డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడిపుడే ‘లైగర్’ సినిమా అపజయం నుండి బయటపడుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే తరువాతి ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాడు. అయితే పూరీ జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్టోరీని రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్టోరీని మెగాస్టార్ కి చెప్పగా, చిరంజీవి ఒకే చేశాడని సమాచారం.
హీరో క్యారెక్టరైజేషన్ పై స్టోరీ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం పూరీ జగన్నాథ్. ఎందుకంటే ఆయన మూవీస్ లోని హీరోలు రాముడు మంచి బాలుడు అనేలా ఉండవు. పూరీ అల్లర చిల్లరగా తిరుగే హీరోలకు సమాజం పట్ల కొంచెం ప్రేమ, బాధ్యత ఉన్నట్టుగా చూపిస్తాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ తన మూవీస్ ద్వారా చాలా యాక్టర్స్ కి స్టార్డమ్ ని అందించాడు. కెరీర్ మొదట్లో ప్రేమ కథలు చేసిన పూరీ జగన్నాథ్, ఆ తర్వాత గ్యాంగ్స్టర్, మాఫియా కథలతో స్టార్ హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు
కానీ పూరీ జగన్నాథ్ కి తన కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. అప్పట్లో ఒకసారి ‘ఆటో జానీ’ అంటూ వార్తలు వచ్చినా, ఆ తరువాత అది అక్కడే ఆగిపోయింది. మెగాస్టార్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు కూడా అవకాశాలిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా పూరీ చెప్పిన కథ నచ్చి సినిమా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవడంతో, పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పూరీకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో పూరీ కెరీర్లో కోలుకోవడం చాలా కష్టం అనే మాటలు ఎక్కువ వినిపించాయి. అయితే, పూరీ జగన్నాథ్ కి ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మామూలే. తన స్కిల్నే నమ్ముకుని పూరీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు.

ఈ సమయంలోనే పూరీ జగన్నాథ్ చెప్పిన కథకు మెగాస్టార్ ఇంప్రెస్ అయ్యి, స్క్రిప్ట్ ను పూర్తిగా డెవలప్ చేయమని చెప్పాడని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.కొంతమంది బాలకృష్ణ తీసిన పైసా వసూల్ సినిమా అసలు చిరంజీవితో చేయాల్సిన సినిమా అని అంటున్నారు. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు పూరి చిరంజీవి కోసం ఒక కొత్త కథ రాసుకున్నారు. ఆ కథ కూడా ఇటీవల పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో పోలిక లేకుండా ఉంటుంది అని అంటున్నారు.

ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇందులో చిరంజీవి డాన్ రోల్ లో కనిపిస్తారా? లేక అందుకు వ్యతిరేకంగా వారు చేసే పనులని ఆపే వ్యక్తి లాగా కనిపిస్తారా అనేది మాత్రం ఇంకా తెలియదు. ఒక వేళ చిరంజీవి డాన్ రోల్ లో కనిపిస్తే సినిమా మామూలుగా ఉండదు అని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే వీరి సినిమా గురించి ఈ వార్త మాత్రం ప్రచారం అవుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించే అంతవరకు ఆగాల్సిందే.

ఎందుకంటే ‘ఆచార్య’లో చిరంజీవి హీరోగా నటించగా, రామ్ చరణ్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ‘లూసిఫర్’ రీమేక్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించాడు. గాడ్ ఫాదర్ కి పాజిటివ్ టాక్ వచ్చి, వసూళ్లు కూడా బాగానే ఉన్నా, ఫలితం మాత్రం హిట్ అయితే కాలేదు. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాలూ నిరాశపరిచాయి.దీంతో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అయిన రవితేజ సినిమాల్లోకి రావడానికి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవే కారణం అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. రవితేజ ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలో మెగాస్టార్ తమ్ముడిగా నటించాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో రవితేజ కనిపిస్తాడని తెలుస్తోంది.
ఈ హీరోలు తమ సినిమాలని ఇతర భాషల్లో విడుదల చేసినా కూడా వాటి ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ప్రాధాన్యత అంతగా ఇవ్వడం లేదు. ఎందుకనో గాని పాన్ ఇండియా మూవీస్ తో తమ దూకుడు పెంచుకోవాలని ఈ సీనియర్ స్టార్స్ అనుకోవడం లేదు. అయితే సీనియర్ హీరోలు చాలా విషయాలలో యంగ్ హీరోలతో పోటీపడుతున్నా పాన్ ఇండియా విషయంలో అసలు పోటీపడటం లేదు
ఇక సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నెలల వ్యవధిలోనే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్ మూవీతో అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల పలకరించనున్నారు. నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మూవీ షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ద్వారా వారం వారం ప్రేక్షకులకు పలకరిస్తున్నాడు.
చిరంజీవికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు తెలుసని మణిశర్మ చెప్పారు. ముందు ఇచ్చిన బీజీఎం వద్దని, దర్శకుడు కొరటాల శివ మీరు ఎలా అనుకుంటున్నారో అలా వద్దు. చాలా కొత్తగా ఉండాలని అన్నారని, దాంతో బీజీఎం కొరటాల శివ కోరిక మేరకు మార్చాల్సి వచ్చిందని మణిశర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మణిశర్మ అన్న మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు ఆచార్య సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు.
ఏ చిత్ర బృందం అయినా తాము తీసిన సినిమా హిట్ అవ్వాలనే తీస్తారని, అవికొన్నిసార్లు అవి హిట్ అవుతాయి. మరి కొన్నిసార్లు ప్లాప్ అవుతాయని, దానికి ఎవరిని విమర్శించడం కరెక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంతవరకు మణిశర్మ, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. చూడాలని ఉంది, ఇంద్ర, బావగారు బాగున్నారా, ఠాగూర్ ఇలా చేసిన సినిమాలన్ని మ్యూజికల్ హిట్స్. మృగరాజు, జై చిరంజీవ సినిమాలకు కూడా మణిశర్మ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. అదేంటో ఒక్క ‘ఆచార్య’ సినిమాకి ఆ సెంటిమెంట్ పని చేయలేదు.






















