మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మనుషులకి సిటి స్కాన్ చేస్తారు కదా. అదేవిధంగా పురాతన వస్తు శాఖ వాళ్లు వాళ్లకి ఏదైనా పురాతనమైన విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని మనిషికి చేసినట్టే సిటి స్కాన్ చేస్తారు.
అదేంటి విగ్రహాన్ని ఎందుకు స్కాన్ చేస్తారు అనుకుంటున్నారా? ఎందుకంటే విగ్రహం లోపల ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అలా స్కాన్ చేస్తారు.

నెదర్లాండ్స్ లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని శాస్త్రవేత్తలు స్కాన్ చేశారు. ఆ స్కానింగ్ లో తెలిసిన విషయం ఏంటంటే, ఆ విగ్రహం లో ఒక మనిషి శవం ఉందట.

ఆ శవం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందటిది. ఈ విషయం తెలిసి శాస్త్రవేత్తలు విగ్రహం లో శవం ఉండడం ఏంటి అని షాక్ అయ్యారు. తర్వాత పరిశీలన చేస్తే ఆ మనిషి శవం దాదాపు 11వ శతాబ్దం లేదా 12వ శతాబ్దానికి చెందినది అని తెలిసింది.

మమ్మీ సినిమా లో ఉన్నట్టు శవానికి మొత్తం వస్త్రం చుట్టేసి ఉందట. ఆ వస్త్రం మీద చైనీస్ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయట. దాంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలించి ఆ శవం లిక్వాన్ అనే అతనిది అని గుర్తించారు. లిక్వాన్ చైనా మెడిటేషన్ స్కూల్ కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి. ఆ విగ్రహం ఇంకా పరిశీలన లోనే ఉంది.







అఘోరాల జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు మనం సినిమాల్లో కూడా పురుష అఘోరాలను మాత్రమే చూశాము. కానీ ఉత్తర భారతదేశంలో మహిళా అఘోరాలు కూడా ఉంటారు. పురుష అఘోరాల లాగే స్త్రీలు కూడా స్మశానంలో నిద్రించడంతోపాటు శవాలను భక్షిస్తూ ఉంటారు.

కానీ ఈ విషయం ఎంతవరకు నిజమో ఎవరు ప్రూవ్ చేసి బయట పెట్టింది లేదు. విదేశాలకు చెందిన మహిళలు కూడా నాగసాద్వి లుగా మారేందుకు కాశీ,వారణాసి వస్తుంటారు.

అయితే ఇందులో అనేక పూర్వ సంప్రదాయాలున్నాయి. ఆ సంప్రదాయాల వెనుక అసలు విషయం ఏంటో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఇందులో ఒకటి కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారి ఇంట్లోకి అడుగుపెట్టే కొత్త కోడలు బియ్యంతో నిండిన కలశాన్ని తన్నుకుంటూ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే కొంతమంది ఎర్రని నీటిలో రెండు చేతులను ఉంచి గోడకు అద్దడం చేస్తూ ఉంటారు. మరి ఇలా ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఓసారి చూద్దాం..!!
#2ఎర్రని నీటిలో పాదాలు పెట్టడం
#3 అప్పగింతల సమయంలో
#4 ఓడి బియ్యం
#5గుమ్మానికి బొట్టు పెట్టడం


ముఖ్యంగా గుమ్మానికి గుమ్మడికాయను కట్టేది నరదృష్టి, నరఘోష మన ఇంటి పై పడకుండా ఉండటం కోసం ఈ బూడిద గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి కడతారు. ఇందులో ముఖ్యంగా బూడిదగుమ్మడి కాయలు మాత్రమే గుమ్మానికి కట్టాలి. మరోరకం గుమ్మడికాయను మాత్రం శుభ కార్యక్రమాల్లో పగలకొడతారు. అలాగే దాన్ని సాంబార్ లో కూడా ఉపయోగిస్తారు.
ఆ విధంగా మెయిన్ గుమ్మాలకు కట్టాలి. ఇలా ముందు కట్టడంవల్ల మన ఇంట్లోకి వచ్చే వారి చూపు ముందు గుమ్మడికాయ మీద పడుతుంది. దీనివల్ల వారి చెడు దృష్టి అనేది ఆ కాయ లాక్కుంటుంది. ఇందులో కొంత మంది కట్టిన వారం, పది రోజులకే గుమ్మడికాయ పాడవుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే నరదృష్టి ఎక్కువగా ఉంటే మాత్రమే గుమ్మడికాయ త్వరగా పాడవుతుంది. అలా గుమ్మడికాయ పాడైన వెంటనే దాన్ని తీసివేసి కొత్తది కట్టేయాలి.







