సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. సినిమా బృందం ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది. సినిమా మొదటి పాట ఇప్పటికే విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా నుండి రెండో పాట కూడా విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించి, ఆ పాట ప్రోమో విడుదల చేశారు. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెండవ పాట ఓ మై బేబీ అని ప్రకటిస్తూ సినిమా బృందం ఒక పోస్టర్ తో పాటు ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేశారు.

పాటలో మహేష్ బాబు, శ్రీలీల కనిపిస్తున్నారు. అయితే సాధారణంగా తమన్ చాలా పాటలని కాపీ కొట్టి తన పాటలని రూపొందిస్తారు అనే కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు. ఎన్నో సంవత్సరాల నుండి తమన్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు, మరొక సినిమాలో ఉన్న పాటలకు చాలా దగ్గరగా ఉండటం వంటివి జరుగుతున్నాయి. తమన్ మాత్రమే కాదు. ఇలా ఒక పాట నుండి ఇన్స్పైర్ అయ్యి తమ పాటలను రూపొందించిన సంగీత దర్శకులు చాలా మంది ఉన్నారు.

కాకపోతే తమన్ మరీ ఎక్కువగా ఇలాంటి కాపీ ట్యూన్స్ చేయడంతో, తమన్ పాట రిలీజ్ అయిన ప్రతిసారి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పాట మొత్తం రిలీజ్ అవ్వనే లేదు. పాట ప్రోమో మీద ఇప్పటికే కాపీ పాట అంటూ కామెంట్స్ మొదలు అయ్యాయి. ఈ పాట సడన్ గా వింటే అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ పాటని స్లోగా విన్నట్టు ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బుట్ట బొమ్మ పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగానే ఉంది అని అంటున్నారు. దాంతో మళ్లీ తమన్ మీద కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. అయితే మరి కొంత మంది మాత్రం, “ఇప్పుడే ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేయడం? పాట రిలీజ్ అయ్యాక వేరేగా ఉంటుంది ఏమో. వెయిట్ చేసి చూద్దాం” అంటూ పాజిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు. మరి పాట ఎలా ఉంటుందో తెలియాలి అంటే పాట రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం సినిమా బృందం షూటింగ్ చేస్తూనే మరొక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నారు.
watch video :
ALSO READ : ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీస్తారా.? సెన్సేషన్ గా మారిన ఈ సినిమా చూసారా.?








పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మెగా బ్రదర్ నాగబాబు తన సొంత బ్యానర్ అయిన అంజన ప్రొడక్షన్స్ లో గుడుంబా శంకర్ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ మూవీగా రూపొందిన ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ మూవీని పవన్ కెరీర్లో ప్లాప్ మూవీగానే చెబుతుంటారు. కానీ ఈ చిత్రంలో కామెడీ సూపర్ అనే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీని ఆగష్టు 31న రీరిలీజ్ చేయనున్నట్లు నాగబాబు ప్రకటించారు. అయితే ఈ సినిమాను 2 రోజుల తరువాత పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే ఒక ట్విట్టర్ యూజర్ గుడుంబా శంకర్ మూవీలోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలను, అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ పాటకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. రెండింటిలోనూ పవన్ కళ్యాణ్ సేమ్ కాస్ట్యూమ్స్ ధరించినట్టు కనిపిస్తోంది. ఆ ఫోటోలకు ఆ యూజర్ ‘నీకు ఏం కాదు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి రాత్రి కళ్ళు కాంపౌండ్ కి వెళ్తాడు ఉస్తాద్’ అని రాసుకొచ్చారు.





