కేఏ పాల్ తెలుగు రాష్ట్రంలో ఈ పేరు అందరికీ తెలిసిందే. అతను పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. 1963 సెప్టెంబర్ 25న విశాఖపట్నంలో జన్మించారు. పాల్ తల్లిదండ్రుల పేరు బర్నబాస్, సంతోషమ్మ. 19 సంవత్సరాల వయసులో క్రిస్టియన్ మినిస్ట్రీస్ లోకి అడుగుపెట్టారు.
క్రిస్టియనిటినీ ప్రచారం చేస్తూ ప్రపంచ దేశాలన్నీ తిరిగారు. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ , జోస్పెల్ టు ది అన్ రీచ్ద్ మిలియన్స్ సంస్థలను స్థాపించారు. ప్రముఖ వ్యక్తులతో జయపాల్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కప్పుడుకే చెప్పాలి ప్రసంగాలు సభలకు లక్షల్లో జనం విచ్చేసేవారు.

ఇప్పుడు కేఏ పాల్ తన వైభవాన్ని కోల్పోయారు. ఎంతో డబ్బుని చారిటీల పేరుతో ఖర్చు చేసిన కూడా ఇప్పుడు తనకి అంత ప్రాముఖ్యత లభించడం లేదు. ఇక కేఏ పాల్ కుటుంబ విషయానికి వస్తే ఆమె భార్య పేరు మేరీ కీలారి. వీరికి ముగ్గురు పిల్లల సంతానం. కేఏ పాల్ రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. 2019 ఎన్నికల సమయంలో తన భార్యను మీడియా ముందుకు తీసుకువచ్చి పరిచయం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి పార్టీని స్థాపించి 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. భీమవరం నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డ కేఏ పాల్ ఓటమి చెందారు. అయితే తన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ప్రతి నియోజకవర్గాన్ని అమెరికాల మారుస్తానంటూ హామీలు ఇచ్చారు. అయితే కేఏ పాల్ ప్రజాశాంతి అభ్యర్థులు ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. అయితే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కేఏ పాల్ పార్టీ పోటీ చేసింది.




నటి నిషా నూర్ తన గ్లామర్తో 1980లో సిల్వర్ స్క్రీన్ ను మరింత అందంగా మార్చింది. ఆమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాలలో నటిస్తూ దక్షణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, భాను చందర్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అగ్ర దర్శకులు అయిన బాలచందర్, భారతీరాజా విసు, చంద్రశేఖర్ లాంటి వారితో పని చేసింది. కమల్ హాసన్ తో కలిసి ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమాలో, రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, మోహన్లాల్తో పలు సినిమాలు చేసింది.
తన గ్లామర్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ 1995 అనంతరం నిషా నూర్ కు ఒక్క మూవీలో కూడా అవకాశం రాలేదు. అప్పటివరకు స్టార్ స్టేటస్ పొందిన నిషా నూర్ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సినిమాలని వదిలిపెట్టింది. అయితే సంపాదించిన డబ్బు మొత్తం కరిగిపోవడం మొదలైంది. బతకడం కోసం పని చేయాలి. కానీ ఆమె తప్పు దారిని ఎంచుకుని, వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది.
అయితే ఒక ప్రొడ్యూసర్ వల్లే ఆ వృత్తిలోకి వెళ్ళిందనే వార్త అప్పట్లో వచ్చాయి. ఆదుకునేవారు లేకపోవడం వల్ల నిషా నూర్ అందులోనే ఉండిపోయింది. ఆమెకు తలదాచుకునే స్థలం కూడా లేక ఒక సమయంలో ఒక దర్గా బయట నిద్రించింది. ఆమె పరిస్థితి తెలిసి, ఆదుకోవడానికి ఒక తమిళ ఎన్జీవో ముందుకు వచ్చి, నిషా నూర్ కు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ హాస్పటల్ లోనే నిషా నూర్ 2007లో అనాధలా మరణించింది.




మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కీలక పాత్రలో నటించాడు. అన్ని ప్రశ్నలకి జవాబు దొరికే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అని అడిగిన ప్రశ్నకి
‘మద్యపానంను మానిపించటం అనేది మూవీలో చూపించినంత సులభం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ గణాంకాలను ప్రత్యేకించి చూపించనవసరం లేదేమో. ప్రస్తుతం ఉన్న సొసైటీ ఆ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారేమో, భార్య పిల్లలను పట్టించుకోనివారు, ఎవరో వివాహం చేసుకోకుంటే మద్యం తాగడం మానేస్తాము అంటే అది జరగని విషయం, అందువల్ల మద్యం లేని సొసైటిని ఆశించడం పక్కన పెడదాం.
రుద్రవీణ మూవీలోని ముఖ్యమైన సమస్య అంటరానితనం. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ బిలహరి బాబాయ్ ఏమ్మా శోభన(లలిత)ను నువ్వు అంటరానిదానివి కదా అని ప్రశ్నిస్తే, కొంచెం బాధపడినా, ఏ అంటుకోవచ్చుగా అంటూ కొట్టినట్టుగా జవాబు చెప్తుంది. ఆ సన్నివేశం చిన్నతనంలో చూసి ఓహో ఇలానే ఉండాలని అనుకునేవాడిని, అలా చెప్తేనే ఊరుకుంటారని నమ్మేవాడిని.
అయితే ఆ మూవీ 80ల ఆఖరిలో వచ్చిన మూవీ కదా, ప్రస్తుతం అంటరానితనం ఏముంది అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ మూవీలో చేసినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే 30 సంవత్సరాల అనంతరం కూడా సమస్యే అని ఋజువైంది’ అని వెల్లడించారు.
మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అటు మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమా అని చెప్పవచ్చు. సీఎంగా మహేష్ బాబు అద్భుతంగా నటించారు. సీఎం ను ప్రేమించిన అమ్మాయిగా కియారా అద్వానీ, తండ్రిగా శరత్ కుమార్, విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఇలా మూవీలో దాదాపు అన్ని పాత్రలలో నటించిన వారికి పేరు వచ్చింది.
సీఎంను ప్రశ్నించే జర్నలిస్ట్ శుభోదయం సుబ్బారావు పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అతన్ని అందరు శుభోదయం సుబ్బారావుగానే గుర్తిస్తున్నారు. అంతకు ముందు పలు సినిమాలలో నటించినా, రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చింది. ఈ పాత్రలో నటించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. తెలుగు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించారు. రాజశేఖర్ 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తరువాత తెలుగులో గోవిందుడు అందరి వాడేలే, బాహుబలి: ది బిగినింగ్, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీచర్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్లు మరియు వెబ్సిరీస్లో నటించారు. ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ IT, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశాడు.