హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఆ తర్వాత తెలుగు సినిమాలు చేశారు హీరోయిన్ రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత యంగ్ హీరోస్ అందరితోనూ నటించారు. మొదటిలో రాశి ఖన్నా నటించిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు చేశారు. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని, ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మళ్లీ తొలిప్రేమ సినిమాలో నటించారు. అప్పుడు రాశి ఖన్నా నటించిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఒకవేళ సినిమా ఫలితం ఆశించిన విధంగా లేకపోయినా కూడా రాశి ఖన్నాకి ఆమె చేసిన పాత్రలు మంచి పేరు తీసుకొచ్చాయి.

రాశి ఖన్నా తెలుగులో చివరిగా 2022 లో వచ్చిన థాంక్యూ సినిమాలో నటించారు. మళ్లీ అప్పటి నుండి తెలుగులో నటించలేదు. హిందీలో కొన్ని సినిమాలు చేశారు. తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. కానీ తెలుగులో రాశి ఖన్నా సినిమా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ క్రమంలో రాశి ఖన్నాలో మార్పు అందరూ గమనించారు. రాశి ఖన్నా ఒక సమయం వరకు హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అనే సూత్రాన్ని పాటించకుండా కాస్త హెల్తీగా (బొద్దుగా) ఉండేవారు. కానీ తర్వాత బరువు తగ్గారు. ఇప్పుడు ఇంకా బరువు తగ్గినట్టు తెలుస్తోంది. చాలా సన్నగా అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయారు. కొన్ని ఫొటోస్ లో చూస్తే అసలు వేరే హీరోయిన్ ని చూసినట్టు అనిపిస్తోంది. అంతలా మారిపోయారు.

ఇటీవల తన బాలీవుడ్ సినిమా యోధ ప్రమోషన్స్ లో భాగంగా రాశి ఖన్నా మళ్ళీ ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ గా రెడీ అయ్యారు. కానీ చాలా మారిపోయినట్టు అనిపిస్తున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో రెండు హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా, ఒక తమిళ్ సినిమా ఉన్నాయి. నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న తెలుసు కదా సినిమాలో రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇది తప్ప వేరే తెలుగు సినిమాలు సైన్ చేయలేదు. ఎందుకు అంటే, ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు అని తెలుస్తోంది. మరి ఈ ఒక్క సినిమా కాకుండా నెక్స్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.




బాలకృష్ణ ఈ మూవీ షూటింగ్ విషయంలో సీనియర్ హీరోలైన కృష్ణ, కృష్ణంరాజులకు చెందిన పార్ట్ ను ముందుగా చేద్దామని చెప్పడంట. అయితే ఆ పార్ట్ షూటింగ్ అండమాన్ దీవుల్లో ప్లాన్ చేయడంతో కుటుంబాలతో ట్రిప్ లగా సరదాగా ఉంటుందని ముగ్గురు హీరోలు తమ ఫ్యామిలీలను తీసుకొని అండమాన్ కి వెళ్లారంట. అక్కడి లొకేషన్లు బాగున్నా, ఉండేందుకు రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ మాత్రమే ఉందంట. తప్పక అందులోనే అందరూ అడ్జస్ట్ అయ్యారంట. ఇక అక్కడ తినడానికి ఆహారం కూడా దొరికలేదంట. వెళ్లిన రోజు తమతో పాటు తీసుకెళ్లిన బిస్కేట్లు, చిరుతిండ్లతో గడిపారంట
మరుసటి రోజు ఎక్కడి నుండో రైస్, కూరగాయలు తెప్పించుకున్నారంట. వాటితో విజయ నిర్మలగారు అద్భుతంగా వంట చేయడంతో అందరు తిన్నారట. ఇక బాలయ్య చేపలని వేటాడీ తీసుకు రావడంతో విజయ నిర్మల వాటితో చేపల పులుసు చేసిందంట. ఆ చేపల పులుసు అద్భుతంగా ఉండడంతో మూవీ యూనిట్ అందరికి రుచి చూపించారంట. అందరు లొట్టలేసుకుంటూ తిన్నారట. దాంతో తెలుగు ఇండస్ట్రీలో విజయనిర్మల గారి చేపల పులుసు ఫేమస్ అయ్యింది.
Also Read: 

దుల్కర్ సల్మాన్ 2012లో ‘సెకండ్ షో’ అనే మలయాళ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది దుల్కర్ రెండవ సినిమా ‘ఉస్తాద్ హోటల్’ లో నటించాడు. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. అన్వర్ రషీద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2012కి గాను మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ‘బెస్ట్ పాపులర్ సినిమా , బెస్ట్ డైలాగ్స్, యాక్టర్ తిలకన్ కి ప్రత్యేక అవార్డు వచ్చింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుని, భారీ కలెక్షన్స్ సాధించి, కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ మూవీని తెలుగులో ‘జనతాహోటల్’ గా డబ్ చేసి, 2018 లో రిలీజ్ చేశారు.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఫైజల్ (దుల్కర్ సల్మాన్) నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కావడంతో అతని తండ్రి, అక్కలు అల్లారుముద్దుగా పెంచుతారు. ఫైజల్ కి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. దాంతో తండ్రికి తెలియకుండా విదేశాల్లో హోటల్ మేనేజ్ మెంట్ చేశాడు. కానీ ఫైజల్ తండ్రి అతనితో స్టార్ హోటల్ పెట్టించాలని భావిస్తాడు. ఫైజల్ కి తండ్రి షహానా (నిత్యామీనన్)తో పెళ్ళిచూపులు ఏర్పాటుచేస్తాడు. ఆ సమయంలో ఫైజల్ హోటల్ మేనేజ్ మెంట్ గురించి బయటపడుతుంది.
దాంతో ఫైజల్ ను తండ్రి పాస్ పోర్ట్ తీసుకుని, ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. అప్పుడు ఫైజల్ తాతయ్య కరీంభాయ్ వద్దకు వెళ్ళి, ఆయన నడిపే “ఉస్తాద్ హోటల్”లో పనిచేస్తూ, డూప్లికేట్ పాస్ పోర్ట్ కు అప్లై చేసి, ఎదురుచూస్తుంటాడు. ఆ తరువాత తాత సహాయంతో బీచ్ బే అనే ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ గా జాయిన్ అవుతాడు. అక్కడ బీచ్ బే తమ హోటల్ ను విస్తరించడం కోసం “ఉస్తాద్ హోటల్”ను ఆక్రమించుకోబోతుందని తెలుసుకుంటాడు.
ఉస్తాద్ హోటల్ ను ఫైజల్ ఎలా కాపాడాడు ? తాత దగ్గర ఏం నేర్చుకుంటాడు ? చివరికి ఫైజల్ అనుకున్నట్టు విదేశాలకి వెళ్లాడా? లేదా అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ ఫైజల్ పాత్రలో ఒదిగిపోయారు. ఉస్తాద్ హోటల్ యాజమానిగా, ఫైజల్ తాతగా యాక్టర్ తిలకన్ జీవించారు. నిత్యామీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటు ఉంది.




