ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించి, ప్రజలకి సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తనకి 2019 లో వచ్చిన ఒక లెటర్ ని షేర్ చేసుకున్నారు.
ఈ లెటర్ లో ఈ విధంగా రాసి ఉంది. “పవనన్నా, అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. అందరికి ఒకటే చెప్తున్నాం. మేము అవినీతి డబ్బుతో ఓట్లు కొనలేదు, మందు పొయ్యలేదు. గుండాయిజం చెయ్యలేదు అని. నువ్వు చేసిన దిశానిర్ధేశంతో నువ్వు నిలబెట్టిన అభ్యర్థులని ప్రచారం చేసాం.”

“నువ్వు పెట్టిన పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాం.. వారి డబ్బు, మందు, దాదాగిరీ మీద మనం ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇది ఇలా కొనసాగనివ్వమని మాకు తెలుసు. మా మొదటి అడుగు పడింది. ఇంకో 5 సంవత్సరాలలో ఇది 100 అడుగులకి చేరుస్తానున్న ఆత్మవిశ్వాసం మాకు ఉంది. కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందం. మన పార్టీని ఇంకా బలపరుస్తాం… ఈ ఓటమి కసిని నరనరాల్లో జీర్ణించుకుని 2024 కి ఎగిసే కెరటమల్లే సిద్ధమవుతాం.. కోల్పోయిన దానిని తెచ్చుకునే వరకు విశ్రమించం.”

“గెలుపోటముల్లో నీవెంటే ఉన్నాం. ఉంటాం కూడా… నిజాయితీని చూసి అవినీతి ఎంతో కాలం నవ్వదు. నువ్వు ఓడిపోయావ్ అన్న భాదకన్నా నిన్ను గెలిపించుకోలేక పోయాం అని ఆవేదనని దిగమింగుకుని మన పార్టీకి కావల్సినవి likelu, sharelu కాదని తెలుసుకున్నాం.. వదిలేది లేదు అన్నా… మమ్మల్ని నడిపించు.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్పించు.. మా జీవితంలో ఏం మారినా సరే, మేము పట్టుకున్న జెండా ఎప్పటికీ మారదు. కట్టెకాలే వరకు నీ తోనే ఉంటాం. రెట్టించిన విశ్వాసంతో.. నీ జనసైనికులు” అని ఆ లెటర్ లో రాశారు.

ఈ లెటర్ ని షేర్ చేసిన పవన్ కళ్యాణ్ దాని గురించి చెబుతూ, “ఇది 2019 లో నేను ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత రాసిన ఉత్తరం. ఇలాంటి జన సైనికుల మద్దతు వల్లే నేను కఠినమైన పరిస్థితుల్లో కూడా ముందుకి నడుస్తున్నాను. మీరందరూ ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. ఈ లెటర్ రాసిన వ్యక్తి ఇక్కడితో ఆగలేదు. యూఎస్ నుండి వచ్చి, స్థానిక ఎన్నికల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆచంట నియోజకవర్గం రామన్నపాలెంలో ఎంపీటీసీ స్థానంలో గెలిచి 144 ఓట్ల మెజారిటీతో గెలుపొంది విజయం సాధించాడు. మనమందరం భౌతికంగా ఒకళ్ళ నుండి ఒకళ్ళం దూరం ఉన్నా కూడా మన హృదయాలు అన్ని ఒకటే న్యాయం కోసం కొట్టుకుంటాయి” అని పవన్ కళ్యాణ్ రాశారు.


వై ఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు రాజా రెడ్డి వివాహం ప్రియా అల్లూరితో ఫిబ్రవరి 17న జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లికి ఆహ్వానిస్తూ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
అంతేకాకుండా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలకు స్వయంగా ఆహ్వాన పత్రికలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్ధం హైదరాబాద్ లో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలుస్తోంది. వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా షర్మిల ఆహ్వానించారు. అయితే ఈ నిశ్చితార్ధంకు నారా లోకేష్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఈ ఆహ్వానంను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల కోరిన విషయం తెలిసిందే. దాంతో ఈ వేడుక పై అందరి దృష్టి పడింది. ఎవరెవరు హాజరు అవుతారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.










వైఎస్ఆర్ బయోపిక్ గా వచ్చిన యాత్ర మూవీలో వైఎస్ఆర్ గా మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ మూవీ 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వై.ఎస్.జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2ను సైతం ఈ ఏడాది అదే డేట్ కి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. యాత్ర2 లో కూడా మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో వైఎస్ జగన్ పాలిటిక్స్ లోకి రావటానికి కారణాన్ని ఎమోషనల్ చూపించారు. జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ డైరీ వంటివి చూపించారు. అయితే టీజర్ లో అందరినీ ఆకట్టుకుంది వైఎస్ఆర్ డైరీ. సగం కాలిన ఆ డైరీలోని ఓ పేజీలో ‘ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి.. కేంద్ర నిధులు రావాలి’ అని ఉంది. అలా తన డైరీలో ఆరోగ్య శ్రీ బీమా గురించి రాసుకోవడం చిన్న విషయం కాదు.
ప్రజల గురించి ఎంత ఆలోచించి ఉంటే తప్ప వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీలో రాసుకోరు. జీవిత ధ్యేయం అయితే కానీ ఎవరు డైరీలో అలా రాసుకోరు అని అంటున్నారు. టీజర్ లో డైరీ కొంచెం కాలిపోయినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఎవరైనా కాల్చరా? లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాలినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ టైమ్ లో ఈ డైరీ దొరికిందా? అనేది మూవీ రిలీజ్ అయితే కానీ తెలీదు.