ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ వచ్చేసింది. ఐపీఎల్ 15 సీజన్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుచేసి టైటిల్ ని కైవసం చేసుకుంది. లీగ్ ఆరంభం నుంచి అదరగొడుతున్న గుజరాత్ ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు ఆల్ రౌండ్ షోతో చెలరేగింది. లీగ్ లో అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫైయర్ 1 ను దాటి నేరుగా ఫైనల్ కు చేరుకొని తుది పోరులో సైతం తన హవా చాటుకుంది.
ఆరంభం నుంచి ఉన్న జట్లే ఒక్క ట్రోఫీ కోసం తహతహలాడుతుంటే.. లీగ్ లోకి వచ్చి రావడంతోనే పాండ్యా సేన ట్రోఫీ ఎగరేసుకొని పోయింది. లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే రాజస్థాన్ తర్వాత టైటిల్ గెలుచుకున్న జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డు సృష్టించింది.అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ విజయం సాధించి చాంపియన్ గా అవతరించింది. ముందుగా రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 130/9 స్వల్ప స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ బౌలర్లు రాజస్థాన్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు.
బట్లర్ (39) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు.ఇక లక్ష్యాన్ని గుజరాత్ సునాయాసంగా ఛేదించింది. గిల్ (45 నాటౌట్), హార్దిక్ పాండ్యా (34),డేవిడ్ మిల్లర్ (32 నాటౌట్ )రాణించడంతో గుజరాత్ విజయం సాధించింది.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17














పాటిదర్ సెంచరీతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించగా.. లక్ష్యఛేదనలో లక్నో టీం 193/6 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ను గెలిపించి ఇన్నింగ్స్ ఆడిన రజత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిజానికి ఐపీఎల్ 2022 వేలంలో బెంగళూరు జట్టు రజత్ ను కొనుగోలు చేయలేదు. గత ఏడాది ఆర్సిబి తరఫున ఆడిన మిడిలార్డర్ బ్యాటరును రిటర్న్ కూడా చేసుకోలేదు. ఐపీఎల్ 2022 సీజన్లో 20 లక్షల కనీస ధర తో రజత్ పాటిదర్ రాగ బెంగళూరు కనీస బిడ్ కూడా వేయలేదు..
దీంతో ఏ ప్రాంచైజీ అతని పై ఆసక్తి చూపకపోవడంతో, ఆయన అన్ ఫోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయారు. ఐపీఎల్ 2021 లో నాలుగు మ్యాచులు ఆడిన పాటిదర్ 71 పరుగులు చేశారు. దీంతో ఆర్సిబి అతన్నీ వద్దనుకుంది. కానీ ఈ సీజన్ ప్రారంభంలోనే వికెట్ కీపర్ మరియు బ్యాటరు లూవింగ్ సిసోడియా గాయం వల్ల బెంగళూరు జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన రజత్ తన కెరీర్లో 31 t20 మ్యాచ్ లు ఆడి 138.64 స్ట్రైక్ రేట్ తో 861 పరుగులు చేసి ఉన్నాడు.
దీంతో అతన్ని జట్టులోకి తీసుకున్న వెంటనే తుది జట్టులో అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్ లను రెండు చేతులా రజత్ ఉపయోగించుకున్నారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన పాటిదర్ 156.25 స్ట్రైక్ రేట్ తో 275 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయితే లక్నో మ్యాచ్ జరిగిన తరువాత వేలంలో అతని తీసుకోకపోవడంపై స్పందించేందుకు అతడు నిరాకరించాడు. అది నా పరిధిలో ఉండని అంశమని చెప్పుకొచ్చారు.
కానీ 19వ ఓవర్ లో దినేష్ చేసినటువంటి చిన్న తప్పిదం కారణంతో స్ట్రైకింగ్ కి వెళ్లిన రాహుల్.. ఆ తర్వాత బాల్ కే అవుటయ్యారు.. దీంతో బెంగళూరు జట్టు గెలుపు ఖాయమైంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో ఉన్నప్పుడు హేజిల్ వుడ్ బంతిని స్లో డెలివరీ చేశాడు. దీన్నీ గమనించ లేకపోయినా ఎవిన్ లావిస్ బ్యాట్ అడ్డంగా ఊపాడు. అయితే అతని బ్యాట్ కు దొరకని బాల్ దినేష్ కార్తీక్ ముందు పడింది.
దీంతో సింగిల్ కు కేఎల్ రాహుల్ పరిగెత్త గా.. ఊహించలేని దినేష్ కార్తీక్ ఒక గ్లోవ్స్ తీసేసి చాలా వేగంగా బంతిని బౌలర్ కి విసిరాడు.. కానీ హెజిల్ ఆ బాల్ ను అందుకని నాన్ స్ట్రైక్ రనౌట్ చేయలేకపోయాడు. మ్యాచ్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ కీపర్ ఒక గ్లోవ్ తీసేసి.. రనౌట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.. దీంతో బ్యాటరులు బైస్ కొరకు పరిగెత్తే సాహసం అయితే చేయరు. కానీ ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ఏమరా పాటుతో వ్యవహరించారు. కానీ రాహుల్ చాన్స్ తీసుకున్నాడు. ఇదే బెంగళూరుకు కలిసొచ్చింది.
ఆ సింగిల్ తో స్ట్రైక్ కి వచ్చిన రాహుల్.. హేజిల్ వుడ్ విసిరిన లో యార్కర్ బాల్ ను స్కూఫ్ చేయబోయి షాబాజ్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన బంతిలో పాండ్య గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ రనౌట్ నుంచి తప్పించుకొని చివరిదాకా లావిష్ క్రీజులో ఉన్న ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఒకవేళ కె.ఎల్.రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని అంటున్నారు క్రికెట్ అభిమానులు.





























ఈ సందర్భంలో మ్యాచ్ రద్దు అయితే మాత్రం ఎక్కువ విజయాలు అందుకున్న లక్నో సూపర్ జెంట్స్ రెండవ క్వాలిఫైయర్ కు అర్హత పొందుతుంది. కానీ అంత ఈజీగా లక్నోకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కోల్కత్తాలో ముందుగానే వర్షాలను అంచనా వేసిన బీసీసీఐ, ప్లే ఆప్స్ మ్యాచ్లకు వర్షం అంతరాయం ఏర్పడినా రిజల్ట్ రాబట్టేందుకు కొన్ని మార్గదర్శకాలు ముందుగానే పెట్టింది.
అవేంటంటే మ్యాచ్ ప్రారంభ సమయానికి రెండు గంటలు లేట్ అయితే పూర్తి ఓవర్లు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ 9:40 ప్రారంభమైన రెండు జట్లు 20 ఓవర్లు ఆడాల్సిందే. ఆ తర్వాత ఆలస్యమైతే కొద్ది ఓవర్లను తగ్గిస్తూ వస్తారు. ఒకవేళ రాత్రి 11 గంటల 56 నిమిషాల కు ఆట ప్రారంభమైన ఐదు ఓవర్ల పాటు మ్యాచ్ సాగుతుంది.
ఈ ఓవర్లలో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే వారిదే విజయం. ఒకవేళ అప్పటికి కూడా వర్షం తగ్గకపోతే రాత్రి 12:50 నిమిషాల వరకు వేచి చూస్తారు. ఈ సమయానికి ప్రారంభమైన సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 కి వెళ్తుంది. ఒకవేళ వర్షం ఆగకుండా కురిస్తే మాత్రం ఆట కొనసాగించే అవకాశం లేకపోతే కేఎల్ రాహుల్ టీం, లీగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కారణంగా రాజస్థాన్ తో రెండో మ్యాచ్ ఆడటానికి అహ్మదాబాద్ వెళుతుంది. అయితే గత రెండు సీజన్లలో కూడా ప్లే ఆప్స్ చేరిన ఆర్సిబి, నాలుగో స్థానంలో నే ముగించింది.
















ఇక అందరూ రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఐపీఎల్ 2022 సీజన్ లో ఆర్సిబి టీం లోకి వచ్చిన అతను అనూహ్య పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడు. లోయరార్డర్ లో అద్భుత బ్యాటింగ్ తో సంచలన విజయాలు అందించాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడితే 57.40 సగటుతో 287 పరుగులు చేసి 191.33 స్ట్రైక్ రేట్ సంపాదించాడు.
ఈ పర్ఫామెన్స్ ని చూస్తే ఈ సీజన్ లో దినేష్ కార్తీక్ ఏ విధంగా ఆడారో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో టీమిండియా సెలెక్టర్లు చూపు ఆయనపై పడింది. ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ” నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీ వెంట వస్తాయి ” అని అన్నారు. నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తను ఇంకా కష్టపడతాను అని అన్నారు. రాయల్ చాలెంజ్ బెంగళూరు చక్కని ఆటతో ముంబై సహకారంతో ప్లే అప్స్ బెర్తు దక్కించుకుంది. ఇక ఈ రోజు లక్నో తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.

















