చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నారా లోకేష్. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నారా లోకేష్ 2007 లో బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు.
బ్రాహ్మణి నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు. వీరి పెళ్లి అప్పట్లో ఒక పెద్ద డిస్కషన్ అయ్యింది. అంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది అని అర్ధం.

సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పటి ఫోటోలు అయినా కూడా సడన్ గా బయటికి వస్తాయి. ఇప్పుడు వీరి పెళ్లి టైంకి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ ఫొటోలో, లోకేష్, బ్రాహ్మణితో పాటు మిగిలిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు కూడా ఉన్నారు. వీరిలో ఉన్న ఒక అమ్మాయి ఇప్పుడు మనందరికీ చాలా బాగా తెలుసు. ఆమె భర్త ఒక పెద్ద స్టార్ హీరో. ఆ అమ్మాయి ఎవరో ఈ పాటికి మీకే అర్ధం అయిపోయి ఉంటుంది. ఆమె మరెవరో కాదు నందమూరి ప్రణతి. ప్రణతి ఈ ఫొటోలో చాలా చిన్నగా ఉన్నారు.

అప్పటికి ప్రణతి వయసు 15 సంవత్సరాలు మాత్రమే. 2011 లో ప్రణతి, జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్గవ్ రామ్, అభయ్ రామ్. ప్రణతి పెద్దగా బయట కనిపించరు. ఇంటర్వ్యూలకి అయితే అసలే రారు. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ప్రణతికి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్ భార్య ఉపాసన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరు పోస్ట్ చేసిన ఫొటోస్ లో అప్పడప్పుడు ప్రణతి కూడా కనిపిస్తారు.

ఇంక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకముందు జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కుడా ఉంది.




కోల్ కతాలో జన్మించిన రచన అసలు పేరు జుం జుం బెనర్జీ. సినిమాల్లోకి వచ్చాక తన పేరును రచనగా మార్చుకుంది. ఆమె తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, ఒడియా భాషలలో హీరోయిన్ గా చేసింది. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా రచన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో తెలుగులో రచనకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా ఆమె కన్యాదానం, బావగారు బాగున్నారా, పవిత్ర ప్రేమ, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.
వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం మూవీలో సంఘవి చేసిన పాత్రని, హిందీలో రచన చేసింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే రచన 2007 లో ప్రోబల్ బసు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఈ జంటకి ఒక బాబు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రచన సమహిక మధ్యమాలలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తరచుగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తోంది. ఆ ఫోటోస్ లో రచనని చూసినవారు ఆమెకి 50 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నారు. ఈ వయసులోనూ అంతే అందంతో కనిపిస్తోంది.
Also Read:
ఈ హీరో కోలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కంటెంట్కు చాలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్త స్టోరీలకు మద్దతిస్తూ, కథ నచ్చితే ఆ క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అయ్యే తమిళ హీరో. రజినీ కాంత్ మరియు కమల్ హాసన్ లను కలిపితే ఆ హీరో అని అక్కడి ఆడియెన్స్ పిలుస్తారు. రీసెంట్ గా తెలుగులో హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ సినిమాలో సైతం నటించాడు.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తూ ఆడియెన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థమై ఉంటుంది. పై ఫొటోలో ఉన్న హీరో మరెవరో కాదు సౌత్ సూపర్ స్టార్ ధనుష్. సార్ మూవీతో టాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న, ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయనున్నారు.
పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్తో ఆడియెన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు చిత్రాలను పట్టాలెక్కించారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు. అలాగే తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రాన్ని కూడా ధనుష్ ప్రారంభించారు.






