భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అందరికి సుపరిచితుడే. మెషిన్ లా మైదానం లో పరుగులు చేయడం లో కోహ్లీ ముందుంటాడు. అయితే.. కోహ్లీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణం గా ఇంటికే పరిమితం అయ్యాడు. ఇటీవల ఓ ఫోటో ను కోహ్లీ సోషల్ మీడియా లో పంచుకున్నారు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో పాటు స్పెక్ట్స్ పెట్టుకుని చాలా డిఫరెంట్ గా కోహ్లీ కనిపించారు.. ఈ లుక్ తో ఉన్న ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
నెటిజన్లు కూడా చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఈ లుక్ చాలా బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. కొందరైతే.. మనీ హీస్ట్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో కనిపించిన ప్రొఫెసర్ లాగా కనిపిస్తున్నారంటూ కితాబిచ్చేశారు. మరి కొందరు అభిమానులేమో ఐసీసీ 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం విరాట్ ఈ లుక్ లో కనిపిస్తున్నారంటూ కామెంట్ లు చేసారు. మొత్తానికీ.. ఈ ఫోటో తో విరాట్ రచ్చ చేస్తున్నారు.