మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో ఎంతో మంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, నయనతార వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ఎంతో మంది కూడా ఈ సినిమాలో అతిధి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి షెల్డన్ చౌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

హీరోయిన్ మధుబాల, బ్రహ్మానందం, వాణి భోజన్, దేవరాజ్, ముఖేష్ రిషి, శివ బాలాజీ, మలయాళం నటుడు రాహుల్ మాధవ్, కౌశల్, రఘుబాబు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ లో ఒక సీన్ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఒక సీన్ లో మంచు విష్ణు బాణం వేస్తారు. బాణం గురి ఒక వైపుకి ఉంటుంది. కానీ మంచు విష్ణు మరొక వైపు చూస్తూ ఉంటారు. అంటే, మంచు విష్ణు కెమెరా వైపు చూస్తూ ఉంటారు. ఈ సీన్ స్లో మోషన్ లో చూపించారు. దాంతో మంచు విష్ణు కెమెరా వైపు చూడటం ఈ సీన్ లో చూపించారు. దాంతో, ఈ సీన్ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.
ఇటీవల జరిగిన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా టీజర్ స్క్రీనింగ్ జరిగింది. ఈ స్క్రీనింగ్ కి మంచు విష్ణుతో పాటు, విరోనికా, మోహన్ బాబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా వెళ్లారు. అక్కడ ఈ టీజర్ ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు విడుదల చేశారు. ఎన్నో ఫారిన్ లొకేషన్స్ లో సినిమా షూటింగ్ జరుపుకుంది. లొకేషన్స్ గురించి కూడా దాదాపు 5 సంవత్సరాల నుండి వెతికారు. ఎంతో హోం వర్క్ చేసిన తర్వాత ఈ సినిమాని రూపొందించడం మొదలుపెట్టారు. దాంతో ఈ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.










1.శ్రీ రాముడు:
2.సీత:
3.హనుమంతుడు:
4.కృష్ణుడు:
5.శివుడు:
6.కాళీమాత:
8.పార్వతి దేవి:
9.శ్రీ మహావిష్ణువు:
10.బ్రహ్మ:
11.వామన:
12.గౌతమ బుద్దా:
13.నరసింహ:
14.వరహ:
15.కల్కి:
Also Read: 




ఎడతెగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోలు ధర రూ.96 – 108 మధ్య విక్రయిస్తుండగా, డీజిల్ రూ.94 నుంచి రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 109.66 కి విక్రయిస్తున్నారు. ఇక ఇంధన ధరలు పెరగడం వెనుక అనేక కారణాలున్నాయి. కానీ, ప్రస్తుత ధర సామాన్యుడి వెన్ను విరిచే స్థాయికి చేరి, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది.
కొన్నేళ్ల నుంచి పెట్రోలు ధర ఎక్కువగానే ఉన్నా, కొన్ని దశాబ్దాల క్రితం దాని ధర చాలా తక్కువ. 1963లో పెట్రోల్ లీటరుకు 72 పైసలకు అమ్మినట్టు ఒక పాత బిల్లు ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. 1963లో ఫిబ్రవరి 2 కు సంబంధించిన పెట్రోల్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బిల్లు భారత్ పెట్రోల్ సప్లై కో నుండి వచ్చింది. ఇది సీరియల్ నంబర్ ‘7560’ కలిగి ఉన్న ఫిల్లింగ్ స్టేషన్. ఐదు లీటర్ల పెట్రోల్కు మొత్తం రూ. 3.60. అంటే ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 72 పైసలు మాత్రమే. ఈ బిల్లు చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఒక నెటిజెన్ “60వ దశకంలో మధ్యతరగతి వారి జీతం దాదాపు 50-100 రూపాయలు. నేడు ఆ జీతం దాదాపు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంది. భారీ దిగుమతులు మరియు చాలా తక్కువ ఎగుమతులు చేయడం వల్ల రూపాయి పతనమైంది” అని కామెంట్ చేశాడు.