ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ లా టి20 సిరీస్ ను ఇండియా 3-1 తో కైవసం చేసుకుంది. రాయపూర్ వేదికగా జరిగిన నాలుగో టి20 లో భారత్ 20 పరుగులు తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో అక్షర్ పటేల్ ,రవి బిష్ణోయ్ చెలరేగడంతో టీమిండియా విజయం ఖాయమైంది ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంలో జితేష్ శర్మ పాత్ర ఎంతో ఉంది.
ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న జితేష్ శర్మ 19 బంతుల్లోనే 35 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. జితేష్ శర్మ మెరుపులు మెరిపించడంతో భారత 174 పరుగుల భారీ స్కోరు చేసింది.

జితేష్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నాలుగు వికెట్ల పడి కష్టాల్లో ఉన్న సమయంలో జీతేష్ శర్మ క్రీజ్ లోకి వచ్చాడు. సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు అన్న టెన్షన్ ఏమాత్రం లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఇటీవలే ముగిసిన వండే ప్రపంచ కప్ ఫైనల్ లోను భారత్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. వెంట వెంటనే విక్కెట్లు పడడంతో ఒత్తిడిలోకి వెళ్ళింది. అయితే ఆ సమయంలో కేఎల్ రాహుల్ టెస్ట్ బ్యాటింగ్ చేశాడు. దాంతో టీమ్ ఇండియా చేయాల్సిన పరుగులు కంటే కూడా ఒక 50 పరుగులు తక్కువ చేసింది.
ఫలితంగా ఫైనల్లో ఓడి భారత్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అందులో ఛాంపియన్ గా నిలవాలంటే రాహుల్ లాంటి ప్లేయర్లు కాకుండా జితేష్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జితేష్ శర్మ లాంటి ప్లేయర్ కనుక మొన్న వరల్డ్ కప్ లో ఉండి ఉంటే భారత్ తీరు వేరేలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కుర్రాళ్లతో టి20 సిరీస్ నెగడం భారత్ కు కొంత ఊరట ఇచ్చే విషయమే. ఎందుకంటే కుర్రాలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎవరిలో ఎంత టాలెంట్ ఉందనే విషయం బయటపడుతుంది. దాని ద్వారా వన్డే టీం కూర్పు కూడా మేనేజ్మెంట్ కి ఈజీ అవుతుంది.
Also Read:ఇదెక్కడి ట్విస్ట్…నాలుగవ T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్.. అన్నీ కోట్ల బిల్ కట్టనందుకే?

న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా 306 పరుగులు చేసింది. కానీ ఈ మ్యాచ్లో సూర్యకుమార్ పెద్ద ఇన్నింగ్స్లు చేయలేదు.ఇక రెండవ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. మూడో వన్డేలో సూర్యకుమార్ నెమ్మదిగా మొదలు పెట్టి, కొన్ని షాట్లు ఆడినా అంతగా ఆడలేకపోయాడు. దాంతో టీ20లో బాగా ఆడిన సూర్యకుమార్ వన్డే మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదని మాజీ క్రికెటర్స్ పేర్కొంటున్నారు. ఈ కారణం వల్లనే సూర్యకుమార్ కి టెస్టు ఆడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు.
ఇక వసీం జాఫర్ ఏమన్నారంటే, టీ20 క్రికెట్లో ఫీల్డర్ను ఎప్పుడూ స్లిప్లో ఉంచరని, అందువల్ల ఫీల్డర్ క్యాచ్ అవుట్ కాలేదని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. వన్డేలలో మరియు టెస్ట్ క్రికెట్లో కొన్నిసార్లు ఒకటి, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు ఫీల్డర్లు స్లిప్లో ఉంచబడతారు. అప్పుడే చేసే చిన్న పొరపాటు కూడా ఔట్ అవ్వడానికి దారితీస్తుంది. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అలాగే మూడో వన్డేలో కూడా స్లిప్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాటల ప్రకారం సూర్యకుమార్ వన్డే ఫార్మాట్లలో రాణించాలంటే తన బ్యాటింగ్ ను ఇంకా మెరుగుపరచుకోవాలి.







