రోజా మీద ఇటీవల బండారు సత్యనారాయణమూర్తి కామెంట్స్ చేయడం, దానిపై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించడం తెలిసిందే. కొంత మంది హీరోయిన్లు రోజాని ఇలాంటి మాటలు అనడం సరికాదు అని అన్నారు.
ఈ విషయం మీద బండారు సత్యనారాయణ క్షమాపణ కూడా చెప్పాలి అని అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు, వాడిన పదాలు సరిగ్గా లేవు అని, ఒక మహిళను అవమానపరిచేలా ఉన్నాయి అని అన్నారు.

అయితే, మరొక పక్క మరి కొంత మంది రాజకీయ ప్రముఖులు, “రోజా అంతకుముందు పవన్ కళ్యాణ్ భార్యని కూడా అనరాని మాటలు అన్నారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు లాంటి వారిని కూడా ఏవేవో మాటలు అన్నారు. అప్పుడు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మీకు ఒక మహిళని అవమానించడం తప్పు అనే విషయం ఎందుకు గుర్తు రాలేదు?” అంటూ ఈ విషయం మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక విషయం మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి.

అదేంటంటే కొంతకాలం క్రితం రజనీకాంత్ ని కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆయనని ట్రోల్ చేశారు. “అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సినీ కుటుంబంలోని ఒకరినే కదా అలాంటి మాటలు అన్నది? మరి అప్పుడు వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు అప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. “అప్పుడు కూడా రోజా కొన్ని మాటలు మాట్లాడారు. కానీ ఆ సమయంలో ఇలాంటి మాటలు తప్పు అని ఎవరు వచ్చి మాట్లాడలేదు. మరి వాళ్ళ విషయంలో జరిగితే మాత్రం తప్పు కాదు.”

“రోజా విషయంలో మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పు అవుతుందా? అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు?” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంక రజనీకాంత్ విషయానికి వస్తే, ఇటీవల జైలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజనీకాంత్, ఇప్పుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పనిలో బిజీగా ఉన్నారు.

ఇందులో రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తారు అని సమాచారం. ఈ దర్శకుడు అంతకుముందు జై భీమ్ సినిమా రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగానే రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ తో పాటు, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కూడా నటిస్తున్నారు.
ALSO READ : ఎలక్షన్ 2023 : ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి..? ఎలాంటి పనులు చేయకూడదు..?


ఏం చేయవచ్చు..
ఏం చేయకూడదు..















మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సోమవారం (ఆగస్టు 7) నాడు రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయం పై చర్చ జరుగగా, మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేసారు. ఓటింగ్ ముందు సీరియస్ గా జరిగిన చర్చలో 90 ఏళ్ల వయసులోనూ పాల్గొన్నారు. ఆయన మౌనంగా రాజ్యసభలో జరిగిన చర్చను నిశితంగా గమనించి, ఆ తరువాత ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన అనారోగ్యాన్ని పట్టించుకోకుండా, తన బాధ్యతను నెరవేర్చడం కోసం వచ్చిన మన్మోహన్ సింగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు పార్లమెంట్ కు రాకుండా ఉంటారని, కానీ 90 సంవత్సరాల వయసులో ఉన్న మన్మోహన్ సింగ్ ను చూసి వారు నేర్చుకోవాలని నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. సెప్టెంబర్ లో మన్మోహన్ సింగ్ 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఆ బిల్లును ఆమోదముద్ర కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు. ఈ బిల్లుతో దేశరాజధాని డిల్లీలోని పరిపాలన యంత్రాంగం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక పై కేజ్రీవాల్ ప్రభుత్వ నియంత్రణ ఢిల్లీ ఉద్యోగుల పై నామమాత్రంగా ఉంటుంది.





