నందమూరి బాలకృష్ణ హీరో గా వచ్చిన సినిమా “మంగమ్మ గారి మనవడు”. ఈ సినిమా అప్పట్లో బాగానే ఆడింది. మంచి పేరు తెచ్చుకుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ హీరో గా నటించగా.. అలనాటి హీరోయిన్ భానుమతి గారు మంగమ్మ పాత్రను పోషించారు. ఆ పాత్రకి ఆమె నిజం గానే ప్రాణం పోశారు. ఆమె తప్ప మరెవ్వరిని ఆ పాత్రలో ప్రేక్షకులు ఉహించుకోలేనంత గా నటించి మెప్పించారు.

నిజానికి ఇది ఒక రీమేక్ సినిమా. మన్ మాసనై అనే తమిళ సినిమా ను తెలుగు లో “మంగమ్మ గారి మనవడు” గా రీమేక్ చేసారు. ఈ సినిమాలో మంగమ్మ పాత్రలో భానుమతి గారే నటించాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. ఆమె ఒప్పుకుంటేనే ఈ సినిమా తీయాలని.. లేకుంటే.. ఈ సినిమా నే తీయొద్దంటూ ముందే చెప్పేసారు. ఆ తరువాత ఆయనే స్వయం గా భానుమతి గారికి ఫోన్ చేసి విషయం అడిగారు.

ఎన్టీఆర్ గారు చెప్పడం తో భానుమతి గారు కూడా ఈ సినిమాలో మంగమ్మ పాత్ర లో నటించడానికి ఒప్పుకున్నారట. ఐతే.. ఈ సినిమా ప్రారంభం కావడానికే ముందే బాలకృష్ణకు ఎన్టీఆర్ గారు మూడు షరతులు విధించారట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1. భానుమతిగారు షూటింగ్ స్పాట్ కి వచ్చే టైం కంటే అరగంట ముందే బాలకృష్ణ గారు షూటింగ్ లో ఉండాలట..
#2. ఆమె కార్ రాగానే డోర్ బాలకృష్ణ గారే తియ్యాలి.
#3. ఇక ఆవిడ కారులో నుండి బయటకు దిగగానే.. కాళ్లకు నమస్కరించాలి.

ఇవన్నీ జరిగేటట్లు అయితేనే.. ఈ సినిమా షూటింగ్ నడుస్తుందని ఎన్టీఆర్ ముందే వార్నింగ్ ఇచ్చారట. బాలకృష్ణ కూడా తండ్రి విధించిన ఈ షరతులన్నటికి ఒప్పుకుని.. ఈ సినిమాలో నటించారు. అంతేకాదు షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన తండ్రి చెప్పినట్లే నడుచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కీలక పాత్రలో నటించాడు. అన్ని ప్రశ్నలకి జవాబు దొరికే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అని అడిగిన ప్రశ్నకి
‘మద్యపానంను మానిపించటం అనేది మూవీలో చూపించినంత సులభం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ గణాంకాలను ప్రత్యేకించి చూపించనవసరం లేదేమో. ప్రస్తుతం ఉన్న సొసైటీ ఆ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారేమో, భార్య పిల్లలను పట్టించుకోనివారు, ఎవరో వివాహం చేసుకోకుంటే మద్యం తాగడం మానేస్తాము అంటే అది జరగని విషయం, అందువల్ల మద్యం లేని సొసైటిని ఆశించడం పక్కన పెడదాం.
రుద్రవీణ మూవీలోని ముఖ్యమైన సమస్య అంటరానితనం. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ బిలహరి బాబాయ్ ఏమ్మా శోభన(లలిత)ను నువ్వు అంటరానిదానివి కదా అని ప్రశ్నిస్తే, కొంచెం బాధపడినా, ఏ అంటుకోవచ్చుగా అంటూ కొట్టినట్టుగా జవాబు చెప్తుంది. ఆ సన్నివేశం చిన్నతనంలో చూసి ఓహో ఇలానే ఉండాలని అనుకునేవాడిని, అలా చెప్తేనే ఊరుకుంటారని నమ్మేవాడిని.
అయితే ఆ మూవీ 80ల ఆఖరిలో వచ్చిన మూవీ కదా, ప్రస్తుతం అంటరానితనం ఏముంది అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ మూవీలో చేసినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే 30 సంవత్సరాల అనంతరం కూడా సమస్యే అని ఋజువైంది’ అని వెల్లడించారు.
మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అటు మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమా అని చెప్పవచ్చు. సీఎంగా మహేష్ బాబు అద్భుతంగా నటించారు. సీఎం ను ప్రేమించిన అమ్మాయిగా కియారా అద్వానీ, తండ్రిగా శరత్ కుమార్, విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఇలా మూవీలో దాదాపు అన్ని పాత్రలలో నటించిన వారికి పేరు వచ్చింది.
సీఎంను ప్రశ్నించే జర్నలిస్ట్ శుభోదయం సుబ్బారావు పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అతన్ని అందరు శుభోదయం సుబ్బారావుగానే గుర్తిస్తున్నారు. అంతకు ముందు పలు సినిమాలలో నటించినా, రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చింది. ఈ పాత్రలో నటించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. తెలుగు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించారు. రాజశేఖర్ 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తరువాత తెలుగులో గోవిందుడు అందరి వాడేలే, బాహుబలి: ది బిగినింగ్, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీచర్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్లు మరియు వెబ్సిరీస్లో నటించారు. ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ IT, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశాడు.










