తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్ళ నుండి పోరాడి, ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి, చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ తొమ్మిదేళ్ల నుండి అన్ని రకాలుగా అభివృద్ది దిశగా సాగుతోంది.
అయితే తెలంగాణలోని ఒక విద్యార్ధిని రాష్ట్ర విభజన వల్ల ఎంబీబీఎస్ సీటును కోల్పోయింది. కుమార్తె డాక్టర్ అవుతుందని కలలు కన్న ఆమె తండ్రి, ఉన్నత చదువులకు దూరం కావడంతో సెల్ఫీ వీడియోలో విషయం చెప్తూ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగు న్యూస్ 18 కథనం ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండల కేంద్రంలో రీసెంట్ గా ఈ సంఘటన జరిగింది. ఆ అమ్మాయి తండ్రి సెల్ఫీ వీడియోలో వివరాలు వెల్లడించారు. అశ్వరావుపేటలో నివసిస్తున్న కీర్తన ఒకటవ క్లాస్ నుంచి ఐదవ క్లాస్ వరకు అశ్వరావుపేటలోని స్కూల్ లో చదువుకుంది. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి ఖమ్మం జిల్లాలోని ఎటపాక నవోదయ స్కూల్ లో సీట్ రావడంతో ఆరు నుంచి టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదివింది. ఇంటర్ కరీంనగర్ గురుకుల కళాశాలలో పూర్తి చేసింది.
రీసెంట్ గా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో 362 మార్కులను సాధించింది. వారిది ఎస్సీ కేటగిరి అవడంతో ఎంబీబీఎస్ సీటు తప్పకుండా వస్తుందని ఫ్యామిలీ అంత సంతోషాపడ్డారు. కానీ ఆరవ తరగతిలో కీర్తన చేరిన ఏడాదికి ఎటపాక నవోదయ విద్యాలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయింది. దాంతో కీర్తన ఆంధ్రప్రదేశ్ కు లోకల్ గా, తెలంగాణకు నాన్ లోకల్ గా మారింది. దానివల్ల కేఎన్ఆర్ యూనివర్సిటీలో ఆమె ఎంబీబీఎస్ సీటు కోల్పోయింది.
కీర్తన తండ్రి సూర్య తమ పూర్వీకుల నుండి తెలంగాణలో ఉంటున్నామని అన్నారు. ధ్రువపత్రాలన్ని కలిగి ఉన్నామని తన కుమార్తెను నాన్ లోకల్ గా పరిగణించడం ఎంతవరకు కరెక్ట్ అని, తన కుమార్తె కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వారికి కూడా సీటు వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయం మీద హైకోర్టుకు వెళ్ళగా కీర్తనకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. యూనివర్సిటీలో కోర్టు ఆర్డర్ తో సంప్రదించగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తమకు ఆర్డర్స్ ఉన్నాయని, కీర్తనను నాన్ లోకల్ గా లెక్కిస్తామని చెప్పారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.
విద్యార్థుల పేరంట్స్ స్థానికత అనుగుణంగా ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలని కోర్టు చెప్పినప్పటికీ, ఆ యూనివర్సిటీ దానిని పరిగణలోకి తీసుకోలేదని, దానివల్ల విద్యార్థిని ఉన్నత చదువుకు దూరమయ్యే కండిషన్ ఏర్పడింది. ఈ విషయం పై తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలని కీర్తన పేరెంట్స్ కోరుతున్నారు.
Also Read: ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఖైదీలుగా వెళ్లిన ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?


స్వాతంత్ర్య సమరంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ సహచరులను లాహోర్ కుట్రకేసులో ఈ జైలుకు ఖైదీలుగా తరలించారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం వివిధ ఉద్యమాలకు లీడర్ గా ఉన్నవారిని కూడా ఈ జైలులో ఖైదీలుగా ఉంచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వైశాల్యం పరంగా దేశంలో 4వ పెద్ద జైలు. ఇది 212 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 39.02 ఎకరాల్లో జైలు నిర్మించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విధంగా సెంట్రల్ జైలును నిర్మించారు.
ఈ జైలులో దాదాపు 3 వేల మంది ఖైదీలను ఉంచడానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. 2015లో ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలుని ఆధునీకరించారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడుతో ములాఖత్కు వెళ్ళిన ఆయన సతీమణి భువనేశ్వరి బయటికి వచ్చిన తరువాత ‘‘ఆయన నిర్మించిన బ్లాకులోనే ఆయనను ఖైదీగా ఉంచారు’’ అని వాపోయారు.
ఇక ఈ జైలులో చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖైదీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ జైలులో కొంతకాలం ఉన్నారు. అయితే, ఆయన సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఈ జైలులో కొద్ది రోజులు ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆదేశాలను ధిక్కరించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. ప్రకాశం పంతులు కూడా సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు.
సెప్టెంబర్ 20న ఆ ఊరిలో వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒక బావిలో భవ్యశ్రీ మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం కోసం చిత్తూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు యువకులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
అయితే పోస్టుమార్టంలో బాధితురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవనే విషయం ప్రాథమికంగా తెలిసినట్టు ఎస్ఐ అనిల్కుమార్ వెల్లడించారు. ఆమె పై అఘాయిత్యం కానీ, విషప్రయోగం కానీ, జరిగిందా అనేది పరీక్షించడానికి సాంపిల్స్ ను తీసుకున్నట్లు వెల్లడించారు. బావిలో మునిగి ఊపిరాడక మరణించిందా? లేదా వేరే ఎక్కడైనా చంపి, ఆమె మృతదేహాన్ని తెచ్చి బావిలో పడేశారా అనే విషయం నిర్ధారించడం కోసం స్టెరమ్బోన్ సాంపిల్స్ను సేకరించి కెమికల్ అనాలసిస్ చేయడం కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నట్లుగా వెల్లడించారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో తండ్రి బెడ్ పై కూర్చుని టీవీ చూస్తున్నాడు. అదే సమయంలో కుమారుడు తండ్రి కూర్చున్న బెడ్ పక్కనే నేల మీద కూర్చుని అతను చేసిన పనికి ఎవరైనా నవ్వకుండా ఉండలేరు. తండ్రి టీవీ చూడడంలో నిమగ్నం కావడంతో, కుమారుడు మద్యం బాటిల్, ఒక గ్లాసు తీసుకుని బెడ్ పక్కనే కూర్చుని, గ్లాస్ లో మద్యం పోస్తున్నాడు. అయితే కుమారుడు చేస్తున్న పనిని ఆ తండ్రి గమనిస్తూ ఉంటాడు. అయితే ఆ కొడుకు తాగుబోతు అని అనుకునే ఛాన్స్ ఉంది. వాస్తవానికి అతనికి మద్యం తాగే అలవాటు లేదట. సరదాగా ఆ వీడియో చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఎస్ఎస్_కింగ్ 746 పేరుతో ఉన్న అకౌంట్ లో వారం క్రితం షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకి 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే టైమ్ లో ఈ వీడియోను 14 లక్షల మంది లైక్ చేసారు. నెటిజెన్లు ఈ వీడియోకి రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ ‘అన్నయ్యా నిమిషం లేట్ అయితే మీ తండ్రి కూడా వాటాకి వచ్చేస్తారు‘ అంటూ కామెంట్ చేశారు. ‘అన్నయ్యా ఒంటరిగా డ్రింక్ చేస్తే నాన్నకి కోపం వస్తుంది’ అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెల్సిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 కోసం 3 లక్షల 80 వేలమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 2,32,457 మంది మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను లీకేజీ వల్ల మొదటిసారి రద్దు చేశారు. ఆ తరువాత జూన్ 11న మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఇప్పుడు రెండవ సారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తిరిగి నిర్వహించాలని కోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ టైమ్ లో అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్లే రద్దు చేస్తున్నట్టుగా కోర్టు తెలిపింది. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ అమలు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేని ఓఎంఆర్ షీట్లు ఇవ్వడంతో అక్రమాలకు తావిచ్చేలా ఉందని కొందరు అభ్యర్థులు ఈ విషయం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ ఎగ్జామ్ ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా గవర్నమెంట్ ను, టీఎస్పీఎస్సీ బోర్డును ఆదేశించాలని అభ్యర్థులు బి. ప్రశాంత్, జి.హరికృష్ణ, బండి ప్రశాంత్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, పిటిషనర్ల తరఫున లాయర్ గిరిధర్రావు వాదనల అనంతరం, పరీక్షను రద్దు చేస్తూ ఏరోజు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో అభ్యర్థులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.
గుడిలో దేవుడి సన్నిధికి భక్తితో, స్కూల్ కు శ్రద్దాసక్తులతోనూ వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేవుడు అంటే పాపభీతి లేదు. చదువు నేర్పే గురువులకు గౌరవం ఇవ్వడం లేదు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు వినాయక చవితి వేడుకలను జరుపుకుంటూ, భక్తితో పూజలు చేస్తుంటే, మరో వైపు మండపాల వద్ద ఏమాత్రం ఆలోచన లేకుండా కొందరు దొంగతనాలు చేస్తుంటే మరికొందరు వెకిలి వేషాలు వేస్తున్నారు.
మియాపూర్లో రెండు రోజుల కిందట ఒక గణపతి మండపంలో దేవుడికి కూడా భయపడకుండా ఒక వ్యక్తి గణపతి చేతిలోని లడ్డును దొంగిలించడం తెలిసిందే. తాజాగా మేడ్చల్ లోని రాఘవేంద్రనగర్ కాలనీలో గణేష్ మండపంలో నిద్రిస్తున్న యువకుల వద్దకి వచ్చిన ఒక దొంగ, అర్ధరాత్రి 1: 50 నిమిషాలకు మండపలోకి వచ్చి, పడుకున్నవారి తల దగ్గర పెట్టుకున్న సెల్ ఫోన్లను సైలెంట్గా తీసుకున్నాడు. వారిలో ఒకరు కదులుతున్నా, కొంచెం కూడా భయపడకుండా మెల్లగా సెల్ ఫోన్లను తీసుకుని పారిపోయాడు.
అలికిడికి లేచిన ఒక యువకుడు చూసేసరికి, దొంగ పరారయ్యాడు. మిగతా ఫ్రెండ్స్ ను కూడా లేపి, దొంగ కోసం వెతికారు. అప్పటికే పారిపోయిన దొంగ దొరకలేదు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.



భారత్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఒక గురుద్వార్ బయట హత్య చేయబడ్డాడు. ఇద్దరు వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్ పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే నిజ్జర్ ను ఇండియాకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీలే మర్డర్ చేశాయని, ఈ హత్య పై దర్యాప్తు జరపబోతున్నామని కెనడా పిఎం జస్టిన్ ట్రూడో ఇటీవల ప్రకటించారు.
ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడాలో ఉన్న భారత రాయబారిని కెనడా, ఇండియాలో ఉన్న కెనడా రాయబారిని భారత్ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశాయి. గురువారం నుంచి కెనడా దేశస్థులు ఇండియా రావడానికి వీసాల జారిని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
మరోవైపు ఖలిస్థానీ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో నివసించే హిందువులు వెంటనే భారత్ కు వెళ్లిపోవాలని హెచ్చరికలు చేసింది. కెనడాలోని హిందువులకు ఒక అల్టిమేటంను కూడా జారీ చేసింది. బుధవారం నాడు రాత్రి కెనడాలో జరిగిన గ్యాంగ్ వార్ లో పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే కెనడా వీసాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.