Ipl aipoina mana Srh page admin assalu form taggaledu. Trend baga follow avutunnaru. “Em ledu friends… saradaga post cheyali anipinchindi” ane video entha viral ayyindo special ga cheppanavasaram ledu anukunta. Dani pai enno memes kuda vachayi. Ippudu srh admin kuda ide trend follow ayyaru. Rashid Khan and Khaleel Ahmed photo lu post chesi “em ledu just post cheyali anipinchindi chesam” antu trend follow ayyaru. Deenipai enno memes kuda vachayi. Avi oka look veskondi.!

Megha Varna
కోల్గెట్ చిన్న ప్యాకెట్ యాడ్ అమ్మాయి పై ట్రెండ్ అవుతున్న తెలుగు మీమ్స్
ఎవరు, ఎప్పుడూ ఎందుకు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు.వాళ్ళు ఎంచుకున్న అవకాశాల వల్ల సింగిల్ నైట్ లో స్టార్ లైపోతారు.
కోల్గెట్ యాడ్ లో చేసిన చిన్న పాప నిత్యా మోయల్ కూడా అలాగే ఉన్నటుండి సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయింది.మీ పేస్టు లో ఉప్పుందా అంటూ పెద్ద పెద్ద స్టార్ లతో యాడ్స్ చేయించే కోల్గెట్ సంస్థ ఎందుకు చిన్న పిల్లలతో యాడ్ చేయాలని నిర్ణయించిందో తెలియదు గానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల, సోషల్ మీడియా పుణ్యం వల్ల వాళ్ళకి కావల్సిన దానికంటే ఎక్కువ ప్రచారం లభించింది.
గతంలో నిత్యా మోయల్ సంతూర్ యాడ్ లో కూడా నటించింది.ఇది మన మీమ్ పేజెస్ వాళ్ళు కూడా గుర్తించారు అందుకే మన చిన్న ప్యాకెట్ పై బోలెడు మీమ్స్ చేసి తెగ నవ్విస్తున్నారు.ఇంతకీ ఆ మీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.

2.

3.

4.

5.

6.
7.

8.
9.
10.
జయరాం సుబ్రహ్మణ్యన్.. ఈ పేరు చెప్తే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ పంచతంత్రం మూవీ యాక్టర్ జయరాం అంటేనో, అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ అని చెప్తేనో ఈజీగా గుర్తు పట్టేస్తారు.. ఒక మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన జయరాం తర్వాత సినిమాల్లోకి రావడం పద్మశ్రీ అవార్డు అందుకునేంత ఎత్తుకి ఎదగడం మామూలు విషయం కాదు..

పంచతంత్రం సినిమాలో కమల్ తో పాటు నటించిన నలుగురు స్నేహాతుల్లో జయరాం ఒకరు.. అందులో ఐదుగురు కలిసి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు..జన్మత: మళయాలి అయినప్పటికి కూడా మళయాలంతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించారు..తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో కనిపించిన జయరాం ఇప్పటివరకు సుమారు 200చిత్రాల్లో నటించారు..జయరాంతో పాటు భార్యా,పిల్లలు కూడా మనకి సుపరిచితులు కావడం విశేషం.

జయరాం భార్య పార్వతి జయరాం ఎనభై,తొంభై దశకాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.. జయరాం కంటే రెండేళ్లు ముందు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె, జయరాం తొలిచిత్రం అపరన్ లో నటించింది..ఆ చిత్రంలో జయరాం,పార్వతి జయరాం అన్నాచెల్లెల్లుగా నటించడం విశేషం.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో ఇద్దరూ హీరోహోరోయిన్లుగా నటించడం, పరిచయం ప్రేమగా,ప్రేమ పెళ్లిగా రూపుదిద్దుకుంది..

జయరాం,పార్వతి జయరాంలకు ఇద్దరు పిల్లలు కొడుకు కాళిదాస్ జయరాం,కూతురు మాళవిక జయరాం.. కాళిదాస్ చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయి,ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు..తొలిచిత్రంతోనే నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో బెస్ట్ చైల్డ్ గా అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నాడు. మాళవిక జయరాం మోడల్ గా రానిస్తుంది..త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.
దివాళి టపాసులతో బండ్లన్న పెట్టిన ఫోటోపై ట్రెండ్ అవుతున్న 12 మీమ్స్…ట్రంప్ మామ గెలిచుంటే కాల్చుదాం అనుకున్నారేమో.?
bandla Ganesh… ee name ki kotta introduction avasaramledu. Aayana em chesina social media lo sensation avutundi. Recent ga Diwali samdarbaga crackers tho aayana post chesina photo viral ayyindi. Deentho social media lo chala memes trend avutunnayi. Avi oka look veskondi.

తన భర్తను ఉగ్రవాదులు చంపేశారని ఆ సైనికుడి భార్య ఏం చేసిందో తెలుసా? హ్యాట్సాఫ్ సిస్టర్!!!
పుల్వామా దాడి తర్వాత 2019 ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జైషే ఈ మొహమ్మద్ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అమరుడయ్యాడు. 2018 లో ఆయనకీ వివాహం జరిగింది. నితికా కౌల్ ఆమె సతీమణి. భర్త మరణం తర్వాత ఇప్పుడు ఆమె ఆర్మీ లో చేరేందుకు సిద్హమయ్యారు. ఆమె వయసు 28 సంవత్సరాలు.

ఇటీవలే SSC పరీక్షను పూర్తి చేసి, ఇంటర్వ్యూలో కూడా ఉత్తీర్ణత సాధించింది కౌల్. మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత నితికా కౌల్ భారత సైన్యంలో ట్రైనీగా చేరనుంది. ఆర్మీలో చేరడమే తన భర్తకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పింది నితిక. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

“కొత్త విషయాలను నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. కార్పొరేట్ కల్చర్ నుంచి ఆర్మీలో చేరడం అనేది గొప్ప మార్పు. సాయుధ దళాల సంస్కృతికి తగినట్టుగా ఎలా ఉండాలో అలవర్చుకున్నాను” కౌల్ తెలిపారు. ‘నా భర్తను కోల్పోయిన బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. నెమ్మదిగా నా మనస్సు కుదటపడుతుండటంతో.. షార్ట్ సర్వీసు కమిషన్ ఎగ్జామినేషన్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. గత ఏడాదిలో సెప్టెంబర్ నెలలో పరీక్షకు దరఖాస్తు చేశాను. కానీ, నేనూ నా భర్త నడిచిన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె అన్నారు.

అంతేకాదు పరీక్ష హాలులోకి వెళ్ళగానే తన భర్త గుర్తొచ్చి కంటతడి పెట్టుకున్నారంట కౌల్. తన భర్త మరణంతో తిరిగి సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది అన్నారు. ఇప్పుడు సైన్యంలో చేరి తన భర్త లగే మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది అని చెప్పారు.
ఈ 10 పాపులర్ బ్రాండ్స్ ఫారిన్ వి అనుకుంటే పొరపాటే…ఇవన్నీ మన ఇండియన్ బ్రాండ్స్.!
ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంటుంది లేదా ఓ కారణం ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే.ఇక అసలు విషయమేంటంటే బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే వారు ఎంచుకున్న కంపెనీ నేమ్,మైంటైన్ చేసే క్వాలిటీ వారిని మార్కెట్ లో బ్రాండ్ గా ఉంచాలో లేదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తాయి.మరి అలా మార్కెట్ లో సక్సెస్ అయిన కొన్ని బ్రాండ్స్ ఇండియాకి సంబంధించినవి అయినప్పటికీ వాటి పేర్ల కారణంగా మనం ఇన్నాళ్ళుగా వాటిని ఫారిన్ బ్రాండ్స్ అని భ్రమపడ్డాం.మరి ఆ బ్రాండ్స్ ఏంటో వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అలెన్ సోలి :

ఇది ఓ క్లోతింగ్ బ్రాండ్.ఈ బ్రాండ్ 1744 నుండి మార్కెట్ లో అవైలబుల్ లో ఉందని వారి షోరూం బయటపెట్టిన హోడింగ్ చూస్తే మనకి అర్థమవుతుంది.ఈ బ్రాండ్ ఫారిన్ కు చెందినది అయినప్పటికీ ప్రస్తుతం ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ లో భాగంగా ఉన్నది.
ఫ్లైయింగ్ మెషిన్ :

ఈ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. క్లోతింగ్ బ్రాండ్స్ లో యూత్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ బ్రాండ్ నే.మరి అలాంటి ఈ బ్రాండ్ ని అరవింద్ ఆపిరల్స్ యూనిట్ సంస్థ నడుపుతుంది.
పీటర్ ఇంగ్లాండ్ :

పేరులో ఇంగ్లాండ్ ఉందని దీన్ని ఫారిన్ బ్రాండ్ అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే ఈ బ్రాండ్ ను 2000 నుండి ఆదిత్య బిర్లా గ్రూప్ రన్ చేస్తుంది.మంచి ఫార్మల్స్ కోసం అందరూ ఈ బ్రాండ్ ను ప్రిఫర్ చేస్తుంటారు.
మోంటే కార్లో :

వినడానికి ఫారిన్ నేమ్ లో ఉన్న ఈ క్లోతింగ్ బ్రాండ్ ఇండియాకు చెందినది.దీనికి సంబందించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ జలంధర్లో రెండున్నాయి.
లాక్ మీ :

వినడానికి కొత్తగా ఉన్న ఈ పేరును చూసి ఎవరైనా దీన్ని ఫారిన్ బ్రాండ్ అనుకుంటారు.కాని ఇది మొదట్లో టాటా గ్రూప్ కాస్మోటిక్ బ్రాండ్.ప్రస్తుతానికి దీన్ని హిందూస్తాన్ యునిలివర్ వారు నడిపిస్తున్నారు.
జాగ్వార్ కార్స్ :

ఒకప్పుడు రతన్ టాటాను అవమానించిన ఫోర్డ్ కంపెనీ.ఆతర్వాత కాలంలో వారికి చెందిన జాగ్వర్ కార్స్ బ్రాండ్ ను 2008 లో టాటా మోటార్స్ కు అమ్మింది
టెట్లి :

ఈ బ్రాండ్ ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్ లో 1837 లో స్టార్ట్ అయ్యింది.ఆతర్వాత ఈ బ్రాండ్ ను 2000 సంవత్సరంలో టాటా గ్రూప్ కొనుగోలు చేసి ఈ బ్రాండ్ బాగా పాపులర్ చేసింది.
రాయల్ ఎన్ ఫీల్డ్ :

ఈ బ్రాండ్ మోటార్ బైక్స్ కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది.దీన్ని కొనడానికి మన దేశంలోని యువత వెంపర్లాడుతుంటారు.ఈ బ్రాండ్ ఐచర్ మోటార్ సైకిల్స్ వారికి చెందింది.
లా ఒపాలా :

కంఫర్టబుల్ అండ్ ఖరీదైన కిచెన్ వేర్, డైనింగ్ ను ప్రొడ్యూస్ చేయడంలో టాప్ కంపెనీస్ లో ఒకటైన లా ఒపాలా ను 1987 లో సుశీల్ ఝున్ జున్ వాలా స్థాపించారు.
హై డిజైన్ :

హ్యాండ్ బ్యాగ్స్, కర్చీఫ్స్,వాలెట్ వంటి లెదర్ గూడ్స్ ను ప్రొడ్యూస్ చేసే ఈ బ్రాండ్ ను 1978 లో దిలీప్ కపూర్ పుదుచ్చేరిలో ప్రారంభించారు.
ఈరోజులలో మనుష్యులలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.భక్తి చానెల్స్ మరియు ప్రసంగాలు వినే వారిసంఖ్య గణనీయంగా పెరుగుతుంది.తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువైన ప్రవచన కర్తలలో ప్రముఖులు మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు.ఈయన వృత్తి రీత్యా ఉదాధ్యాయుడిగా పని చేసారు.తెలుగు అధ్యాపకునిగా పలు కళాశాలల్లో పనిచేసారు.తర్వాత ప్రవచన కర్త గా మారి ప్రపంచ కీర్తి గడించారు.తెలుగు రాష్ట్రాలలోని కాకుండా ప్రపంచ నలుమూలలా ఈయనకు అభిమానులు ఉన్నారు.భగవద్గీత ,రామాయణం దగ్గర నుండి వేదాల వరకు అన్నింటి మీద ప్రసంగాలు ఇచ్చారు గరికపాటి నరసింహ రావు గారుస్.

భక్తి మార్గమే కాకుండా సామాజిక పరిస్థితులపై సమకాలీన ఉపనస్యాలు ఇవ్వడంలోగరికపాటి గారు ప్రముఖులు.విద్యార్థులకు కూడా మనో దైర్యం పెంచుకోవడంలోనూ ,మానసిక వికాసాన్ని పెంపొందించుకోవడంలోనూ కావలసిన విషయాలను బోధిస్తూ ఉంటారు .అయితే కొంతమందితో మాత్రం ఎటువంటి పరిస్థితులలోను కూడా గొడవ పెట్టుకోకూడదు అని గరికిపాటి గారు అంటున్నారు.అది ఎవరితోనో ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.వివరాల్లోకి వెళ్తే…

1. వంట చేసేవారితో
మొదటగా వంట చేసేవాడితో ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదు అంట ఎందుకంటే అతనితో ఏమైనా వివాదం అయితే ఆహారం రుచిగా ఉండకుండా చేసే అవకాశం ఉంది లేదా కారం లాంటివి ఎక్కువ వేస్తే తద్వారా ఆరోగ్యం చెడిపోతుంది .మారి ముఖ్యంగా ఆహారం లో విషం కలిపే అవకాశం కూడా ఉంటుంది అని గరికపాటి గారు తెలిపారు..

2. డబ్బున్న వాడితో
కపోతే డబ్బున్న వాడితో అసలు గొడవ పెట్టుకోకూడదు అంట.ఎందుకంటే డబ్బు ఉన్నవాడి దగ్గర రౌడీలు కూడా ఉంటారు.రాజకీయ నాయకులికి కూడా డబ్బు ఇచ్చి తమ అదుపులో పెట్టుకుంటారు.కావున అటువంటి వారితో వివాదం పెట్టుకుంటే ప్రాణాలు కూడా చాలా సులభంగా తీయించేస్తారు అని గరికపాటి గారు అన్నారు.

3. రాజు తో
రాజు తో అసలు తగాదా పెట్టుకోకూడదు అంట.ఎందుకంటే మొత్తం ప్రభుత్వం అంతా అతని అధీనంలో ఉంటుంది కాబట్టి అటువంటి వారితో వివాదం పెట్టుకుంటే ఏదో ఒక తప్పుడు అభియోగం మీద చెరసాలలో వేయిస్తారు అని తెలిపారు.

4. మంత్రి తో
మంత్రి తో అసలు వివాదం పెట్టుకోకూడదు అంట.ఈరోజుల్లో మంత్రి ఎవరు ఉంటారు అని అనుకుంటున్నారా.మంత్రి అంటే మనకు సలహాలు ఇచ్చేవారు.దుర్యోధనుడికి శకుని సలహాలు ఇవ్వడం వలెనే భారతంలో దుర్యోధుని జీవితం నాశనం అయింది .కాబట్టి మనకి సలహాలు ఇచ్చేవారితో బాగా సఖ్యంగా ఉండాలంటా.
నిన్నటి ఉమెన్స్ T20 లో సూపర్ నోవాస్ జట్టు కి, ట్రయల్ బ్లేజర్స్ జట్టు కి మధ్య జరిగిన పోటీలో 16 పరుగుల తేడా తో ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో స్మ్రితి మందన జట్టు విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఈ మ్యాచ్ లో నట్టకం చంతన్ ఫీల్డింగ్ హైలైట్. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
watch video:
Ms.Nattakan Chantham of Thailand during Women’s T-20 Challenge
Women power ???@premaswaroopam @Bhairavinachiya @VasaviNarayanan @SriRamya21 @unever_followme pic.twitter.com/iy8cI0IlU3
— ⱽᵃʳˢʰᵃ (@Varsha69396205) November 10, 2020
“ఒక్కడు” సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆ నెంబర్ ఎవరిదో తెలుసా?
మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్న “ఒక్కడు “చిత్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు .ఎందుకంటే ఒక్కడు చిత్రంతోనే మహేష్ బాబు ఒక్కసారిగా మాస్ స్టార్ డామ్ అందుకున్నారు.గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.అయితే ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా కనిపిస్తారు.

అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన మొబైల్ నెంబర్ 9848032919 అని మొదటగా నా భార్య కి కూడా చెయ్యకుండా నీకె చేస్తున్నాని అని చెప్తూ ఒక అమ్మాయితో మాట్లాడే సన్నివేశం నేటికీ హైలైట్ గా నిలుస్తుంది..ఇంతకీ ఆ మొబైల్ నెంబర్ ఎవరిదీ ? ఎందుకు ఈ నెంబర్ ఆ సన్నివేశం లో ఉపయోగించారు ? దాని వెనక ఆసక్తికర కథ ఉంది. అదేంటో చూడండి.

ఈ చిత్రంలో మహేష్ బాబు ,భూమిక ను రహస్యంగా అమెరికా కు పంపించాల్సి ఉంటుంది.దానికోసమే పాస్ పోర్ట్ అవసరం ఉంటుంది కనుక పాస్ పోర్ట్ ఆఫీసర్ ధర్మవరపు శ్రీనివాస్ ను మీట్ అవుతారు మహేష్ బాబు.అయితే ఆ సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన నెంబర్ 9848032919 అని ఒక అమ్మాయితో చెప్పడం మహేష్ బాబు విని ఆ నెంబర్ కు రాంగ్ కాల్స్ చేసి విసిగిస్తాడు.దీంతో ధర్మవరపు సుబ్రమణ్యం ఫోన్ పగలకొట్టేస్తారు.ఈ నేపథ్యంలో కొరియర్ లో ఇవ్వవలసిన పాస్ పోర్ట్ డైరెక్ట్ గా ఇచ్చేస్తారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.

ఆ రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పే ఆ ఫోన్ నెంబర్ బాగా పాపులర్ అయ్యింది.దీంతో చాలామంది ప్రేక్షకులు ప్రతి రోజూ ఆ మొబైల్ నెంబర్ కు లక్షల్లో ఫోన్ చేసేవారు.దీంతో ఆ వ్యక్తి తన మొబైల్ నెంబర్ మార్చేసుకున్నారు.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ చిత్ర నిర్మాత ఎం.ఎస్ రాజు గారు.అయితే “ఒక్కడు” షూటింగ్ సమయంలో ఒక ఫాన్సీ నెంబర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పాల్సి ఉండగా…..ఎవరి నెంబర్ చెబుదామా అని చిత్ర బృందం చర్చించుకుంటూ ఉంటే… ఎం.ఎస్ రాజు గారి నెంబర్ కంటే ఫాన్సీ నెంబర్ ఏముంటుంది అని చిత్ర బృందంలో ఓ వ్యక్తి అనడం వలన ఇలా జరిగిందంటా.
ఈ 14 మంది సౌత్ మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? అందరికంటే ఎక్కువ ఎవరంటే.?
సినిమాకు కథ,నటీనటులు ఎంత ముఖ్యమో సంగీతం కూడా అంతే ముఖ్యం ఈ విషయం తెలిసి కూడా కొందరు పెద్దలు సంగీతం లేకుండా కొన్ని చిత్రాలను తీసి ప్రయోగం చేశారు. కానీ ఆ ప్రయోగాలు ఫలించకపోవడంతో అప్పటినుండి వారు మళ్లీ పాత బాటే పట్టి సినిమాలలో సంగీతాన్ని తప్పనిసరి చేశారు. మన హీరోలు,డైరెక్టర్లు లాగే మ్యూజిక్ డైరెక్టర్ లు సైతం కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు.మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఏ. ఆర్.రెహమాన్ : ఈయన సినిమా బడ్జెట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటారు.ఈయన మినిమం 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు.

అనిరుథ్ : ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చిత్రానికి 2 కోట్లు పారితోషికం తీసుకుంటారు.

ఎస్.ఎస్.తమన్ : ప్రస్తుతం టాలీవుడ్ లో తన హవా చాటుతున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ చిత్రానికి 2 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు.

యువన్ శంకర్ రాజా : లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తనయుడైన యువన్ శంకర్ రాజా ప్రస్తుతం మిగతావారితో పోలిస్తే కొంత వెనకబడ్డాడు.ఈయన చిత్రానికి 2 కోట్లు పారితోషకం తీసుకుంటారు.

దేవి శ్రీ ప్రసాద్ : ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన దేవి ఓ చిత్రానికి సుమారు 1.5 నుండి 2 కోట్లు వరకు తీసుకుంటాడు.

ఎం.ఎం.కీరవాణి : తెలుగువారికి గర్వకారణమైన కీరవాణి గారు ప్రస్తుతం చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

మణిశర్మ : కొన్ని దశాబ్దాలు పాటు తెలుగు పరిశ్రమను ఏలిన ఈయన చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

హారిస్ జయరాజ్ : ఎన్నో లవ్ సాంగ్స్ కు కర్త ,కర్మ,క్రియ అయిన హారిస్ ఓ చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

జి.వి.ప్రకాష్ : అటు హీరోగా ఇటు మ్యూజిక్ కంపోజర్ గా బిజీగా ఉన్న జి.వి.ప్రకాష్. ప్రస్తుతం చిత్రానికి 60 లక్షల నుండి ఒక కోటి తీసుకుంటున్నారు.

గోపి సుందర్ : ఈయన ఓ చిత్రానికి సుమారు 50 నుండి 80 లక్షలు తీసుకుంటున్నారు.

మిక్కీ జె మేయర్ : దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి ఎన్నో మ్యాజికల్ సాంగ్స్ కు ఊపిరి పోసిన ఈయన ఓ చిత్రానికి సుమారు 50 నుండి 75 లక్షలు తీసుకుంటున్నారు.

తమిజా : మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగిన తమిజా అటు హీరోగా ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈయన చిత్రానికి 70 లక్షలు తీసుకుంటున్నారు.

మొహమ్మద్ ఘిబ్రన్ : ఈయన ఓ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడానికి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

వివేక్ సాగర్ : ఈమధ్య వస్తున్న చిన్న చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ అందరినీ అలరిస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ వివేక్ సాగర్ ఓ చిత్రానికి 40 నుండి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

