చాలామందికి బ్లడ్ ప్రెషర్ పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాతే ఎక్కువగా వస్తుంది దీనికి కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. పెళ్లికి ముందు జీవితం పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పెళ్ళికి ముందు జీవితంలో ఎలాంటి టెన్షన్, బాధ్యతలు ఉండవు కానీ పెళ్లి తర్వాత బాధ్యతలు టెన్షన్స్ అన్నీ పెరుగుతాయి. పెళ్లి తరువాతే చాలామంది జంటల్లో బీపీ పెరుగుతుందని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది.

దంపతులిద్దరిలో ఒకరికి బీపీ వస్తే చాలా కొద్ది రోజుల తేడాలోనే మరొకరికి కూడా బీపీ వస్తుంది. కుటుంబం కోసం ఆ దంపతులు పడే తపన, యాతన, కలిసి నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళిద్దరూ పడే ఘర్షణ ఇవి అన్ని బీపీకి కారణం అవుతాయి. ఒక్కొక్కసారి తీవ్ర ఒత్తిడి వల్ల బీపీ ఎక్కువ అయి ప్రాణాలకు సైతం ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఉప్పు, కారాలు ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోండి.
యోగా మెడిటేషన్ వంటివి చేయటం వలన బీపీ చాలా కంట్రోల్ లో ఉంటుంది అలాగే సమస్యలను వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోండి. సమస్యలను ఒత్తిడిగా ఫీల్ అయినట్లయితే అది మీ బీపీ మీద ప్రభావం చూపిస్తుంది. బీపీ ఎక్కువైనట్లయితే అది హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి పై ఎక్కువగా శ్రద్ధ చూపించండి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించే ప్రయత్నం చేయండి.

రోజుకి అరగంట వ్యాయామం చేయండి రోజు వ్యాయామం చేయడం వలన రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు సోడియం రిచ్ ఫుడ్స్ కంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే కచ్చితంగా రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవటం చాలా అవసరం. చిన్ని చిన్ని జాగ్రత్తలతో బీపీని కంట్రోల్ లో ఉంచుకుంటే ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది.

1.శ్రీ రాముడు:
2.సీత:
3.హనుమంతుడు:
4.కృష్ణుడు:
5.శివుడు:
6.కాళీమాత:
8.పార్వతి దేవి:
9.శ్రీ మహావిష్ణువు:
10.బ్రహ్మ:
11.వామన:
12.గౌతమ బుద్దా:
13.నరసింహ:
14.వరహ:
15.కల్కి:
Also Read: 




ఎడతెగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోలు ధర రూ.96 – 108 మధ్య విక్రయిస్తుండగా, డీజిల్ రూ.94 నుంచి రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 109.66 కి విక్రయిస్తున్నారు. ఇక ఇంధన ధరలు పెరగడం వెనుక అనేక కారణాలున్నాయి. కానీ, ప్రస్తుత ధర సామాన్యుడి వెన్ను విరిచే స్థాయికి చేరి, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది.
కొన్నేళ్ల నుంచి పెట్రోలు ధర ఎక్కువగానే ఉన్నా, కొన్ని దశాబ్దాల క్రితం దాని ధర చాలా తక్కువ. 1963లో పెట్రోల్ లీటరుకు 72 పైసలకు అమ్మినట్టు ఒక పాత బిల్లు ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. 1963లో ఫిబ్రవరి 2 కు సంబంధించిన పెట్రోల్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బిల్లు భారత్ పెట్రోల్ సప్లై కో నుండి వచ్చింది. ఇది సీరియల్ నంబర్ ‘7560’ కలిగి ఉన్న ఫిల్లింగ్ స్టేషన్. ఐదు లీటర్ల పెట్రోల్కు మొత్తం రూ. 3.60. అంటే ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 72 పైసలు మాత్రమే. ఈ బిల్లు చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఒక నెటిజెన్ “60వ దశకంలో మధ్యతరగతి వారి జీతం దాదాపు 50-100 రూపాయలు. నేడు ఆ జీతం దాదాపు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంది. భారీ దిగుమతులు మరియు చాలా తక్కువ ఎగుమతులు చేయడం వల్ల రూపాయి పతనమైంది” అని కామెంట్ చేశాడు.


మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో సినిమాను తాజాగా ప్రకటించారు. రవితేజ హరీష్ శంకర్కు డైరెక్టర్ గా ‘షాక్’ మూవీతో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో హరీష్కు రెండవసారి అవకాశం ఇచ్చారు. ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీతోనే రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ వచ్చింది. పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
ఈ మూవీ బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రైడ్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారని సమాచారం. 2018లో వచ్చిన రైడ్ మూవీలో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఒక విలేజ్ లో అక్రమాస్తులు, బ్లాక్ మనీ అన్యాయంగా సంపాదించి, దాచిపెట్టిన వ్యక్తి ఇంటి పైకి రైడింగ్ చేసే ఇన్ కమ్ టాక్స్ అధికారి కథనే ఈ మూవీ.
కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ మూవీతో పోలికలు ఉంటాయి. అయితే ఈ మూవీ అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26’ రీమేక్ గా తెరకెక్కిందని తెలుస్తోంది. ఆల్రెడీ వచ్చిన ఈ మూడు సినిమాలను ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు చూశారు. మళ్ళీ రీమేక్ చేయడానికి అంతగా ఏముందని అంటున్నారు.