నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి అందరికి తెలిసిందే. బాలయ్య ఏ మూవీ చేసినా అది సంచలనం అనే చెప్పవచ్చు. 1999లో వచ్చిన బాలకృష్ణ ‘సుల్తాన్’ సినిమా గురించి తెలిసిందే. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణలు పోటీ పడి నటించారు. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు. హీరో మరియు విలన్ పాత్రలలో నటించి ఆడియెన్స్ ని అలరించారు.
సూపర్ స్టార్ కృష్ణ పోలీస్ ఆఫీసర్ గా, సిబిఐ ఆఫీసర్ గా రెబల్స్టార్ కృష్ణంరాజు ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు. ఇలా ముగ్గురు అగ్ర హీరోలు నటిస్తుండడంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ట్రైలర్ లో బాలకృష్ణ డిఫరెంట్ గెటప్స్ చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రం కోసం డైరక్టర్ శరత్ మరియు రచయితలు పరుచూరి బ్రదర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. ముగ్గురు అగ్ర హీరోలే కావడంతో ఎవరి ఇమేజ్కి తగిన విధంగా వారి క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారు.
బాలకృష్ణ ఈ మూవీ షూటింగ్ విషయంలో సీనియర్ హీరోలైన కృష్ణ, కృష్ణంరాజులకు చెందిన పార్ట్ ను ముందుగా చేద్దామని చెప్పడంట. అయితే ఆ పార్ట్ షూటింగ్ అండమాన్ దీవుల్లో ప్లాన్ చేయడంతో కుటుంబాలతో ట్రిప్ లగా సరదాగా ఉంటుందని ముగ్గురు హీరోలు తమ ఫ్యామిలీలను తీసుకొని అండమాన్ కి వెళ్లారంట. అక్కడి లొకేషన్లు బాగున్నా, ఉండేందుకు రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ మాత్రమే ఉందంట. తప్పక అందులోనే అందరూ అడ్జస్ట్ అయ్యారంట. ఇక అక్కడ తినడానికి ఆహారం కూడా దొరికలేదంట. వెళ్లిన రోజు తమతో పాటు తీసుకెళ్లిన బిస్కేట్లు, చిరుతిండ్లతో గడిపారంట
మరుసటి రోజు ఎక్కడి నుండో రైస్, కూరగాయలు తెప్పించుకున్నారంట. వాటితో విజయ నిర్మలగారు అద్భుతంగా వంట చేయడంతో అందరు తిన్నారట. ఇక బాలయ్య చేపలని వేటాడీ తీసుకు రావడంతో విజయ నిర్మల వాటితో చేపల పులుసు చేసిందంట. ఆ చేపల పులుసు అద్భుతంగా ఉండడంతో మూవీ యూనిట్ అందరికి రుచి చూపించారంట. అందరు లొట్టలేసుకుంటూ తిన్నారట. దాంతో తెలుగు ఇండస్ట్రీలో విజయనిర్మల గారి చేపల పులుసు ఫేమస్ అయ్యింది.
Also Read: “కళాతపస్వి కె.విశ్వనాథ్” తెరకెక్కించిన “సప్తపది” హీరో గుర్తున్నారా..?? ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..??



దుల్కర్ సల్మాన్ 2012లో ‘సెకండ్ షో’ అనే మలయాళ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది దుల్కర్ రెండవ సినిమా ‘ఉస్తాద్ హోటల్’ లో నటించాడు. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. అన్వర్ రషీద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2012కి గాను మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ‘బెస్ట్ పాపులర్ సినిమా , బెస్ట్ డైలాగ్స్, యాక్టర్ తిలకన్ కి ప్రత్యేక అవార్డు వచ్చింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుని, భారీ కలెక్షన్స్ సాధించి, కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ మూవీని తెలుగులో ‘జనతాహోటల్’ గా డబ్ చేసి, 2018 లో రిలీజ్ చేశారు.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఫైజల్ (దుల్కర్ సల్మాన్) నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కావడంతో అతని తండ్రి, అక్కలు అల్లారుముద్దుగా పెంచుతారు. ఫైజల్ కి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. దాంతో తండ్రికి తెలియకుండా విదేశాల్లో హోటల్ మేనేజ్ మెంట్ చేశాడు. కానీ ఫైజల్ తండ్రి అతనితో స్టార్ హోటల్ పెట్టించాలని భావిస్తాడు. ఫైజల్ కి తండ్రి షహానా (నిత్యామీనన్)తో పెళ్ళిచూపులు ఏర్పాటుచేస్తాడు. ఆ సమయంలో ఫైజల్ హోటల్ మేనేజ్ మెంట్ గురించి బయటపడుతుంది.
దాంతో ఫైజల్ ను తండ్రి పాస్ పోర్ట్ తీసుకుని, ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. అప్పుడు ఫైజల్ తాతయ్య కరీంభాయ్ వద్దకు వెళ్ళి, ఆయన నడిపే “ఉస్తాద్ హోటల్”లో పనిచేస్తూ, డూప్లికేట్ పాస్ పోర్ట్ కు అప్లై చేసి, ఎదురుచూస్తుంటాడు. ఆ తరువాత తాత సహాయంతో బీచ్ బే అనే ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ గా జాయిన్ అవుతాడు. అక్కడ బీచ్ బే తమ హోటల్ ను విస్తరించడం కోసం “ఉస్తాద్ హోటల్”ను ఆక్రమించుకోబోతుందని తెలుసుకుంటాడు.
ఉస్తాద్ హోటల్ ను ఫైజల్ ఎలా కాపాడాడు ? తాత దగ్గర ఏం నేర్చుకుంటాడు ? చివరికి ఫైజల్ అనుకున్నట్టు విదేశాలకి వెళ్లాడా? లేదా అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ ఫైజల్ పాత్రలో ఒదిగిపోయారు. ఉస్తాద్ హోటల్ యాజమానిగా, ఫైజల్ తాతగా యాక్టర్ తిలకన్ జీవించారు. నిత్యామీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటు ఉంది.





నటి నిషా నూర్ తన గ్లామర్తో 1980లో సిల్వర్ స్క్రీన్ ను మరింత అందంగా మార్చింది. ఆమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాలలో నటిస్తూ దక్షణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, భాను చందర్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అగ్ర దర్శకులు అయిన బాలచందర్, భారతీరాజా విసు, చంద్రశేఖర్ లాంటి వారితో పని చేసింది. కమల్ హాసన్ తో కలిసి ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమాలో, రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, మోహన్లాల్తో పలు సినిమాలు చేసింది.
తన గ్లామర్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ 1995 అనంతరం నిషా నూర్ కు ఒక్క మూవీలో కూడా అవకాశం రాలేదు. అప్పటివరకు స్టార్ స్టేటస్ పొందిన నిషా నూర్ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సినిమాలని వదిలిపెట్టింది. అయితే సంపాదించిన డబ్బు మొత్తం కరిగిపోవడం మొదలైంది. బతకడం కోసం పని చేయాలి. కానీ ఆమె తప్పు దారిని ఎంచుకుని, వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది.
అయితే ఒక ప్రొడ్యూసర్ వల్లే ఆ వృత్తిలోకి వెళ్ళిందనే వార్త అప్పట్లో వచ్చాయి. ఆదుకునేవారు లేకపోవడం వల్ల నిషా నూర్ అందులోనే ఉండిపోయింది. ఆమెకు తలదాచుకునే స్థలం కూడా లేక ఒక సమయంలో ఒక దర్గా బయట నిద్రించింది. ఆమె పరిస్థితి తెలిసి, ఆదుకోవడానికి ఒక తమిళ ఎన్జీవో ముందుకు వచ్చి, నిషా నూర్ కు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ హాస్పటల్ లోనే నిషా నూర్ 2007లో అనాధలా మరణించింది.
