సుశాంత్ మరణించి సంవత్సరం అవుతుంది.తెలుగు వాళ్ళందరికీ సుశాంత్ ని చూస్తే ఇలాగే హఠాత్తుగా మన మధ్య నుంచి వెళ్లిపోయిన మరొక యాక్టర్ గుర్తొస్తారు. ఆయనే ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ సుశాంత్ జీవితాలను గమనించి చూస్తే ఇద్దరికీ మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి.

ఇద్దరివి మొదటి మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ఎంతో ప్రజాదరణ పొందాయి. అదేవిధంగా సుశాంత్ నటించిన కైపోఛే, శుధ్ దేశి రొమాన్స్, హీరో గా కాకపోయినా ముఖ్య పాత్రలో నటించిన పీకే చిత్రాలు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించాయి. అదేవిధంగా ఇద్దరి నాలుగో సినిమాలు అయిన కలుసుకోవాలని, డిటెక్టివ్ బ్యోమకేష్ భక్షి యావరేజ్ గా నిలిచాయి.

ఇద్దరు టీనేజ్ లోనే తమ కెరీర్ మొదలు పెట్టారు. కానీ సినిమాల్లో కాదు. ఉదయ్ కిరణ్ తను డిగ్రీ చదువుకునే రోజుల్లో మోడలింగ్ తో తన కెరీర్ మొదలు పెడితే, సుశాంత్ తను ఇంజనీరింగ్ జాయిన్ అయిన కొత్తలో షైమక్ ధావర్ దగ్గర డాన్స్ నేర్చుకుని ఫిలింఫేర్ లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టాడు.

ఇద్దరికీ తమ తల్లుల తోనే ఎక్కువ అనుబంధం ఉంది. సుశాంత్ డిగ్రీ లో చేరే ముందు తన తల్లి మరణించారు. ఉదయ్ కిరణ్ సినిమా జీవితం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో తన తల్లి మరణించారు. ఇద్దరు తల్లి మరణం తర్వాత డిప్రెషన్ కి గురయ్యారు.

ఇద్దరు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆడిషన్స్ ద్వారా తమ మొదటి సినిమాల్లో సెలక్ట్ అయ్యారు. ఇద్దరూ తమ కెరీర్ ముగిసే లోపు చేసిన సినిమాల సంఖ్య 20 లోపే. సుశాంత్ 12 సినిమాలు చేస్తే అందులో 11 రిలీజ్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ 19 సినిమాలు చేస్తే అందులో 18 రిలీజ్ అయ్యాయి. ఇతర కెరియర్ కాలం కూడా దాదాపు ఒకటే.

ఉదయ్ కిరణ్ కెరియర్ కాలం 13 ఏళ్లు. 2000 సంవత్సరం నుండి 2013 వరకు. 2009లో ఉదయ్ కిరణ్ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. ఆ విధంగా చూసుకుంటే 12 ఏళ్ళు. తను చనిపోయిన తర్వాత 2014లో చిత్రం చెప్పిన కథ అనే సినిమా పోస్టర్ విడుదల చేశారు కానీ సినిమా విడుదల చేయలేదు. సుశాంత్ కెరియర్ కాలం కూడా 12 ఏళ్లు. 2008లో కిస్ దేశ్ మే హై మేరా దిల్ సీరియల్ తో తన నటనా జీవితం ప్రారంభించాడు సుశాంత్.

ఇద్దరూ చనిపోయిన కారణం ఒకటే. డిప్రెషన్. ఉదయ్ కిరణ్ కి కెరీర్ పరంగా అయితే సుశాంత్ కి వ్యక్తిగత విషయాల పరంగా. ఇద్దరు ఉరేసుకుని చనిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరూ చనిపోయిన రోజు ఆదివారం కావడం. ఉదయ్ కిరణ్ చనిపోయింది 5 జనవరి 2014. ఆరోజు ఆదివారం.సుశాంత్ చనిపోయింది 14 జూన్ 2020. ఆదివారం.

చనిపోయే సమయానికి ఇద్దరి వయసు కూడా దగ్గర దగ్గర ఒకటే. ఉదయ్ కిరణ్ పుట్టినరోజు జూన్ తన చనిపోయింది జనవరిలో చనిపోయే సమయానికి 34 నిండలేదు కాబట్టి మరణించినప్పుడు ఉదయ్ కిరణ్ వయసు 33 సంవత్సరాలు. సుశాంత్ పుట్టింది జనవరిలో, చనిపోయింది జూన్ లో , చనిపోయే సమయానికి సుశాంత్ వయసు 34 సంవత్సరాలు.


7. కౌంటర్ నం-1-క్యాష్ కానుకలు






























మన భారత మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ధోనీ భార్య సాక్షి ధోని… అప్పటివరకు మిస్టర్ కూల్ గా,అమ్మాయిల కలల రాకుమారుడిగా,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ధోనికి జోడి అయింది సాక్షి.ధోనితో పెళ్లి కాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది సాక్షి. పెళ్లి తర్వాత క్రికెట్లో ధోని దశ కూడా తిరిగింది..వీరిద్దరి గారాల పట్టి జీవా..పెళ్లికి ముందే హోటల్ మేనేజ్మెంట్ చేసింది సాక్షి,ట్రెయిన్ గా కోల్ కతాలో జాబ్ కూడా చేసింది..కోల్ కతలో తాజ్ బెంగాల్లో ఇంటర్న్ షిప్ ట్రెయిని గా చేసేటప్పుడే ధోనితో పరిచయం అయింది.ప్రస్తుతం “సాక్షి రావత్ ఫౌండేషన్” పేరిట అనాధలకోసం ఒక సంస్థని స్థాపించి,సంస్థ బాద్యతలు చూస్కుంటుంది.
రితికా,ప్రొఫెషన్ స్పోర్ట్స్ మేనేజర్..గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ట్నైన్మెంట్ లో స్పోర్ట్స్ మానేజర్ గా పనిచేసింది..రోహిత్ శర్మ ని కలిసింది ప్రోఫెషనల్ మీట్ లోనే..సిక్స్ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట..వీరిద్దరికి ఒక కూతురు పేరు సమైరా శర్మ.
వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ భార్య దిపికా పల్లికల్ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్..స్క్వాష్ ప్లేయర్స్ లో మొట్టమొదటి అర్జుణ అవార్డు గ్రహీత.అంతేకాదు పద్మశ్రీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.ప్రొఫెషనల్ స్క్వాష్ అసోషియేషన్ టాప్ 10లో ఇండియాని నిలబెట్టిన ప్రతిభాశీలి.
సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు బ్యాంకర్.గతంలో యాక్సెంచర్,విప్రో వంటి సంస్థలలో పని చేసింది..గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపించి,సంస్థ బాద్యతలు చూసుకుంటుంది.గ్రేసియా సురేష్ రైనా,ప్రియాంకల కూతురు పేరు.. పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ గ్రేసియా రైనా ఫౌండేషన్.
ఆయేషా కిక్ బాక్సర్,అథ్లెట్.శిఖర్ ధావన్ తో వివాహానికి ముందే ఆయేషా కిక్ బాక్సర్ గా పేరుగాంచింది.. ఆయేషా ,శిఖర్ లది రెండవ వివాహం.శిఖర్ తో వివాహానికి ముందే ఆయేషాకు పెళ్లి జరిగి,ఇద్దరు పిల్లలున్నారు..వీరిద్దరి పరిచయం జరిగింది ఫేస్ బుక్లో..పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వచ్చింది.ఆయేషాని పెళ్లి చేసుకోవడానికి శిఖర్ తన ఫ్యామిలితో చిన్నపాటి యుద్దమే చేసాడు..మొత్తానికి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వైఫ్ ఇంజినీర్.వీరిద్దరూ సేమ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.వీరికి ఇద్దరు అమ్మాయిలు అకీరా,ఆద్యా.
మయంతి జర్నలిస్టు, ఫేమస్ స్పోర్ట్స్ యాంకెర్,క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మయంతి సుపరిచితురాలే.క్రికెటర్ స్ట్రావుడ్ బిన్నిని వివాహం చేసుకున్నారు మయంతి లాంగెర్.
సాగరికా ఘాట్గే నటి మరియు అథ్లెట్..ప్రముఖ బాలివుడ్ నటుడు షారుక్ నటించిన ఛక్ దే ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే..ఆ చిత్రంలో సాగరిక కీలక పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయింది.వివిధ చిత్రాలు,రియాలిటి షోలు మరియు వెబ్ సిరిస్ లలో కూడా నటించింది.




















