అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం ముంబై ఇండియన్స్ జట్టుకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో కెప్టెన్ ధోనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ముంబయి ఇండియన్స్ టీమ్ లో మాత్రం రోహిత్ శర్మ రెండు మార్పులు చేశారు. జయంత్ యాదవ్, నాథన్ కౌల్టర్ నైల్ స్థానాల్లో ధవళ్ కులకర్ణి, జేమ్స్ నీషమ్ వచ్చారు.