ఎన్నికలలో కుటుంబాలు కూడా పాల్గొంటూ ఉంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ఎంతో మంది ఎన్నికల్లో పాల్గొంటారు. కానీ ఒకే ఒక ప్రత్యర్థిపై ఒక కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిపై మైనంపల్లి కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల నుండి పోటీ చేస్తూ ఉన్నారు.

మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 లో అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెపై ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పిలుపుతో రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి 2008 లో రామాయంపేట ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు ఆమె మీద ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి మైనంపల్లి హనుమంతరావు బరిలో నిలిచి గెలిచారు.

2009 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పొత్తులో భాగంగా మెదక్ టికెట్ ని మైనంపల్లి హనుమంతరావుకి కేటాయించారు. దాంతో పద్మాదేవేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి హనుమంతరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2014, 2018 లో పద్మాదేవేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యక్తిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అయితే ఇప్పుడు మూడోసారి కూడా బీఆర్ఎస్ హై కమాండ్ పద్మాదేవేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి పద్మాదేవేందర్ రెడ్డి పై మైనంపల్లి వారి కుమారుడు రోహిత్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈసారి రోహిత్ రావు పద్మాదేవేందర్ రెడ్డి మీద గెలిచారు. దాంతో 19 ఏళ్లుగా జరుగుతున్న వైరంలో ఈసారి వారసుడు గెలిచారు అని అన్నారు.
ALSO READ : “రేవంత్ రెడ్డి” 15 రేర్ ఫొటోస్ ఓ లుక్ వేయండి…సినీ ప్రముఖులతో, జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు.!


#2 రేవంత్ రెడ్డి భార్యతో దిగిన ఫోటో.
#3 రేవంత్ రెడ్డి కుటుంబంతో దిగిన ఫోటో.
#4 మంత్రి కేటీఆర్ తో రేవంత్ రెడ్డి.
#5 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలతో.
#6 భార్య పిల్లలతో రేవంత్ రెడ్డి.
#7 నందమూరి బాలకృష్ణ తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో.
#8 రేవంత్ రెడ్డి కూతురి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు. ఆ పెళ్ళికి చిరంజీవి వచ్చి ఆశీర్వదించినప్పుడు రేవంత్ రెడ్డి తో కలిపి తీయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
#9 ఒక రాజకీయ వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సంభాషిస్తున్న రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
#10 ఒక అవార్డు ఫంక్షన్లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని తెలిసిన వెంటనే దిల్ రాజు రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.
#11 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో బాలకృష్ణతోను, జూనియర్ ఎన్టీఆర్ తోను మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేశారు రేవంత్ రెడ్డి. 2009లో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
#12 నటుడు నందమూరి బాలకృష్ణతో రేవంత్ రెడ్డి.
#13 నిర్మాత బండ్ల గణేష్ తనని కలిసినప్పుడు తీయించుకున్న ఫోటో.
#14 నటి సురేఖ వాణి, సురేఖ వాణి కూతురు సుప్రీతతో రేవంత్ రెడ్డి.















