ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే గతంలో రాజకీయ నాయకుడిగా హరికృష్ణ లైఫ్ లో జరిగినదే షర్మిల లైఫ్ లో కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి షర్మిలకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆమె ఒక ఇల్లాలిగా తన కుటుంబాన్ని చక్కపెట్టుకుంటున్న సమయంలో తండ్రి చనిపోవడం, జగన్ జైలుకు వెళ్లడం వంటి పరిస్థితుల వలన ఆమె రాజకీయాల్లోకి రావలసి వచ్చింది.
అయితే ఆంధ్రప్రదేస్ లోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కోసం పనిచేసిన షర్మిలకు తర్వాత అన్నతో విభేదాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ వదిలి తెలంగాణ వెళ్ళిపోయారు.

అక్కడ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు కానీ ప్రాంతీయ పార్టీలతో పోరు భరించలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సేమ్ టు సేమ్ హరికృష్ణ రాజకీయ ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. రాజకీయాలంటే అసలు ఆసక్తి లేని హరికృష్ణ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టడంతో ఆయనకి రథసారథిగా మారారు. తర్వాత అధికారం చంద్రబాబు నాయుడు చేతికి వచ్చాక ఆయనతో పొసగక పార్టీని విడిచి పెట్టేసారు హరికృష్ణ. తరువాత అన్నా టీడీపీ పేరిట సొంతంగా ఒక పార్టీ పెట్టారు.

కానీ 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు.ఏడు సంవత్సరాల తర్వాత టీడీపీ చెంతకు చేరారు. చంద్రబాబు హరికృష్ణ కలిసి పోవడంతో టీడీపీ లో ఆయనకు కొంత గౌరవం పెరిగిందనే చెప్పాలి. హరికృష్ణ కూడా షర్మిల అలాగే తండ్రి కోసం పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ రాజకీయాలకు దూరం అయ్యారు.

టీడీపీ కి రాజీనామా చెయ్యకపోయినా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పాలి. ఇష్టం లేకపోయినా రాజకీయాలలోకి రావడం, పార్టీతో పొసగక కొత్త పార్టీలు పెట్టడం ఆపై మళ్లీ పాత పార్టీలోనే విలీనం అవ్వటం ఈ సంఘటనలు అన్ని ఇద్దరి జీవితంలోనూ ఇంచుమించు ఒకే లాగా జరుగుతున్నాయి. మరి అప్పట్లో హరికృష్ణ ఓడిపోయారు. అదే ఇప్పుడు కూడా కొనసాగుతుందా లేదంటే షర్మిల విజయం సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
















అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తిరుపతి, అనంత పద్మనాభస్వామి దేవాలయం, షిర్డీ లాంటి దేవాలయాలకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. దేశంలోనే ఈ దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అది కూడా ఫ్యామిలీ అంతా వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్, రెస్టారెంట్లు, హోటల్స్ తో పాటు ఇతర బిజినెస్ లకు డిమాండ్ కూడా పెరుగుతుంది.
వివిధ రంగాలకు ఆదాయం పెరగడంతో టాక్స్ ల రూపంలో గవర్నమెంట్స్ కు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. ఇటీవల శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడితో 2 నెలలకు గాను 357 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఆధ్యాత్మిక టూరిజం పేరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.
ఎస్బీఐ నివేదిక ప్రకారం, యూపీలో రామ మందిరం నిర్మాణం మరియు అదనపు చర్యల వల్ల 2024-25 లో యూపీ గవర్నమెంట్ కు అదనంగా 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మొత్తం సందర్శకుల రాకతో సమకూరనుంది. దీనివల్ల రోడ్డు, రైలు, వాయురవాణా పెరిగే ఛాన్స్ ఉంది. భక్తుల సేవల గాను హోటల్స్, హాస్పటల్స్ సైతం పెరుగుతాయి. 2027 వరకు మహారాష్ట్రతో పాటుగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లను అధిగమించి, దేశ జీడీపీలో యూపీ వాటా పది శాతంగా ఉంటుందని తెలిపింది.





