తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యక రాష్ట్రం కోసం పోరాడి, సాధించడమే కాకుండా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై, ఎన్నో పథకాలు, ప్రాజెక్టులు తీసుకువచ్చారు.
కేసీఆర్ ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు వరుసగా ఎలెక్షన్స్ లో విజయం సాధించారు. అయితే కేసీఆర్ తొలిసారి పోటీ చేసిన ఎన్నికలలో ఆయన గురువుగా భావించే అనంతుల మదన్ మోహన్ చేతిలోనే ఓటమి చవి చూశారు. ఆ తరువాత నుండి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. అనంతుల మదన్ మోహన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, అనంతుల మదన్ మోహన్ను సీఎం కేసీఆర్కు రాజకీయ గురువుగా పిలుస్తారు. లాయర్ వృత్తి చేస్తూనే మదన్ మోహన్ అటు తెలంగాణ ఉద్యమంలో, ఇటు రాజకీయాలలో కొనసాగేవారు. స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో, కాంగ్రెస్లో కొనసాగిన కాలంలో కేసీఆర్ మదన్ మోహన్కు సన్నిహితంగా మెలిగేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తరువాత కేసీఆర్ ఆ పార్టీలో చేరారు.
1970 లో మదన్ మోహన్ సిద్దిపేట ఉప ఎన్నికలతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1967లో సిద్దిపేట ఎమ్మెల్యే వల్లూరి బసవరాజు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దాంతో ఆ సీటు ఖాళీ అయింది. 1970లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలెక్షన్స్ జరిగాయి. ఆ ఎలెక్షన్స్ లలో మదన్ మోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పీవీ రాజేశ్వరరావు పై మదన్ మోహన్ 31,633 ఓట్లతో గెలిచారు. ఆ తరువాత 1972, 1979 ఎలెక్షన్స్ లో కూడా అనంతుల మదన్ మోహన్ గెలుపు సాధించారు.
1983లో తొలిసారి పోటీ చేసిన కేసీఆర్ పై విజయం సాధించారు. పీవీ నరసింహారావు, భవనం వెంకట్రామిరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, టంగుటూరి అంజయ్యల మంత్రివర్గాలలో మదన్ మోహన్ పనిచేశారు. మంత్రిగా విద్యా శాఖ, రెవెన్యూ, ఆరోగ్య శాఖల లాంటి ముఖ్యమైన శాఖలకు పనిచేశారు.
తెలుగుదేశం పార్టీ 1983 ఎలెక్షన్స్ లో 200కి పైగా సీట్లు సాధించి, ఎన్టీఆర్ సీఎం అయ్యి, గవర్నమెంట్ ను ఏర్పాటు చేయగా, మదన్ మోహన్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తరువాత వచ్చిన 1985 ఎలెక్షన్స్ లో మదన్ మోహన్ పోటీ చేయలేదు. అనంతరం 1989, 1994 ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి సిద్దిపేటలోనే పోటీ చేయగా, రెండు సార్లు కూడా కేసీఆర్ చేతిలో పరాజయం పొందారు. ఆ తరువాత రాజకీయంగా కనుమరుగయ్యారు. 2004లో అనంతుల మదన్ మోహన్ కన్నుమూశారు.

పెదకాపు ట్రైలర్ చూసినవారంత షాక్ అయ్యారు. ఒకప్పుడు క్లాస్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి మాస్ మూవీని ఎలా తీస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఈ మూవీ రేపు విడుదల కానుంది. దాంతో రిలీజ్ కు 2 రోజుల ముందే బుధవారం నాడు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షోకు వెళ్ళిన సినీ సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు పీఆర్వోలు, మూవీ క్రిటిక్స్ కూడా ఈ సినిమాని చూశారట.
వీళ్లంతా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పెదకాపు సినిమా పై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. మూవీ చూసిన వారంతా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారని, మూవీని రస్టిక్గా తీశారని కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్, డైలాగులు, విజువల్స్, కొన్ని సీన్స్ ఇప్పటికీ మైండ్ లో తిరుగుతున్నాయని ఒకరు ఎక్స్లో రాసుకొచ్చారు.
మరొకరు మాకూ ఒక వెట్రిమారన్ ఉన్నాడని అనిపిస్తోందని అన్నారు. ఇంకొకరు తెలుగులో గొప్ప కెమెరామేన్ ఉన్నారని ఛోటా కె నాయుడు తన వర్క్తో గుర్తు చేశారని సినీ జర్నలిస్ట్ రాసుకొచ్చారు. కొన్ని షాట్స్, ఫ్రేమ్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అని ప్రశంసించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారట. టెక్నీషియన్స్ అంతా బెస్ట్ వర్క్ ఇచ్చారని రాసుకొచ్చారు.

2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
ఏఎస్పీ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ భవ్యశ్రీ కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 18న భవ్యశ్రీ తండ్రి తన కుమార్తె అదృశ్యం అయ్యిందని స్థానికంగా ఉన్న పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారన్నారు. దాంతో మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి, ఎంక్వైరీ మొదలుపెట్టామని అన్నారు. ఒక బావిలో సెప్టెంబర్ 20న ఒక యువతి మృతదేహం దొరికిందని, ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
భవ్య శ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తె పై అఘాయిత్యం చేసి, చంపేశారని ఆరోపించారని చెప్పారు. నలుగురి పై సందేహం ఉందని చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నామని అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిదండ్రుల ఎదుటే మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ చేశారని, మృతురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవని, అఘాయిత్యానికి ఏమైన పాల్పడి ఉంటారనే సందేహంతో మృతురాలి నుండి శాంపిల్స్ సేకరించి, తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపించామని తెలిపారు. ఎవరైన ఊహాగానాలు, అవాస్తవాలు వ్యాప్తి చేస్తే వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు.
ఎస్పీ రిషాంత్ రెడ్డి భవ్యశ్రీ మృతి పై ట్వీట్ చేశారు. అందులో “పెనుమూరులో కలకలం రేపిన 16 సంవత్సరాల అమ్మాయి అదృశ్యం, అనుమానాస్పద మృతి కేసులో సామాజిక మధ్యమలలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఆ అమ్మాయి పై ఎలాంటి అత్యాచారం లేదా శరీరం పై గాయాలేమి లేవు అని అన్నారు. గుండు కొట్టి అమ్మాయిని చంపారు అనేది నిజం కాదని, ఊడిపోయిన జుట్టు ఆమె మృతి చెందిన బావిలో లభ్యం అయ్యిందని అన్నారు. తల పై కూడా గుండు కొట్టినట్టుగా ఎలాంటి గుర్తులు లేవని” వెల్లడించారు.
రణ్బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ యానిమల్. కొన్ని రోజులుగా ఈ మూవీలోను కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. రణ్బీర్ కపూర్ పుట్టినరోజు (సెప్టెంబర్ 28) సందర్భంగా ఈ మూవీ టీజర్ను మూవీయూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్బీర్ కపూర్ ను ‘యానిమల్’ లా వయలెంట్గా చూపించారు.
టీజర్ను చూస్తే, తండ్రీ కుమారుల మధ్య ఎమోషన్ కనిపిస్తోంది. అయితే ఒక టిపికల్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ మూవీలో విలన్ ఎవరు అనే విషయం మాత్రం అంత స్పష్టంగా తెలియలేదు. రణ్ బీర్ కపూర్ కొన్ని చోట్ల చాలా కూల్గా, కొన్ని చోట్ల చాలా వయలెంట్గా కనిపించాడు. రణ్ బీర్ కపూర్ చెప్పిన డైలాగ్స్ మూవీ పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
యానిమల్ టీజర్ విజువల్స్, సంగీతం, బిజీఎం ఇలా ప్రతిదీ అందరినీ ఆశ్చర్య పడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ స్టాండర్డ్లో ‘యానిమల్’ మూవీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, యానిమల్ టీజర్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
watch video :
శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవి అన్నాచెల్లెళ్ళు. ఒకసారి మహావిష్ణువు పరమేశ్వరుడిని చూడటానికి కైలాసానికి వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు తన మేనల్లుడు అయిన గణపతిని వైకుంఠం తీసుకుని వెళ్ళాడు. అక్కడ సుదర్శన చక్రంతో సహా తన ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టాడు. అయితే బాల గణపతి బంగారు కాంతులతో మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకుని, సైలెంట్ గా కూర్చున్నాడు. ఆ తరువాత విష్ణువు చక్రం కనిపించకపోయేసరికి దాని కోసం వెతకడం ప్రారంభించాడు.
విష్ణువు ఏం చేస్తున్నాడో అర్ధం కానీ గణపతికి గుంజీలు తీయడం విచిత్రంగా అనిపించి, విపరీతమైన నవ్వు వస్తుంది. కడుపు నొప్పిచేంతగా గణపతి నవ్వాడు. అలా నవ్వుతున్న సమయంలో గణపతి కడుపులోని చక్రం బయటకి వస్తుంది. దాంతో శ్రీ మహావిష్ణువు ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఆ రోజు నుండి వినాయకుడి ముందు గుంజీలు తీయడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులు గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి గుంజీలు తీయడం మొదలుపెట్టారు.

మహేష్ గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించాయి. ఇటీవల నాగార్జున కూడా తాను నటిస్తున్న నా సామీరంగా మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పేశారు. అలా సంక్రాంతి రేస్ లో మూడు సినిమాలు చేరాయి. నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రాలు క్రిస్మస్ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు.
కానీ అనూహ్యంగా హాయ్ నాన్న,సైంధవ్ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈగిల్, విజయ్ దేవరకొండ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తునట్లుగా ప్రకటించారు. దీంతో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా సంక్రాంతి బరిలో ఉండగా, ఇన్ని సినిమాలు ఎందుకు పోటీ పడుతున్నాయి అనేది చర్చకు దారి తీసింది. ఇలా ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా చేయడానికి కారణం ప్రభాస్ సలార్ సినిమా అని తెలుస్తోంది.
సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 అని సంవత్సరం క్రితమే ప్రకటించింది. దాంతో చాలా సినిమాలు ఆ డేట్ కు దరిదాపుల్లో రాకుండా ప్లాన్ చేసుకున్నాయి. తీరా ఆ మూవీ విడుదల పోస్ట్ పోన్ కావడంతో షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రాలన్ని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాయి. అయితే సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తుండడంతో ఇప్పటికే క్రిస్మస్ కు రిలీజ్ రెడీ అయిన మీడియం బడ్జెట్ చిత్రాలు గందరగోళంలో పడ్డాయి. దాంతో సంక్రాంతికి రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో 362 మార్కులను సాధించింది. వారిది ఎస్సీ కేటగిరి అవడంతో ఎంబీబీఎస్ సీటు తప్పకుండా వస్తుందని ఫ్యామిలీ అంత సంతోషాపడ్డారు. కానీ ఆరవ తరగతిలో కీర్తన చేరిన ఏడాదికి ఎటపాక నవోదయ విద్యాలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయింది. దాంతో కీర్తన ఆంధ్రప్రదేశ్ కు లోకల్ గా, తెలంగాణకు నాన్ లోకల్ గా మారింది. దానివల్ల కేఎన్ఆర్ యూనివర్సిటీలో ఆమె ఎంబీబీఎస్ సీటు కోల్పోయింది.
కీర్తన తండ్రి సూర్య తమ పూర్వీకుల నుండి తెలంగాణలో ఉంటున్నామని అన్నారు. ధ్రువపత్రాలన్ని కలిగి ఉన్నామని తన కుమార్తెను నాన్ లోకల్ గా పరిగణించడం ఎంతవరకు కరెక్ట్ అని, తన కుమార్తె కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వారికి కూడా సీటు వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయం మీద హైకోర్టుకు వెళ్ళగా కీర్తనకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. యూనివర్సిటీలో కోర్టు ఆర్డర్ తో సంప్రదించగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తమకు ఆర్డర్స్ ఉన్నాయని, కీర్తనను నాన్ లోకల్ గా లెక్కిస్తామని చెప్పారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.
విద్యార్థుల పేరంట్స్ స్థానికత అనుగుణంగా ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలని కోర్టు చెప్పినప్పటికీ, ఆ యూనివర్సిటీ దానిని పరిగణలోకి తీసుకోలేదని, దానివల్ల విద్యార్థిని ఉన్నత చదువుకు దూరమయ్యే కండిషన్ ఏర్పడింది. ఈ విషయం పై తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలని కీర్తన పేరెంట్స్ కోరుతున్నారు.
భారత అత్యన్నత రా ఏజెంట్ గుర్తింపు పొందిన ఆ వ్యక్తి వ్యక్తి పేరు రవీందర్ కౌశిక్. ఆయన 1952లో ఏప్రిల్ 11న హర్యానాలో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుండే దేశభక్తి ఉంది. రవీందర్ 23 సంవత్సరాల వయసులో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ లో చేరారు. అయితే పాకిస్తాన్ కు “అండర్ కవర్” ఏజెంట్ గా వెళ్లేందుకు అందరూ వెనకడుగు వేయగా, తాను వెళ్ళతానని రవీందర్ ముందుకు వచ్చారు. ఆయన పాకిస్థాన్ వెళ్ళే ముందు ఉర్ధూ నేర్చుకుని, ముస్లిం మతం కూడా మార్చుకున్నారు.
అహమ్మద్ షాకీర్ పేరు పెట్టుకుని, పాకిస్థాన్ కు 1975 లో వెళ్ళారు. అక్కడి వారికి సందేహం రాకుండా ఉండేందుకు కరాచి యూనివర్శిటీలో ఎల్ఎల్బి చేశారు. ఆ తరువాత పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నత పదవిలో చేరారు. పాక్ మహిళ అమానత్ ను పెళ్లి చేసుకున్నారు. 1979 – 1983 వరకు విలువైన సమాచారాన్ని రా, మరియు ఇండియన్ ఆర్మీకి పంపించేవారు. పాకిస్థాన్ ఇండియాను దెబ్బ కొట్టాలనుకున్న ప్రతిసారి దేశానికి ముందుగా ఆ సమాచారం అందించి రక్షించేవారు.
అయితే మరొక రా ఏజెంట్ ఇన్యత్ మసిహా, పాకిస్తాన్ ఆర్మీ విచారణలో రవీందర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. దాంతో రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడ్డారు. అప్పటి నుంచి 16 ఏళ్ళ పాటు భారత్ సీక్రెట్స్ చెప్పమని రవీందర్ కౌశిక్ ను దారుణంగా హింసించారు. కాళ్ళకు, చేతులకు ఉన్న గోళ్ళను తొలగించి రక్తాలు వచ్చేలా సూదులతో గుచ్చేవారు. పళ్ళను రాయితో పగులగొట్టారు. ఇనుప శూలాలతో శరీరంలోని వివిధ భాగాలలో గ్రుచ్చి ఆయనకు నరకం చూపించారు.
ఎన్ని విధాలుగా హింసించినా దేశ భక్తుడైన రవీందర్ కౌశిక్ దేశ రహస్యం ఒక్కటి కూడా చెప్పలేదట. ఎప్పటికైనా భారత ప్రభుత్వం రక్షిస్తుందని ఎదురు చూసిన రవీందర్ కు క్షయ వ్యాధి వచ్చి, 1999లో జూలై 26న కన్నుమూశారు. ఆయనని ఆ జైలు వెనుక ఖననం చేసారని తెలుస్తోంది. ఆయన అందించిన సేవలకు గాను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా బ్లాక్ టైగర్ అని బిరుదును ఇచ్చింది.