News
తెలంగాణావ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ అప్సర హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకి వస్తుండం అందరిని షాక్ కి గురిచేస్తోంది. నిందితుడు సాయికృష్ణ పరిచయం కాకముందే అప్సరకు వివాహం అయిన విషయం బయటకు వచ్చింది.
తాజాగా అప్సర, కార్తీక్ రాజాలపెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై హత్యకు గురైన అప్సర తల్లి మాట్లాడుతూ నిందితుడు సాయికృష్ణను కాపాడడం కోసమే తమ కూతురు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ రాజా తల్లి ఆడియోను రిలీజ్ చేసింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా అప్సర భర్త కార్తీక్ తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల చేసింది. ఆ ఆడియో ధనలక్ష్మి పెళ్లి ఫోటోలు నిజమే అని వెల్లడించింది. అప్సర తమకు కొంచెం కూడా ఇష్టం లేదని, తన కుమారుడు కార్తీక్కి నచ్చడం వల్లనే ఇద్దరికీ వివాహం చేశాసామని ధనలక్ష్మి అన్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే అప్సర వేరుగా కాపురం పెట్టించిందని అన్నారు. అప్సర టూర్లు, లగ్జరీ జీవితాన్ని ఇష్టపడేదని, వాటి కోసం తన కుమారున్నీ టార్చర్ పెట్టేదని చెప్పారు.
అప్సర వేధింపులు తట్టుకోలేక తన కొడుకు కార్తీక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ధనలక్ష్మి వెల్లడించారు. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్ లో ఉన్నారనే విషయం తమకు తెలియదని అన్నారు. ఇక అప్సరకు తన కొడుకు కార్తీక్ రాజాతో వివాహం అయ్యిందని ధనలక్ష్మి కన్ఫామ్ చేయగా, అప్సర తల్లి పెళ్లి విషయం గురించి ఇప్పుడు అప్రస్తుతం, పోలీసులే తమ కూతురు అప్సర హత్య విషయంలో న్యాయం చేయాలని అడుగుతోంది.
మరోవైపు నిందితుడు సాయికృష్ణ తండ్రి పోలీసుల దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడు సాయికృష్ణకు 14 రోజులు రిమాండ్ ను కోర్టు విధించింది. మొత్తానికి అప్సర హత్య కేసు డైలీ సీరియల్ లా కంటిన్యూ అవుతోంది.
watch video :
Also Read: జస్ట్ మిస్… చివరి నిమిషంలో ప్రమాదం నుండి తప్పించుకుంది..! ఈ మహిళ కథ ఏంటో తెలుసా..?
జస్ట్ మిస్… చివరి నిమిషంలో ప్రమాదం నుండి తప్పించుకుంది..! ఈ మహిళ కథ ఏంటో తెలుసా..?
తాజాగా ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. బెంగళూరు- హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు.. బాలాసోర్లోని బహనాగా బజార్ స్టేషన్కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. సుమారు 290 మంది మరణించగా.. 1200 మందికి పైగా గాయపడ్డారు.
ఈ స్థాయిలో ప్రమాదం జరగడం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దేశ చరిత్రలో అతి భయానక రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోతుంది. అయితే ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దినసరి కూలీల నుంచి ఎందరో పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారు ఈ ప్రమాదంలో బలయ్యారు. కోరమాండల్ రైలు ప్రమాదంలో సాంకేతిక వైఫల్యాల కంటే మానవ తప్పిదమే ఉందని తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదం జరిగిన కోరమాండల్ ట్రైన్ లో ఎక్కబోయి చివరినిమిషాల్లో ప్రయాణం మానుకున్నారు లక్ష్మీ దాస్ సర్కార్. హౌరాలో నివసిస్తున్న లక్ష్మీ దాస్ జూన్ 2న వురమండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కి తన కుమార్తెను కలవడానికి ఆమె చెన్నైకి వెళ్ళాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తన కుమార్తె యొక్క ఆఫీస్ కమిట్మెంట్ కారణంగా ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. అదే ఆమెకు వరంగా మారింది.
ఆమె జూన్ 2 ప్రమాదం తర్వాత మొదటి రన్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఎక్కింది. అప్పుడు ఆమె ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ.. “దేవుడి దయవల్ల ఆ రోజు నా ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది. నా కుమార్తె రావద్దు అనడంతో నేను ఆగిపోయాను. ఇదంతా కృష్ణుడి దయవల్ల జరిగింది. ఇప్పుడు కూడా నేను నాతో కృష్ణుడిని తీసుకువెళ్తున్నాను. ఇక నాకు ఏ ప్రమాదం ఉండదు..” అని ఆమె అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. “”పాయింట్ మెషిన్, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో లోపాల కారణంగా ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సమయంలో జరిగిన మార్పులు ప్రమాదానికి కారణమయ్యాయి. ఇది ఎలా జరిగింది? ఎవరు చేశారు? అన్నది దర్యాప్తులో తెలుస్తుంది” అని పేర్కొన్నారు రైల్వేశాఖ మంత్రి.
Also read: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘటనలో నష్టపోయిన ఈ వ్యక్తి కథ వింటే కన్నీళ్లు ఆగవు..!!
తన రెండో వివాహం గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన నటుడు “ఆశిష్ విద్యార్ధి”..!!
టాలీవుడ్ లో విలన్ పాత్రలతో పేరు సంపాదించిన ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మే 25 అస్సాంకు చెందిన రూపాలీ బారువాతో ఏడడుగులు నడిచాడు. ఒకప్పటి నటి అయిన శకుంతల బారువా కూతురు రాజోషి బారువా అతని మొదటి భార్య. వారికి గతేడాది విడాకులు జరిగాయి.
అయితే 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి.. అంటూ ఆశిష్ విద్యార్ధిపై ఘోరంగా ట్రోల్ చేశారు. ఇక తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించాడాయన. ఆశిష్ విద్యార్ధి మాట్లాడుతూ.. ” నేను రెండో పెళ్లి చేసుకోవడం తో ముసలోడు, సభ్యత సంస్కారం లేనివాడు వంటి అసభ్యకరమైన పదాలతో నన్ను ట్రోల్ చేశారు. జీవితాన్ని సంతోషంగా ముగించాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు..ఓ తోడు కావాలని కోరుకుంటారు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అందుకే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాను.
ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నాను, పన్నులు కూడా కడుతున్నాను. రెండో పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ప్రజలు పక్కనున్న వాళ్ళని నిందించడం మానేసి. కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలి.” అని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఆయన మొదటి భార్య రాజోషి కూడా ఆయన వివాహం పై సానుకూల స్పందన వ్యక్తం చేసారు.
“ఇన్నాళ్లు శకుంతల కూతురుగా, ఆశిష్ కి భార్యగా సమాజంలో గౌరవం పొందాను ఇప్పుడు.ఇప్పుడు స్వతంత్రంగా ఎదగాలనుకున్నాను మేమిద్దరం నడిచే మార్గాలు వేరు కావడంతో ఒకరిపై ఒకరికి ఎలాంటి కోపం లేకపోయినా, గొడవలు లేకపోయినా కలిసి ఉండలేము అని అర్థం చేసుకొని సగౌరవం గా విడిపోయాం. 22 ఏళ్ల పాటు కలిసి జీవించాం ఒకరంటే ఒకరికి మంచి గౌరవం మర్యాద ఉన్నాయి. అతడు మరో వివాహం చేసుకోవడానికి నా పూర్తి సమ్మతం ఉంటుంది. నా కొడుకు అర్థ్ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఆయన వివాహానికి నా శుభాకాంక్షలు..” అంటూ రాజోషి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆశిష్ విద్యార్థి సుమారు మూడున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, ఒడియా, బెంగాలీ భాషల్లో నటించాడు. ఇప్పటి వరకూ 11 భాషల్లో 300కుపైగా సినిమాల్లో నటించడం విశేషం. 1995లో ద్రోహ్కాల్ సినిమాకుగాను అతడు నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. తెలుగులో గుడుంబా శంకర్, ఆగడు, పోకిరిలాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘటనలో నష్టపోయిన ఈ వ్యక్తి కథ వింటే కన్నీళ్లు ఆగవు..!!
తాజాగా ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. బెంగళూరు- హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు.. బాలాసోర్లోని బహనాగా బజార్ స్టేషన్కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. సుమారు 290 మంది మరణించగా.. 1200 మందికి పైగా గాయపడ్డారు.
ఈ స్థాయిలో ప్రమాదం జరగడం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దేశ చరిత్రలో అతి భయానక రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోతుంది. అయితే ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దినసరి కూలీల నుంచి ఎందరో పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారు ఈ ప్రమాదంలో బలయ్యారు. కోరమాండల్ రైలు ప్రమాదంలో సాంకేతిక వైఫల్యాల కంటే మానవ తప్పిదమే ఉందని తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదంలో అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు పినాకి రంజన్ మోండల్. ఈయన బాలాసోర్ స్టేషన్ లో లెమన్ టీ విక్రయిస్తూ ఉంటారు. శుక్రవారం సాయంత్రం కూడా అలాగే టీ విక్రయించేందుకు చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అయితే తాను ఆ తర్వాతి స్టేషన్ అయిన భద్రక్ వరకు ప్రయాణించి మిగిలిన టీ అమ్మి.. తిరిగి బాలాసోర్ కి చేరుకుంటానని పినాకి రంజన్, అతని స్నేహితుడు, రూమ్మేట్ అయిన సుజోయ్ జానాకి చెప్పాడు.
సుజోయ్ బాలాసోర్ లో దిగిపోయి.. వాళ్ళిద్దరి కోసం వంట చేయడం ప్రారంభించాడు. కానీ కోరమాండల్ భద్రక్ చేరుకునేలోపే ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో నివసించే మోండల్ బంధువు బిట్టు షా సుజోయ్ కి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. జానా వెంటనే మోండల్కి మొబైల్కి కాల్ చేసినా రింగ్ అవ్వలేదు.
సుజోయ్ వెంటనే తెలిసిన వారి సాయంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. నుజ్జునుజ్జయింది బోగీల మధ్య మోండల్ కోసం వెతుకులాట ప్రారంభించాడు సుజోయ్. చివరికి రాత్రి 10 గంటల సమయంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అతడు తీవ్రంగా గాయపడి మరణించినట్లు సుజోయ్ తెలిపాడు. ఆ తర్వాతి రోజు మోండల్ భార్య అతడిని గుర్తించింది.
“పినాకి రంజన్ తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం వరకు వివిధ రైళ్లలో టీ అమ్మేవాడు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాడు. అతను రోజుకు రూ. 700-800 రూపాయలు సంపాదించేవాడు. ప్రతివారం హౌరా వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్ళేవాడు. అతను చనిపోయి ఇంటికి తిరిగి వస్తాడని నేను ఊహించలేదు.” అని ఆయన భార్య జ్యోత్స్నా వెల్లడించారు.
“పినాకి రంజన్ మోండల్కి ఇద్దరు పిల్లలు. మోండల్ రాజస్థాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కరిమికుడిగా పనిచేసేవారు. నోట్ల రద్దు తర్వాత ఉద్యోగం కోల్పోయిన అతను 2017లో ఇంటికి తిరిగి వచ్చి రైళ్లలో టీ అమ్మడం మొదలుపెట్టాడు. ఆయన మొదట లోకల్ రైళ్లలో టీ అమ్మేవాడు. అయితే తన పిల్లల చదువు ఖర్చులు పెరిగిన తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లకు మారాడు. ఒక కప్పు లెమన్ టీ మీకు లోకల్ రైలులో రూ. 5 కాగా ఎక్స్ప్రెస్ రైలులో రూ. 10 ” అని ఆయన సోదరుడు ప్లాబన్ తెలిపారు.
Also read: “కోరమాండల్ ఎక్స్ప్రెస్” ట్రైన్ ప్రమాదం జరగడానికి కారణం ఇదేనా..? ఇలా చేయకపోయి ఉంటే..?
“ఆదిపురుష్” థియేటర్ లో హనుమంతుడి పక్కన సీట్ కావాలి అంటే… ఎంత కట్టాలో తెలుసా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.
అయితే తాజాగా ఆదిపురుష్ మేకర్స్ యువీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది ఏమిటంటే “ఆది పురుష్” సినిమా ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీ ఉంచడం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో చెప్పారు. దానికి సమాధానం కూడా ఆ ప్రకటనలో ఇచ్చారు.
ఎక్కడ రామాయాణ పారాయణం జరిగినా, ఎక్కడ శ్రీరామ కథను ప్రదర్శించినా అక్కడ ఒక ఆసనాన్ని వేస్తుంటారు. అలా వేయడానికి కారణం శ్రీరామ కథను వీక్షించేందుకు ఆ స్థలానికి ఆంజనేయుడు వస్తాడని భక్తుల నమ్మకం. ఆ కారణంగానే మూవీ యూనిట్ కూడా ఆంజనేయుడి కోసం ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది.
అయితే ఈ హనుమంతుడి సీట్ పక్కన ఉండే సీట్ ధర ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణ సీట్ ధర 250 రూపాయలు ఉంటే.. హనుమంతుని సీట్ పక్క సీట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక మరోవైపు ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు.. పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also read: “ఆదిపురుష్” సెన్సార్ రివ్యూ..! సినిమా హిట్టా..? ఫట్టా..?
సినిమాను తలపిస్తున్న సంఘటన..! ఈ యువకుడు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. అలాంటి వేడుకను తమ ఆర్థిక స్థితికి తగ్గట్లుగా వైభవంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇక నేటి తరం యువత పెళ్లిలో గతానికి భిన్నంగా కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నారు. తమదైన మార్కుతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకోవడం కోసం వధువు కావాలంటూ ఓ కుర్రాడు ఊరంతా పోస్టర్లు అంటించాడు.ఈ పోస్టర్లు చూసిన గ్రామస్తులంతా అవాక్కయ్యారు. న గురించి ఇతరులకు అడగకుండా నేరుగా తననే కలవాలని ఆ వాల్ పోస్టర్లో రాసుకున్నాడు.అసలు ఆ యువకుడు ఎవరు.? ఎందుకు అలా వాల్ పోస్టర్ రాశాడో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాపట్ల జిల్లా వేటపాలెం లోని రామన్నపేటకు చెందిన అయ్యప్ప కుమార్ (28)కు తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగాడు. కరోనాకు ముందు హైదరాబాదులో ఓ చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. కరోనా తర్వాత ఉద్యోగం మానేసి బాపట్ల వచ్చేసాడు. అప్పటి నుంచి తనకు పెళ్లి చెయ్యమని అమ్మమ్మను వేధించేవాడు. అయితే ఉద్యోగం లేకుండా పెళ్లి చెయ్యను అని తన అమ్మమ్మ మందలించేసరికి ఆలోచించి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు అయ్యప్ప.
తన పెళ్లి తానే సెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వాల్ పోస్టర్ తయారు చేశాడు. అందులో నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఎటువంటి ఫోన్లు, మెసేజ్లు చేయాల్సిన అవసరం లేకుండా రామన్నపేటలోని మా ఇంటికి వచ్చి ధైర్యంగా నన్ను కలవగలరు. మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకుండా నేరుగా నాతో మాట్లాడండి.నా పేరు దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్, నా వయసు 28 సంవత్సరాలు, చదువు.. డిగ్రీ బీకాం అని రాసుకున్నాడు.
ఈ పాంప్లెట్లను వేటపాలెంలోని అన్ని ప్రధాన సెంటర్లలో అంటించాడు. దీంతో ఈ వాల్ పోస్టర్ చూసిన గ్రామస్తులంతా అవాక్కయ్యారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అయ్యప్ప ఇంటికి వచ్చి అతని అమ్మమ్మను విచారించారు. అయ్యప్పకు ఉద్యోగం లేని కారణంగా మానసిక స్థితి నిలకడగా లేదని అతని అమ్మమ్మ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పరారీలో ఉన్న పోలీసులు అయ్యప్ప కుమార్ కోసం గాలిస్తున్నారు.
రాజనాల మొదలుకొని కైకాల సత్యనారాయణ , కోటా శ్రీనివాసరావు , నర్రా వెంకటేశ్వర్రావు , రామిరెడ్డి, సత్య, అమ్రిష్ పూరి ఇలా చెప్పుకుంటూ పోతే మన విలన్ల లిస్టు పెద్దదే. సినిమాల్లో విలన్లుగా వీళ్లని చూడగానే దడపుట్టేది . ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడంలో హీరో పాత్ర ఎంతుంటుందో,హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్ర కూడా అంతే ఉంటుంది.
ఇప్పటి చిత్రాల్లో విలన్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ప్రకాశ్ రాజ్ . తండ్రిగా ప్రేమని ప్రదర్శిస్తూనే ఒకే సమయంలో విలన్ గా కూడా విలక్షణంగా నటించగల నటుడు ప్రకాశ్ రాజ్ .ప్రభాకర్,అజయ్, ముకేశ్ రుషి, షియాజి షిండే, పరేష్ రావెల్,అశుతోష్ రానా, రోబో చిత్ర విలన్ డాని, మురళి శర్మ వీళ్లందరిది విలనిజంలో విభిన్న పంథా .
నిజానికి మన మనసుల్లో వాళ్లపట్ల ఒక ముద్ర ఉంటుంది. కానీ ఒకప్పుడంటే తారల గురించిన విషయాలు బయటికి వచ్చేవి కావు, కాని ఇఫ్పుడు సోషల్ మీడియా పుణ్యమాని నటులకి సంబంధించిన విషయాలు ఈజిగా తెలిసిపోతున్నాయి.
సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసేవాళ్లంతా బయట జీవితంలో రియల్ హీరోలు అనిపించుకుంటున్న ఘటనలు ఇటీవల చాలా జరిగాయి .ఉదాహరణకి ప్రకాశ్ రాజ్, సియాజిషిండే , సోనూసూద్ , మరియు రేసు గుర్రం విలన్ రవి కిషన్ వీళ్లంతా బయట సొసైటీలో మంచి పనులు చేస్తూ , సామాజికంగా తమ గొంతు వినిపిస్తూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు.
సినిమాల్లో విలనిజాన్ని పండించిన మన విలన్ల భార్యలు ఎలా ఉంటారు? వాళ్ల కుటుంబ సభ్యులెలా ఉంటారు లాంటి డౌట్లు కూడా మనకి అప్పుడప్పుడు వస్తుంటాయి. నిజానికి మన విలన్ల భార్యలందరూ అందగత్తెలే , వాళ్లల్లో కొందరు మనకి తెలిసిన నటీమనులు కూడా, ఉదాహరణకి మురళీ శర్మ భార్య అశ్విని బద్రినాథ్ మూవిలో విలన్ రోల్ చేసింది.
అశుతోశ్ రానా భార్య రేణుక సుహాని ఒకప్పటి బుల్లితెర హోస్ట్ , నటి. సల్మాన్ మాదురి జంటగా వచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ సినిమాలో రేణుక పాత్ర గుర్తుండిపోతుంది. ప్రకాశ్ రాజ్ భార్య రీనా రాయ్ క్యాస్టుమ్ డిజైనర్ . ప్రకాశ్ రాజ్ మొదటి భార్య, డిస్కోశాంతి అక్కా చెల్లెల్లు , అంటే శ్రీహరి, ప్రకాశ్ రాజ్ తోడళ్లుల్లు ఒకప్పుడు.
దివంగత నటుడు రఘువరన్ , నటి రోహిణి భార్యభర్తలు .. రోహిణి బాలనటిగా సినిమారంగ ప్రవేశం చేసింది, బుల్లితెర నటుడు బాలాజి ,రోహిణి ఇద్దరు అక్కాతమ్ముళ్లు. ప్రేమవివాహం చేసుకున్న రోహిణి,రఘువరన్ కొంతకాలం కాపురం తర్వాత విడాకులు తీసుకున్నారు . సినిమాలకు దూరమైన రోహిణి, తల్లి పాత్రల్లో మళ్లీ అలరిస్తున్నారు.
వదల బొమ్మాలి నిన్నొదలా అనే డైలాగ్ తో ప్రేక్షకులని భయపెట్టిన పశుపతి అలియాస్ సోనూసూద్ భార్య సోనాలిసూద్ యాక్టర్, మోడల్ మరియు ప్రొడ్యుసర్.
లెజెండరీ స్టార్ హీరోల చివరి సినిమాలు చిరస్మరణీయం కావాలని కోరుకుంటారు కానీ ఒక్కోసారి అనూహ్యంగా ఇవి కొత్త మలుపులు తీసుకుంటాయి. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రం మనం. అయితే నలభై ఏళ్ళు ల్యాబ్ లో మగ్గిపోయిన ప్రతిబింబాలు లాస్ట్ మూవీ అయ్యింది.
ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వంతు వచ్చింది. ఆయన ఆఖరిగా తెరమీద కనిపించిన సినిమా శ్రీశ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫ్యాన్స్ కి గుర్తే. కానీ ఇప్పుడు వేరే చిత్రం తెరపైకి వచ్చింది. 2007లో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
శాండల్ వుడ్ లో పేరున్న హెచ్ మధుసూదన్ దర్శకత్వం వహించారు. రకరకాల కారణాల వల్ల ల్యాబ్ నుంచి బయటికి రాలేదు. ఇన్నేళ్లు బయటికి తీసుకొచ్చే చొరవ ఎవరూ చేయలేదు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కృష్ణ జయంతిని పురష్కరించుకుని మే 31న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి శ్రీపాద్ హంచాటే నిర్మాత. ‘2007లో సినిమా పూర్తయింది, ఇన్నాళ్లకు నేనే సొంతంగా విడుదల చేస్తున్నాను’ అని డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు. మొదట దీనికి ‘ప్రేమ చరిత్ర’ అని టైటిల్ పెట్టారు. ఇప్పుడు 16 ఏళ్ల తరవాత ఈ సినిమాను ‘కృష్ణ విజయం’ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఆవిష్కరించారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కృష్ణ పర్సనల్ మేకప్మేన్ మాధవరావు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యశ్వంత్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రంలో మెగాబ్రదర్ నాగబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యం.యం.శ్రీలేఖ సంగీతం సమకూర్చారు.
“కోరమాండల్ ఎక్స్ప్రెస్” ట్రైన్ ప్రమాదం జరగడానికి కారణం ఇదేనా..? ఇలా చేయకపోయి ఉంటే..?
శుక్రవారం (జూన్ 2) నాడు హౌరా నుండి చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒడిశాలో బహనాగ్ రైల్వే స్టేషన్లో ఆగిన గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టడంతో కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 7 :20 లకు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 237 మందికి మరణించగా, 900 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని అధికారిక సమాచారం. గాయపడిన వారందరిని హాస్పటల్ కు తరలించారు. ఈ ఘటన పై విచారం తెలిపిన కేంద్ర రైల్వే మినిస్ట్రీ హై లెవెల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రమాదానికి గల అసలు కారణం బయటికి వచ్చింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సాఫీగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో తమ రైలు పట్టాలు తప్పిందని ప్రయాణికులు తెలుసుకునేలోగా ట్రైన్స్ ఢీ కొని కొందరిని మృత్యువు కబళించింది. కొందరు స్పాట్లోనే, మరికొందరు బోగీల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమదస్థలం భయనకంగా మారింది. కోచ్లు 30 వరకు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన విధానానికి మృతదేహాలు చెల్లాచెదురు అయిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోయింది. అయితే ఈ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి గల కారణం బయటకు వచ్చింది.
ఇప్పటిదాకా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, కోరమండల్ ట్రైన్ ను ఢీకొడితే, అది వెళ్ళి గూడ్స్ ఢీకొట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే అది నిజం కాదని తేలింది. జరిగిన యాక్సిడెంట్ కు సిగ్నలింగ్ మరియు టెలికమ్యూనికేషన్ ఫెయిల్యూరే కారణం. వేగంగా వస్తున్న కోరమాండల్ ట్రైన్ కి దారి ఇవ్వడం కోసం ఆ ట్రాక్ పైన ఉన్న గూుడ్స్ ని రైల్వే అధికారులు లూప్ లోకి పంపారు. అయితే 110కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కోరమాండల్ ట్రైన్ బహెనాగ్ రైల్వే స్టేషన్ కు వచ్చాన తరువాత సిగ్నలింగ్ లోపం వల్ల గూడ్స్ ఉన్న లూప్ లైన్లో కి వెళ్లింది.
కానీ సిగ్నల్ ప్యానెల్ లో ఆ ట్రైన్ మెయిన్ లైన్ లోనే వెళ్తున్నట్టు చూపించింది. దాంతో మెయిన్ లైన్ వెళ్తుందనుకుని లూప్ లైన్లో వెళ్లి ఆ ట్రాక్ మీద ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది. దాంతో కోరమాండల్ భోగీలు కొన్ని గూడ్స్ భోగీల మీద ఎక్కాయి. కోరమాండల్ భోగీలు కొన్ని పక్కనే ఉన్న వేరే ట్రాక్ పై పడ్డాయి. కాసేపటికి పక్క ట్రాక్ పైకి వచ్చిన యశ్వంత్ పూర్ ట్రైన్ ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది.|
కోరమాండల్ ట్రైన్ గూడ్స్ ని ఢీకొని 16 నిముషాలు అయినా అటువైపు వస్తుున్న యశ్వంత్ పూర్ ట్రైన్ ను మరో స్టేషన్ లో ఆపలేదు. శుక్రవారం నాడు మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఘోరప్రమాదానికి కారణం సిగ్నల్ మరియు టెలి కమ్యూనికేషన్ టెక్నికల్ సమస్య అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇదంతా 15 నిముషాల వ్యవధిలోనే జరిగిందని తెలుస్తోంది.