మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన జంట జూన్ 20న తల్లిదండ్రులగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. మంగళవారం రోజున ఉపాసన ఆడపిల్లకు జన్మనివ్వడంతో లక్ష్మీదేవి పుట్టిందని మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
దాదాపు పదకొండు ఏళ్ల తర్వాత చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కావడంతో చిరంజీవి, సురేఖ చాలా సంతోషపడ్డారు. తమ పాపకి ఇప్పటికే పేరును కూడా నిర్ణయించామని చేసినట్లు మొన్న అపోలో హాస్పిటల్ వద్ద చరణ్ మీడియా ముందు చెప్పారు.

నేడు రామ్ చరణ్ కూతురు బారసాల వేడుకను నిర్వహిస్తున్నట్లుగా సామాజిక మధ్యమం ద్వారా ఉపాసన తెలిపింది. దాంతో బారసాల వేడుక పై అందరికి ఆసక్తి ఏర్పడింది. అలాగే మెగావారసురాలికి ఏం పేరు పెట్టారో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నెలకొంది.

వారసురాలి రాకతో మెగాస్టార్ ఫ్యామిలిలో సంబరాలు జరుపుకుంటున్నారు. నేడు (జూన్ 30) మెగాస్టార్ ఇంట్లో బారసాల వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. తన మనవరాలి పేరు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన కుమార్తె పేరు ‘క్లింకారా’ అని పెట్టినట్లుగా వెల్లడించారు. ఉపాసన కూడా ఈ విషయన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

తమ కుమార్తెకు పెట్టిన పేరును లలిత సహస్రనామం నుండి తీసుకున్నారు. క్లింకారా అనేది లలితాసహస్రనామాల్లోని బీజాక్షం. ప్రకృతికి మరియు శక్తికి ప్రతిరూపం అని అర్థం. ఆ పేరులో ఒక శక్తి మరియు పాజిటివ్ వైబ్రేషన్ ఉందని, మా లిటిల్ ప్రిన్సెస్ కు ఈ లక్షణాలను అందిపుచ్చుకుంటుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ పేరు వినడానికి కాస్త కొత్తగా అనిపించినా, ఈ పేరులో మంచి అర్ధం ఉందని అంతా అనుకుంటున్నారు. ఇక క్లింకారా బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈరోజు మెగా ప్రిన్సెస్కు నామకరణం చేయబోతున్నట్లు ఉపాసన వెల్లడించారు. నేడు మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పాల్గొననున్నారు. సన్నిహితులు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. బారసాల వేడుక సందర్భంగా రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ రామ్ చరణ్- ఉపాసన జంటకు ఒక ఖరీదైన బహుమతి పంపించారట.
ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖేష్ అంబానీ పంపిన ఆ బహుమతి ఏమిటంటే బంగారు ఊయల. దాని కోసం కోటి రూపాయలకు కన్నా ఎక్కువే ఖర్చు అయ్యిందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఎవరు అఫిషియల్ గా ప్రకటన చేయలేదు.
2001లో విడుదల అయిన గదర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా గదర్ 2 మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఆఖరి షెడ్యూల్లో పాల్గొన్న అమీషా పటేల్ చిత్రబృందం పై ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్స్ చేసింది.
అమీషా పటేల్ ట్వీట్లో ‘సాంకేతిక నిపుణులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు, ఇతర స్టాఫ్ కి వేతన బకాయిలు ఇవ్వలేదని, షూటింగ్ ఆఖరి రోజు చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళడానికి, ఫుడ్ బిల్లులకు డబ్బు చెల్లించలేదు. యాక్టర్స్ కు, స్టాఫ్ కి కార్లను అరెంజ్ చేయలేదు. షూటింగ్ దగ్గరే ఒంటరిగా వదిలి వేశారు.
అయితే జీ స్టూడియోస్ టీమ్ వెంటనే అన్ని బకాయిలను చెల్లించి, అనిల్ శర్మ ప్రొడక్షన్స్ చేసిన తప్పులను సరి దిద్దారు. సమస్యను సాల్వ్ చేసిన నీరజ్ జోషి, షరీక్ పటేల్, కబీర్ ఘోష్, నిశ్చిత్ లకు కృతజ్ఞతలు. జీ స్టూడియోస్ యూనిట్ ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గదర్ 2 సినిమాలో అమీషా పటేల్ సన్నీ డియోల్ సరసన హీరోయిన్ గా నటించింది.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు చెందిన అలోక్ మౌర్య తన భార్యను చాలా కష్టపడి చదివించి ఆమె కల అయిన ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా చేశాడు. తీరా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ జాబ్ వచ్చిన తరువాత ఆమె అతడిని మోసం చేసింది. పైగా అతడి పై వరకట్నం కేసు పెట్టి జైలుకు పంపించింది. ఈ విషయం పై ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి కూడా స్పందించారు. నెటిజెన్లు ఆమెను, రాహుల్ రవీంద్రన్ ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తూన్నారు. దీనిపై తాజాగా రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ లో ఇలా చెప్పుకొచ్చారు.
“మీరు అందరూ ఆమెతో పోరాడిన తరువాత నన్ను ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఎత్తి చూపుతున్న మైండ్ సెట్ ప్రాబ్లెమ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఆమె మాట వినండి. ఆ పై ఆమెకు కొంచెం ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆమె మీ పై ప్రేమను కురిపిస్తుంది. ఆమె మీకు ఇష్టమైన అక్కగా మారుతుంది.
నాకు లభించిన అతి పెద్ద ఆశీర్వాదాలలో ఆమె కూడా ఒకటి. ఆమె పరిమితి లేకుండా ప్రేమిస్తుంది. మరియు మీకు భరోసా ఇస్తుంది. ఇతరుల వైపు నుండి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ జీవితంలో ఉన్న స్త్రీలు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మరియు మీరు మీ కంటే ఎక్కువగా వారిని గౌరవించండి. అప్పుడు ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో మీకు తెలియదు” అని చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలతో దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగింది. ఆ తరువాత వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ తో అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ వంటి డైరెక్టర్ ప్రశంసలు కురిపించాడు అంటే తెలుగు సినిమా ఖ్యాతి గురించి అర్ధం చేసుకోవచ్చు. జక్కన్న నెక్స్ట్ సినిమా కోసం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఒక మలయాళ సినిమాలో టాలీవుడ్ పై సెటైర్ వేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘త్రిశంకు’ అనే మలయాళ మూవీలో హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్ కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటారు. అపుడు హీరోయిన్ వల్ల నాన్న పెళ్లికి ఒప్పుకోడు ఏమో అంటుంది. అప్పుడు పక్కన ఉన్న అమ్మాయి తెలుగు సినిమాలలో లాగా లేచిపో అని చెప్తుంది. నిజానికి అన్ని తెలుగు సినిమాలూ అలా ఉండవు. కానీ ఈ సినిమాలో ఆ పదం వాడేసారు. ఈ వీడియో చూసిన కొంత మంది తెలుగువాళ్ళు మా సినిమాలు అన్నీ అలా ఉండవు అంటూ కామెంట్ చేస్తున్నారు.
M సింబల్ లైఫ్ లైన్(జీవిత రేఖ), హెడ్ లైన్(తల రేఖ), మరియు హార్ట్ లైన్(హృదయ రేఖ) వల్ల ఏర్పడుతుంది. లైఫ్ లైన్ మణికట్టు నుండి పైకి విస్తరించి, హెడ్ లైన్ దాటి హార్ట్ లైన్ కు చేరుకుంటుంది, జీవిత రేఖ, తల రేఖ మరియు హృదయ రేఖతో వాలుగా ఉండే M సింబల్ ను ఏర్పరుస్తుంది. అరచేతి పై ఉండే M సింబల్ డబ్బు మరియు ప్రేమ అదృష్టాన్ని సూచిస్తుంది.
M సింబల్ ఉన్న వ్యక్తులు సాధారణంగా ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉంటారు. తాము కన్న కలల కోసం కష్టపడి పని చేస్తారు. వారు అనుకుంటే తప్పక సాధిస్తారు. అందువల్ల, ఈ వ్యక్తులు తరచుగా విజయాన్ని సాధిస్తారు. అలాగే గుర్తింపును సంపాదించుకుంటారు. వీరు 40 ఏళ్ల లోపే పేరు ప్రతిష్టలను, డబ్బును పొందుతారు.
M గుర్తు ఉన్న వ్యక్తులు వ్యాపారంలో జన్మించిన మాస్టర్స్, వారు ఏమీ లేకుండా నిర్మించగలరు మరియు నాలుగు, ఐదు తరాలకు సరిపోయే గొప్ప సంపదను కూడబెట్టుకోగలరు మరియు మిలియనీర్స్ గా ఉంటారు. వీరు సహజంగా, ఉత్సాహంగా, కరుణతో, సృజనాత్మకంగా మరియు ఇతరులు విస్మరించిన సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటారు. వీరికి ఒక పనిని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఆదిపురుష్ సినిమా మొదట్లో ప్రభాస్ ఎంట్రీ సన్నివేశంలో జరిగిన ఫైట్ ను ఎలా షూట్ చేశారు? ఫైట్ షూటింగ్ ముందు ఎలా వర్కవుట్ చేశారో తెలిపే వీడియో రిలీజ్ అయ్యింది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ కు బదులుగా ఫైటర్స్ తో రిహార్సల్స్ ఫైట్ ను చిత్రీకరించారు. ఆ తరువాత అదే ఫైట్ ను ప్రభాస్ పై షూట్ చేశారు. ఆ ఫైట్ సీన్స్ కు గ్రాఫిక్స్ యాడ్ చేశారు.
ఇక ఈ వీడియో చూసిన వారు ఇంత కష్టపడి పోరాట సన్నివేశాలను చిత్రీకరించారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు డమ్మీ ఫైటర్స్తో చిత్రీకరించిన ఈ ఫైట్ సీన్ని, అనంతరం డమ్మీ ఫైటర్ ఫేస్ కు బదులుగా ప్రభాస్ ఫేసును అతికించే ఛాన్స్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో చూపించిన ఫైట్ సీన్స్ ఎంతో క్లిష్టంగా ఉన్నాయి. వీటిని ట్రైనింగ్ తీసుకున్న ఫైటర్ మాత్రమే చేయగలడని, హీరో ప్రభాస్ అంత క్లిష్టమైన ఫైట్ ను ఫ్లెక్సిబుల్గా పోరాడగలరా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీలో హీరో ప్రభాస్ రాముడిగా, సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవదత్ నగరే, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం చేయగా, ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించారు.
తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి బ్రో సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీ గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తుండగా, పవన్ కల్యాణ్ దేవుడిగా నటిస్తున్నారు. తేజ్ పక్కన హీరోయిన్లుగా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ మరియు నటుడు సముద్రఖని డైరెక్షన్ చేస్తుండగా, దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ ను రాశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
బ్రో సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. మూవీ యూనిట్ టీజర్ రిలీజ్ తో ప్రమోషన్లను ప్రారంభించాలని భావిస్తోంది. జూలై మూడవ వారంలో బ్రో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతూ కూడా బ్రో టీజర్ కి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పే టైంలో టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడిలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా బ్రో టీజర్ రిలీజ్ అవడంతో దీనిపై సోషల మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
“రాకేష్ మాస్టర్ తో 8 ఏళ్ళు ప్రయాణించానని, ఆ సమయంలో బయట ప్రపంచం ఎలా ఉంటుందో మాకు తెలియదు. తాను, సత్య మాస్టర్ ఇద్దరు విజయవాడలో డ్యాన్స్ నేర్చుకున్న అనంతరం రాకేష్ మాస్టర్ వద్దకు వచ్చాము. రాకేష్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్. యూట్యూబ్లో చూస్తున్న రాకేష్ మాస్టర్ డ్యాన్స్ ఐదు పర్సంటే అని, ఈ విషయం చాలా మందికి తెలియదని అన్నారు. చిన్నప్పటి నుండి నాకు వ్యక్తిగతంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత రాకేష్ మాస్టర్ డ్యాన్స్ చూసి అభిమానించడం మొదలుపెట్టాను.
గతంలో ఆయన చాలా బాగా డ్యాన్స్ చేసేవారు. రాకేష్ మాస్టర్ ను గురువు అని చెప్పుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫర్ ఫెక్ట్ గా వచ్చే వరకు వదిలిపెట్టేవారు వారు కాదని చెప్పారు. మాస్టర్ ఎక్కడున్నా కూడా బాగుండాలని అనుకున్నాం. ఇలా అవుతుందని అసలు అనుకోలేదని అన్నారు. రాకేష్ మాస్టర్ పెళ్లి చేసింది మేమే. రాకేష్ మాస్టర్ తప్ప వేరే ప్రపంచం మాకు తెలియదు. మాస్టర్ తోనే ఉండి, ఆయన ఇన్ స్టిట్యూట్ లో క్లాసులు చెప్పవాళ్ళం, అక్కడే బతికాము.
ఆ తర్వాత మాస్టర్ దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టినపుడు ఏం చేయాలో తెలియక అక్కడి నుండి బయటకు వచ్చి మాస్టర్లుగా అయ్యాము. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వారికి తోచిన థంబ్ నెయిల్స్ పెట్టి, ఏమేమో చెప్తున్నారు. అలా చేయడం వల్ల వేరేవారి కుటుంబాలు బాధపడుతున్నాయి. ఏ విషయం అయినా నిజాలు మాత్రమే రాయండని అన్నారు. మా రాకేశ్ మాస్టర్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.
భారత్ వేదికగా జరిగిన వరల్డ్కప్ 2011 ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంకతో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో ధోని తీసుకున్న నిర్ణయం క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. చేజింగ్ టైంలో బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్ద మార్పు చేశాడు. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేయాల్సిన 5 వ స్థానంలో ధోని వచ్చాడు.
అసలు ధోని ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడనేది ఇప్పటికీ మిస్టరీనే. తాజాగా ముత్తయ్య మురళీధరన్ వరల్డ్కప్ 2011 ఫైనల్ లో ధోని ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో తనకు తెలుసు అని అన్నారు. మురళీధరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘ధోని యువరాజ్ సింగ్ కన్నా ముందుగా బ్యాటింగ్ చేయడానికి కారణం నేనే. దానికి కారణం యువరాజ్కి నా బౌలింగ్లో రికార్డ్ పెద్దగా లేదు. అయితే ధోనికి ఉంది.
అది మాత్రమే కాకుండా ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. దాంతో నేను వేసే బంతులను ఆడిన ఎక్స్పీరియన్స్ ధోనికి ఎక్కువగా ఉంది. అందువల్లే బ్యాటింగ్ ఆర్డర్లో ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నాడు’ అని అన్నారు. అయితే దీనిలో వాస్తవం ఎంతవరకు ఉందో ధోని చెప్తేనే తెలుస్తుంది.