భార్యభర్తల బంధం కలకాలం సంతోషంగా సాగాలంటే ఒకరి పై మరొకరికి నమ్మకం ఉండాలి. భార్య భర్తల బంధానికి నమ్మకమే పునాది. కానీ జీవితభాగస్వామి అయిన భార్యకు కొన్ని విషయాలు చెప్పినట్లయితే ఆ బంధానికి బీటలు ఏర్పడవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
భార్యాభర్తల జీవనం సంతోషంగా సాగాలి అంటే ఎలా ఉండాలో? ఏం చేయాలి అనేవాటిని చెప్పే అనుభవజ్ఞులు, భర్త భార్యకు అస్సలు చెప్పకూడని ఐదు విషయాలు గురించి కూడా చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

- భర్త తన మాజీ ప్రేయసి గురించి భార్యకు అస్సలు చెప్పకూడదు. ఆ జ్ఞాపకాల గురించిన ప్రస్తావన కూడా భార్య ముందు తేకూడదు. ఎందుకంటే పెళ్ళి జరిగిన క్షణం నుంచి భార్య భర్తే లోకంగా బ్రతుకుతుంది. భర్త మనసులో తనకు మాత్రమే చోటు ఉండాలని భావిస్తుంది.

2. భర్త తనకు ఉన్న కొన్ని బాలహీనతల గురించి కూడా భార్య దగ్గర చెప్పకూడదని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అలాంటివీ భార్యకు చెప్పినప్పుడు, గొడవ జరిగినపుడు భార్య ఆ బలహీనతను ఎత్తి చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బలహీనత గురించి భార్యతో మాత్రమే కాకుండా ఇతరులకు సైతం చెప్పకూడదట,మీ బాలహీనతను వారికి అనుకూలంగా మార్చుకోవడం ద్వారా కొత్త సమస్యలు రావచ్చు.

3.తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల గురించిన చెడు విషయాలను సైతం భార్యతో పంచుకోకూడదు. అలా చెప్పడం వల్ల భర్త కుటుంబ సభ్యుల పై గౌరవం తగ్గడమే కాకుండా చులకన ఏర్పడుతుంది.
4. గతంలో చేసిన తప్పులను కూడా భర్త తన భార్యతో చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు వాటిని ఎట్టి చూపే అవకాశం ఉంటుంది.

5. భర్త తనకున్న ఆరోగ్య సమస్యల గురించి భార్యకు అబద్ధాలు చెప్పకూడదు. అవి బయటపడినప్పుడు భార్య తట్టుకోలేదు. దాని కారణంగా ఇద్దరి మధ్య సమస్యలు ఏర్పడవచ్చు. చేసిన తప్పును నిజాయితీగా అంగీకరించకుంటే భార్యభర్తల మధ్య నమ్మకం తగ్గి వారి వైవాహిక బంధం బలహీనమవుతుంది.
Also Read: ఎన్ని సంవత్సరాలు ఇంటికి అద్దె కడితే…ఆ ఇల్లు మీ సొంతం అవుతుందో తెలుసా.?


























ఫలక్నుమా ప్యాలెస్ అద్భుతమైన చరిత్ర ఉన్న ఇండియన్ వారసత్వ ప్యాలెస్లలో ఒకటి. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన భవనాలలో ఒకటి. హైదరాబాద్ రాష్ట్ర నిజాం యొక్క అమూల్యమైన వారసత్వం. దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధాని మరియు 6 వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క బావ నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా ఫలక్నుమాలో 32 ఎకరాల ప్రదేశంలో నిర్మించారు. ‘ఫలక్-నుమా’ అనేది ఉర్దూ పదం, దీనికి
సర్ వికార్ అని పేరుగాంచిన నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా తన కలల అడుగుల ఎత్తైన కొండపై 1884లో మార్చి 3న పునాది రాయిని వేశారు. ఈ ప్యాలెస్ నిర్మాణం తొమ్మిది సంవత్సరాల పాటు సాగింది. దీని నిర్మాణం పూర్తిగా 1893లో పూర్తయింది. ఎంతో అందమైన ఈ ప్యాలెస్ దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ప్యాలెస్ 1,011,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్యాలెస్ డిజైన్ను రూపొందించడానికి ఒక ఆంగ్ల ఆర్కిటెక్ట్ని పిలిచాడు. విలియం వార్డ్ మారెట్ అనే శిల్పి ఈ ప్యాలెస్ ను ‘ఆండ్రియా పల్లాడియో’ అనే శైలిలో నిర్మించాడు.
ఇక ఈ ప్యాలెస్ నిర్మాణానికి ఆ 130 సంవత్సరాల క్రితమే 40లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ ప్యాలెస్ అంతా ఇటాలియన్, ట్యూడర్ శైలుల సమ్మేళనంతో ఉన్న ప్రత్యేకమైన నిర్మాణం. ఈ ప్యాలెస్ నిర్మాణం కోసం ఇటలీ నుండి తెప్పించిన నాణ్యమైన ఇటాలియన్ పాలరాతితో కట్టారు. ఈ భవనం తేలు ఆకారంలో కనిపిస్తుంది. సర్ వకార్ రాశి వృచ్చికం అందువల్ల ఈ ప్యాలెస్ ను తేలు ఆకారంలో నిర్మించారు.
తేలు ఆకారంలో ఉన్న ప్యాలెస్ మధ్యలో ప్రధాన భవనం, గోల్ బంగ్లా, జెన్నా మహల్, వంటగది, దక్షిణ వైపు పట్టపు రాణులు, వారి చెలికత్తెల కోసం నిర్మించారు. ఫలక్ నుమా ప్యాలెస్ లోని కిటికీలకు వాడిన రంగు రంగుల అద్దాల నుంచి వచ్చే సూర్య కాంతి ప్యాలెస్ లోని గదులకు ప్రత్యేక ఆకర్షణ కలుగచేస్తాయి.
ఇంత అందమైన ప్యాలెస్ లో సర్ వికార్ 1897-98 వరకు మాత్రమే వ్యక్తిగత నివాసంగా ఉపయోగించుకున్నాడు. ఈ ప్యాలెస్ అత్యంత ఖరీదైన నిర్మాణం. దీని నిర్మాణం కోసం చేసిన అప్పులను కట్టడానికి వికార్ కు ఎంతో కాలం పట్టిందట. ఆ తర్వాత ప్యాలెస్ యాజమాన్య బాధ్యతలను 6వ నిజాంకు అప్పగించారు.
సర్ వికార్ తన భార్య ఇచ్చిన సలహా ప్రకారం అప్పటి రాజు మహబూబ్ అలీ పాషా నిజాంను ప్యాలెస్ కు ఆహ్వానించారు. ప్యాలెస్ కు వచ్చిన మహెబూబ్ అలీ పాషా ప్యాలెస్ యొక్క నిర్మాణానికి ముగ్దులయ్యారు. దానిని చూసిన తరువాత చాలా ఖరీదు అయ్యిందని, ప్యాలెస్ కట్టడం కోసం వికార్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని తెలుసుకుని వకార్ కు అవసరమయిన ఆర్థిక సహాయం చేశారు. ఆయన అక్కడ నెలరోజుల పాటు ఉన్నారు.
సర్ వికార్ ప్యాలెస్ ను మహబూబ్ అలీ పాషాకు బహుమతిగా ఇచ్చాడు. కానీ అలీ పాషా దానిని బహుమతిగా స్వీకరించడానికి నిరాకరించాడు. ఆ ప్యాలెస్ కు తగిన మొత్తాన్ని ఇచ్చి తీసుకున్నాడు. ఆయన తరువాత ఏడో నిజాం ఈ ప్యాలెస్ను ‘రాయల్ గెస్ట్ హౌస్’ గా ఉపయోగించుకున్నారు.
ఫలక్నుమా ప్యాలెస్లోని లైబ్రరీ ఇంగ్లాండ్లోని విండ్సర్ కాజిల్ లైబ్రరీ వలె గంభీరంగా ఉంటుంది. విండ్సర్ కాజిల్ లైబ్రరీ తరహాలో రూపొందించబడింది. ఇది నిజాం కచేరీల నుండి అరుదైన మాన్యుస్క్రిప్ట్లు మరియు పుస్తకాలను కలిగి ఉంది. ప్యాలెస్ లోని గ్రంథాలయంలో ఇండియాలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి.
ఇక్కడి బిలియర్డ్స్ గదిలోని బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదు అయినది. ఇలాంటి అరుదైన టేబుల్స్ ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఫలక్నుమా ప్యాలెస్ లో ఉంది. మరొకటి లండన్ బకింగ్హామ్ ప్యాలెస్లో ఉంది. టేబుల్ అద్భుతమైన, విలాసవంతమై నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్యాలెస్ గోడల పై ఉన్న ప్రముఖుల ఫోటోలు ఆయిల్ పెయింటింగ్ తో వేశారు. ఇలాంటి ఎన్నో విశేషాలు ఫలక్ నుమా ప్యాలెస్ సొంతం అని చెప్పవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన 108 అడుగుల డైనింగ్ టేబుల్ లో ఒకేసారి 101 మంది కూర్చుని భోజనం చేయవచ్చు. ఈ భారీ డైనింగ్ హాల్ ఫలక్నుమా ప్యాలెస్ కు ప్రత్యేక ఆకర్షణ. దీనిని ప్రత్యేకమైన కలపతో తయారు చేశారు. ఈ టేబుల్ 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తు ఉంది. ఈ టేబుల్ తయారీకి టేకు, రోజ్ ఉడ్లను ఉపయోగించారు. చుట్టూ ఉన్న కుర్చీలకు పచ్చని రంగు కల అరుదైన లెదర్ని వాడారు.
2000 సంవత్సరం ముందు సాధారణ ప్రజలను ఫలక్ నుమా ప్యాలెస్లోకి రానివ్వలేదు. తాజ్ గ్రూప్ ఈ ప్యాలెస్ ను అద్దెకు తీసుకుని, మరింతగా ఆధునీకరించి ఫ్రాన్స్ నుండి తీసుకువచ్చిన అందమైన ఫర్నీచర్ మరియు హస్తకళా వస్తువులతో ఈ హోటల్ ను మరింత అందంగా అలంకరించారు. ఈ హోటల్ 2010 నవంబర్ లో ప్రారంభం అయ్యింది. ఈ హోటల్లో ప్రస్తుతం ఎవరైనా భోజనం చేయవచ్చు.
ఈ ఇక్కడి డైనింగ్ టేబుల్ పై భోజనం చేయాలంటే మాత్రం కనీసం 40 మంది ఉండాలి. ఈ హోటల్ బస కూడా చాలా ఖరీదు. భోజనం ధర 5 వేలు. ప్రత్యేక టేబుల్ భోజనం రూ.18వేలు. ఒకరోజు ఇక్కడ ఉండటానికి దాదాపు 46,000. ఈ ప్యాలెస్ లో 60 గదులు మరియు 22 హాళ్లు ఉన్నాయి.
సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగి లంచం అడిగినప్పుడు, ఆ బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు లంచం అడిగిన విషయం చెప్పగానే వారు రంగంలోకి దిగుతారు. ఏసీబీ అధికారులు బాధితుడికి లంచం ఇవ్వడానికి కొంత డబ్బు ఇస్తారు. అయితే ఆ డబ్బు మీద ముందుగానే ఫినాప్తలిన్ పౌడర్ ను చల్లి ఇస్తారు. బాధితుడు ఫినాప్తలిన్ పౌడర్ ను చల్లిన డబ్బును లంచం అడిగిన గవర్నమెంట్ ఉద్యోగికి ఇస్తారు.
డబ్బు ఇచ్చిన వెంటనే ఆ గవర్నమెంట్ ఉద్యోగి అడిగిన డబ్బులు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కోసం ఆ డబ్బును లెక్క పెడతారు. అయితే ఆ కరెన్సీ నోట్లకు ఉన్న పినాప్తలిన్ పౌడర్ సదరు ఉద్యోగి చేతులకు అంటుతుంది. వెంటనే ఏసీబీ ఆఫీసర్లు సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు. లంచం తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగి చేతులను కాస్త సోడియం కార్బోనేట్ కలిపిన వాటర్ లో ముంచి తీస్తారు.
ఫినాప్తలిన్ పౌడర్ సోడియం కార్బోనేట్ కలిపిన ద్రావణంలో ముంచడంతో ఉద్యోగి చెయ్యి వెంటనే పింక్ రంగులోకి మారితుంది. అలా ఆ లంచం తీసుకున్న ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఏసీబీ అధికారులు పట్టుకున్న వ్యక్తితో పాటు, పింక్ కలర్ లోకి వచ్చిన ద్రావణంను కోర్టులో సాక్ష్యంగా చూపిస్తారు. అలా లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడేలా ఏసీబీ అధికారులు చేస్తారు.
మరి ముఖ్యంగా అమ్మాయిల ఈమధ్యకాలంలో సినిమాలలో చూపించినట్టుగా ఇంట్లో టి షర్ట్, షార్ట్స్ ఎక్కువగా ధరిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా టి షర్ట్, షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఒకప్పుడు హిందీ సినిమాలలో హీరోయిన్లు చిన్న చిన్న టి షర్ట్, షార్ట్స్ వేసుకునేవారు.
ఆ తరువాత కాలంలో తెలుగు సినిమాలలో కూడా ఈ ఫ్యాషన్ వచ్చింది. వాటిని చూసిన అమ్మాయిలు అలానే పడుకునే సమయంలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు టి షర్ట్, షార్ట్స్ వేసుకుంటున్నారు. అడిగితే ట్రెండ్ కు తగ్గట్టుగా నడుస్తున్నామని అంటున్నారు. కానీ వారు వేసుకునే బట్టలు ఖచ్చితంగా సినిమా ప్రభావమే అని అన్నారు. అమ్మాయిలు ఫ్యాషన్ లో మార్పు వచ్చినపుడు, వారు యాక్సెసరిస్ ఎక్కువగా కోరుకుంటారు. వాటికోసం ఎక్కువగా ఖర్చుపెడుతూ ఉంటారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ప్రతి సినిమాని నియమ నిబంధనలు ఫాలో అవ్వకుండా చూస్తున్నారు. దాంతో యువత కూడా తమ వయసుకి మించిన సినిమాలు చూస్తున్నారు. తెలిసి తెలియని వయసులో వారు ఉంటారు కాబట్టి అందులో హీరో హీరోయిన్లు చేసే విషయాలని వారు ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా సినిమాలు చూసే ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్న లీడ్ రోల్ ఎలాంటి పనులు అయితే చేశారో అలాంటివే చేయాలి అనుకుంటారు.



