేనని కోర్టుకు వివరించింది. మహిళ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అ-బా-ర్ష-న్కి పర్మిషన్ ఇచ్చారు. వైద్య పరంగా అ-బా-ర్ష-న్ కు అక్టోబరు 9న అనుమతిని ఇచ్చింది.
కానీ, ఆ తరువాతి రోజు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 26 వారాల సమయంలో అబార్షన్ చేసినట్లయితే ప్రాణాలకే ముప్పు అని నివేదిక ఇచ్చారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, చీఫ్ జస్టిస్ బెంచ్ కు పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నేడు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. తల్లి గర్భంలోని శిశువు గుండెను ఆపడానికి కోర్టు సుముఖంగా లేదని అన్నారు. ఇప్పటికే గర్భిణికి 26 వారాల, 5 రోజులు అని, ప్రస్తుతం ఈ గర్భం వల్ల తల్లికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
తల్లి హక్కు మరియు గర్భస్థ శిశువు హక్కు మధ్య సమతౌల్యం పాటించాలని అన్నారు. అ-బా-ర్ష-న్ కి పర్మిషన్ ఇస్తే ‘మెడికల్ టె-ర్మి-నే-ష-న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ’ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 5 లను ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. ఈ మహిళ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును గవర్నమెంట్ భరిస్తుందని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తరువాత తాను పెంచుకోవాలా లేదా ఎవరికైనా దత్తత ఇవ్వాలా అనే విషయం పై తల్లిదండ్రులు డిసిషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నెలరోజులు దాటిన ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు నిరసనలు, ఆందోళన తెలుపుతున్నారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా ఆయన మద్ధతుదారులు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు స్త్రీల మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలో వారిద్దరూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి నెల దాటినా, ఇప్పటికి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని వారి ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. చంద్రబాబు అరెస్టు పై ఇప్పటికీ రెస్పాండ్ కాలేదు అని తిడుతూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ను వెళ్ళగక్కారు. వారిలో ఒక మహిళ, నోరు తెరిస్తే ధర్మం, హిందుత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రధాని,
తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అరాచకాల గురించి ఒక్కసారైన మాట్లాడలేదని అన్నారు. ఇండియా వరల్డ్ లో టాప్ 3 ప్లేస్ కి వచ్చిందని అంటారు. కానీ రోడ్ల పై నడిచే మహిళలకు టాయిలెట్లు కూడా లేని పరిస్థితిలో ఉందని ఇంకో మహిళ అన్నారు. ప్రపంచంలో 3 స్థానం కాదు, ముందు రోడ్ల పై వెళ్ళే స్త్రీల కోసం టాయిలెట్లు కట్టించి, గొప్పలు చెప్పుకోవాలి అని తన కోపాన్ని బయటపెట్టింది. వీళ్ల సీరియస్ చర్చను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.