బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్, తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ జంటగా నటించిన చిత్రం జోరుగా హుషారుగా. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 15న థియేటర్లలో విడుదలైంది అయితే పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడం, భారీ సినిమాల మధ్యలో ఈ సినిమాని విడుదల చేయటం వలన యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 8 గురువారం అర్ధరాత్రి నుంచి ఈ సినిమాని ఓటీటీ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కథ విషయానికి వస్తే సంతోష్ ( విరాజ్ అశ్విన్) అప్పుచేసి కన్సల్టెన్సీ కంపెనీకి డబ్బు కడతాడు కానీ ఆ కన్సల్టెన్సీ కంపెనీ మూతపడటంతో సంతోష్ కష్టాలు పెరుగుతాయి.
ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన సంతోష్ జీతం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అదే కంపెనీలో సంతోష్ ప్రియురాలు నిత్య ( పూజిత పొన్నాడ ) కూడా ఉద్యోగం చేస్తుంటుంది. నిత్యతో తన ప్రేమాయణాన్ని ఆఫీస్ కొలీగ్స్ దగ్గర దాచిపెడతాడు సంతోష్. అతను ఎందుకు అలా చేశాడు, జీవితంలో ఎదురైన కష్టాల నుంచి ఎలా పడ్డాడు, అప్పులను తీర్చగలిగాడా అన్నదే ఈ సినిమా కథ.

అయితే ఈ పాయింట్ తో గతంలో చాలా సినిమాలు రావడంతో రొటీన్ సినిమాగా భావించిన ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా ఆహ్వానించలేకపోయారు. ఈ సినిమాకి ప్రణీత్ సంగీతాన్ని అందించాడు, అను ప్రసాదు దర్శకత్వం వహించాడు. మరి ఓటీటీ ప్లాట్ఫారంలో ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో, సినిమా ఎలాంటి రిజల్ట్స్ సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.












కాజల్ అగర్వాల్ నటించిన హారర్ సినిమా కరుంగాపియమ్. ఈ మూవీ కథ విషయనికి వస్తే, కార్తిక (రెజినా) ఒక పాత లైబ్రరీకి వెళుతుంది. వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే బుక్ కనిపిస్తుంది. దాంతో ఆమె ఆ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే ఆమె చదివే క్యారెక్టర్లన్నీ దెయ్యాలుగా కార్తిక ముందుకు వస్తుంటాయి. వాటిలో కాజల్(కార్తిక) ఉంటుంది. ఆమె పగ తీర్చుకోవడం కోసం దెయ్యంగా మారుతుంది. ఇంతకి కాజల్ ఎలా చనిపోయింది. ఆమె తన పగను ఎలా తీర్చుకుంటుంద? ఇక రెజీనా క్యారెక్టర్ ఏమిటి అనేది మిగతా కథ.
5 కథలతో ఆంథాలజీగా రూపొందిన హారర్ సినిమా ఇది. రెజీనా క్యారెక్టర్ ద్వారా ఒక్కో స్టోరీని డైరెక్టర్ పరిచయం చేశాడు. కార్తిక ఎపిసోడ్స్ను సీరియస్ హారర్ స్టోరీగా తీశాడు. మిగిలిన 3 కథల్ని కామెడీ, హారర్ కలిపి ఆకట్టుకునేందుకు ట్రై చేశాడు. రెజీనాకు ఈ 5 కథలకు కనెక్షన్ ఉందని చూపించే ట్విస్ట్ బాగుంది. ఆ ట్విస్ట్తోనే మూవీని ఎండ్ చేసి, పార్ట్ -2 ఉందని చూపించాడు.
కాజల్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్గా నిలిచింది. ఫుచర్ ను ఊహించే శక్తి కల మహిళగా కాజల్ అగర్వాల్ ఆకట్టుకుంది. అరవ కామెడీని భరించడం కొంచెం కష్టమే. హారర్ ట్విస్ట్లన్నీ ఇంతకు ముందు చాలా చిత్రాలలో వచ్చినవే. కొన్ని పాత్రలు ఎందుకొస్తున్నాయో తెలియని గందరగోళంలో సినిమాను ఎండ్ చేశారు.
బాహుబలి మూవీ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతియోశక్తి లేదు. జక్కన్న దర్శకత్వ ప్రతిభ, రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్ ల అద్భుతమైన నటన బాహుబలి సినిమాని బ్లాక్ బస్టర్ గా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఇండస్ట్రీల రికార్డులన్నిటిని ఈ మూవీ తిరగరాసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేసింది. బాహుబలి మూవీలో విగ్రహం పైకి లేపిన అనంతరం ఇంటర్వెల్ వస్తుంది. అయితే దర్శకుడు రాజమౌళి ముందుగా వేరే సీన్ దగ్గర ఇంటర్వెల్ వేయాలని అనుకున్నారంట.
అది ఏమిటంటే, దేవసేన ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగి వచ్చాడు’ అని చెప్పినప్పుడు శివుడు నడుస్తూ ఉంటే అతడిలో నుండి అమరేంద్ర బాహుబలి రూపం వస్తుంటే ఇంటర్వెల్ రావాలి. ఈ సీన్ కన్నా ముందు శివుడు నిప్పు, గాలి, భూమి, నీరు, ఆకాశం అయిన పంచభూతాలను దాటుకుని మాహిష్మతి రాజ్యంలో అడుగుపెడతాడు. అయితే ఈ సీన్ ను జక్కన్న ఇలా తీయాలని అనుకోలేదట.
మాహిష్మతి రాజ్యంలోకి వచ్చే ముందు శివుడు మంచు కొండల్లో సైనికులతో ఫైట్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడున్న ఒక సైనికుడు శివుడిని చూసి అమరేంద్ర బాహుబలి అనుకుని, ‘ప్రభూ నన్ను ఏమీ చేయొద్దు’ అంటూ వేడుకుంటాడు. ఆ తరువాత తప్పించుకుని వెళ్ళి, బిజ్జలదేవుడికి బాహుబలి గురించి చెబుతాడు. కానీ, బిజ్జలదేవుడు నమ్మకుండా ‘బాహుబలి చనిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి మట్టిలో కలిపాం’ అని చెప్పగానే శివుడు మట్టి గోడను పగుల కొట్టుకుని ఇటువైపు రావాలి.
ఆ తరువాత ‘బాహుబలి శరీరాన్ని మంటల్లో కలిపాం’ అని చెప్పగానే శివుడు మంటలను దాటి రావాలి. ఈ విధంగా బిజ్జలదేవుడు ఒక్కో డైలాగ్ చెప్తుంటే ఒక్కో స్టేజ్ ను శివుడు దాటుకుని వచ్చేలా తీయాలని, అక్కడ ఇంటర్వెల్ వేయాలని భావించారంట. అయితే విగ్రహం పైకి ఎత్తిన తరువాత ఇంటర్వెల్ వస్తే బాగుంటుందని, బిజ్జలదేవుడి డైలాగ్స్ తొలగించారు. ఇక శివుడి మాహిష్మతికి వచ్చే సీన్స్ ను ‘నిప్పులే శ్వాసగా’ అనే పాటలా తీశాం’’ అని జక్కన్న ఒక సందర్భంలో వెల్లడించారు.







