“అయితే RCB తో ఫైనల్స్ ఆడేది GT నా.? ” అంటూ క్వాలిఫైయర్ మ్యాచ్ పై 17 ట్రోల్స్.!

“అయితే RCB తో ఫైనల్స్ ఆడేది GT నా.? ” అంటూ క్వాలిఫైయర్ మ్యాచ్ పై 17 ట్రోల్స్.!

by Sunku Sravan

ఐపీఎల్ లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ప్లే అప్స్ లో దుమ్ము రేపింది. క్వాలిఫైయర్ 1లో రాజస్థాన్ ను చిత్తుగా ఓడించింది. రాయల్స్ జట్టు చాలా పెద్ద టార్గెట్ నిర్దేశించిన సమిష్టిగా ఆడిన గుజరాత్ జట్టు చివరికి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.

Video Advertisement

లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే గుజరాత్ జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లి హౌరా అనిపిస్తోంది. ఇక క్వాలిఫయర్ 1 లో ఓడిపోయిన రాజస్థాన్ ఫైనల్ చేరేందుకు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంది.

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది గుజరాత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 188/6 స్కోర్ చేసింది. బట్లర్ (89) చెలరేగగా సాంసను (47) దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ గుజరాత్ ముందు టాప్ టార్గెట్ పెట్టింది. అయితే చేజింగ్ లో గుజరాత్ మాత్రం అదరగొట్టింది.

గిల్ (35), వేడ్ (35) జట్టును గాడిలో పెట్టగా.. హార్థిక్ పాండ్యా (40 నాటౌట్ ) డేవిడ్ మిల్లర్(68) చెలరేగడంతో మ్యాచ్ గుజరాత్ కైవసం అయింది. బౌలింగులో తేలిపోయిన రాజస్థాన్ ఫైనల్ కు చేరుకునేందుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచినా జట్టుతో రాజస్థాన్ క్వాలిఫైయర్ -2 ఆడనుంది. 189 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ సమిష్టి విజయాన్ని అందుకుంది.

ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సహా (0), వికెట్లు తీసి గట్టి షాక్ ఇచ్చారు. తర్వాత మరో ఓపెనర్ శుభమాన్ గిల్ (35), మాథ్యూ వేడు (35) రాజస్థాన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగి బౌండరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ ఒకటయ్యారు. ఆఖరి ఓవర్ లో మిల్లర్ దూసుకుపోవడంతో విజయం ఖాయమైంది.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

 

 

 


You may also like