ఉప్పెన, కొండ పొలం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మూడవ సినిమా “ఆదికేశవ”. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.
టీజర్, ట్రైలర్స్, పాటలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆదికేశవ చూసిన నెటిజెన్లు, ఇక సీన్ ను ఆ హిట్ మూవీ నుండి కాపీ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ సీన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆదికేశవ. ఈ మూవీలో మలయాళ యాక్టర్ జోజు జార్జ్, రాధిక, తనికెళ్ళ భరణి, సుధాకర్, రచ్చ రవి వంటివారు కీలక పాత్రలలో నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ కాపీ సన్నివేశాలని గమనించారు. ఆ విషయాన్ని వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు మూవీలోని ఫ్లాష్ బ్యాక్ యాక్సిడెంట్ సీన్ ను ఆదికేశవ మూవీలో ఉపయోగించారు. దీంతో రెండు సినిమాలలో సీన్స్ నెట్టింట్లో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజెన్లు తమ దైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే దూకుడు సీన్ ను గల్లీ రౌడీ అనే మూవీలో కూడా ఉపయోగించారని మరో నెటిజెన్ కామెంట్ చేశారు.
Orey 😂😂pic.twitter.com/d382EhEAXU
— #GunturKaaram 🌶️ (@alluanjayya) December 23, 2023

ప్రభాస్ సలార్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. వీరిలో ‘కాటేరమ్మ కొడుకును పంపింది’ అంటూ డైలాగ్ చెప్పిన అమ్మాయి కూడా చాలా పాపులర్ అయింది. ఆ అమ్మాయి పేరు ఫర్జానా సయ్యద్. దాంతో పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది. ఫర్జానా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఫర్జానా ముస్లిం అమ్మాయి. అయితే సురభి క్యారెక్టర్ ను ఎలా చేశావని అడగగా, ఆమె మాట్లాడుతూ తన తండ్రి ముస్లిం, అని, తల్లి హిందూ అంటూ చెప్పుకొచ్చింది. తన ఇంట్లో పండగలన్ని చేసుకుంటామని చెప్పింది. నటన ముఖ్యమని, దానికి మతంతో సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ, మోడల్గా ఇప్పటికే పలు యాడ్స్ లో నటించానని, కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించానని తెలిపింది. ఆ క్రమంలోనే ‘సలార్’ లో ఛాన్స్ వచ్చిందని ఫర్జానా చెప్పింది.
సురభి క్యారెక్టర్ కోసం ఎంతో మంది ఆడిషన్స్కు వచ్చారని, అయితే తను ఎంపిక అవ్వడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు సలార్ మూవీలోని ‘ఫర్జానా’ లుక్ కు, నిజ జీవితంలోని లుక్ కు చాలా ఛేంజ్ ఉందని అంటున్నారు. రియల్ లైఫ్ లో ఆమె చాలా అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కథానాయకుడు కళ్యాణ్ రామ్ డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఈ ఏడాది ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 12 మిలియన్ వ్యూస్ను దాటి ట్రైలర్ దూసుకెళ్తోంది.












