ఇలాంటి ప్లేయర్ ఏ కదా ఇండియాకి కావాల్సింది… రాహుల్ స్థానంలో వరల్డ్ కప్ లో ఉండాల్సింది…!

ఇలాంటి ప్లేయర్ ఏ కదా ఇండియాకి కావాల్సింది… రాహుల్ స్థానంలో వరల్డ్ కప్ లో ఉండాల్సింది…!

by Mounika Singaluri

Ads

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ లా టి20 సిరీస్ ను ఇండియా 3-1 తో కైవసం చేసుకుంది. రాయపూర్ వేదికగా జరిగిన నాలుగో టి20 లో భారత్ 20 పరుగులు తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో అక్షర్ పటేల్ ,రవి బిష్ణోయ్ చెలరేగడంతో టీమిండియా విజయం ఖాయమైంది ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంలో జితేష్ శర్మ పాత్ర ఎంతో ఉంది.

Video Advertisement

ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న జితేష్ శర్మ 19 బంతుల్లోనే 35 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. జితేష్ శర్మ మెరుపులు మెరిపించడంతో భారత 174 పరుగుల భారీ స్కోరు చేసింది.

జితేష్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నాలుగు వికెట్ల పడి కష్టాల్లో ఉన్న సమయంలో జీతేష్ శర్మ క్రీజ్ లోకి వచ్చాడు. సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు అన్న టెన్షన్ ఏమాత్రం లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఇటీవలే ముగిసిన వండే ప్రపంచ కప్ ఫైనల్ లోను భారత్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. వెంట వెంటనే విక్కెట్లు పడడంతో ఒత్తిడిలోకి వెళ్ళింది. అయితే ఆ సమయంలో కేఎల్ రాహుల్ టెస్ట్ బ్యాటింగ్ చేశాడు. దాంతో టీమ్ ఇండియా చేయాల్సిన పరుగులు కంటే కూడా ఒక 50 పరుగులు తక్కువ చేసింది.

ఫలితంగా ఫైనల్లో ఓడి భారత్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అందులో ఛాంపియన్ గా నిలవాలంటే రాహుల్ లాంటి ప్లేయర్లు కాకుండా జితేష్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జితేష్ శర్మ లాంటి ప్లేయర్ కనుక మొన్న వరల్డ్ కప్ లో ఉండి ఉంటే భారత్ తీరు వేరేలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కుర్రాళ్లతో టి20 సిరీస్ నెగడం భారత్ కు కొంత ఊరట ఇచ్చే విషయమే. ఎందుకంటే కుర్రాలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎవరిలో ఎంత టాలెంట్ ఉందనే విషయం బయటపడుతుంది. దాని ద్వారా వన్డే టీం కూర్పు కూడా మేనేజ్మెంట్ కి ఈజీ అవుతుంది.

Also Read:ఇదెక్కడి ట్విస్ట్…నాలుగవ T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్.. అన్నీ కోట్ల బిల్ కట్టనందుకే?


End of Article

You may also like