ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్లో రాజారెడ్డి నిశ్చితార్ధం వేడుక జరుగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.
బుధవారం నాడు షర్మిల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన నివాసంలో కలిసి, కుమారుడు వివాహానికి ఆహ్వానిస్తూ పెళ్లి పత్రిక అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రత్యర్థులను షర్మిల ఎందుకు ఆహ్వానించారు. దాని వెనుక కారణం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు న్యూస్18 కథనం ప్రకారం, కొన్ని రోజుల క్రితం వరకు తెలంగాణ ఎలక్షన్స్ లో అధికార పార్టీ పై పోటీకి సిద్ధం అయిన వైఎస్ షర్మిల, హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని తన పార్టీని హస్తంలో విలీనం చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిని పొందారు. జగన్ వద్దనుకున్న పార్టీలో జాయిన్ అవడం, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అవడం, జగన్ ప్రత్యర్ధులను స్వయంగా కలిసి కుమారుడి పెళ్లికి ఆహ్వానించడం చూసిన వారంతా అన్న జగన్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని అంటున్నారు.
షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల పెళ్లి ఫిబ్రవరి 17న జరగనుంది. ఈ క్రమంలో షర్మిల పాలిటిక్స్ కు అతీతంగా పలువురు రాజకీయ నేతలను కలిసి నిశ్చితార్ధంతో పాటు వివాహం, రిసెప్షన్కి కూడా ఆహ్వానిస్తున్నారు. ముందుగా అన్న జగన్ను కలిసి పెళ్లికి ఆహ్వానించింది. అన్న జగన్ కు ప్రత్యర్థులు అయిన టిడిపి అధినేత చంద్రబాబును షర్మిల కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పడం.
జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం చూస్తుంటే అన్న జగన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం చంద్రబాబుతో భేటీని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.
Also Read: వైఎస్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్, పెళ్లి పత్రికలు చూసారా..? ఇందులో ఏం రాసారంటే..?






వై ఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు రాజా రెడ్డి వివాహం ప్రియా అల్లూరితో ఫిబ్రవరి 17న జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లికి ఆహ్వానిస్తూ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
అంతేకాకుండా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలకు స్వయంగా ఆహ్వాన పత్రికలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్ధం హైదరాబాద్ లో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలుస్తోంది. వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా షర్మిల ఆహ్వానించారు. అయితే ఈ నిశ్చితార్ధంకు నారా లోకేష్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఈ ఆహ్వానంను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల కోరిన విషయం తెలిసిందే. దాంతో ఈ వేడుక పై అందరి దృష్టి పడింది. ఎవరెవరు హాజరు అవుతారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.









