ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనంతపని చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పైన పరువు నష్టం దావా వేశాడు. చిరంజీవితోపాటు త్రిష, ఖుష్బూ పై కూడా కేసు పెట్టాడు. తనకి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టును కోరాడు. తనకు సంబంధించిన వీడియో పూర్తిగా చూడకుండా తనపై ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కల్పించారని ఆరోపించాడు. అయితే ఈ కేసు డిసెంబర్ 11వ తారీఖున మద్రాస్ హైకోర్టు ముందుకు రానుంది.

అసలు విషయంలోకి వెళ్తే మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిష పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను గతంలో ఎన్నో సినిమాల్లో రేప్ సీన్లలో నటించానని కానీ లియో సినిమాలో త్రిషతో తనకి ఆ అవకాశం రాకపోవడం నిజంగా బాధపడినట్లు ప్రకటించాడు. అయితే మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల పైన మహిళా సంఘాలతో పాటు చాలామంది ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు. త్రిష అయితే మన్సూర్ తో ఒక్క సినిమాలో కూడా నటించనందుకు చాలా సంతోషం అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే త్రిషకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు లోకేష్, కార్తీక్ సుబ్బరాజ్, మాళవిక, రోజా, సింగర్ చిన్మయి, నితిన్, రాధా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు మద్దతుగా నిలిచారు. ఖుష్బూ అయితే తమిళనాడు డిజిపి కి ఫిర్యాదు చేయగా మన్సూర్ పైన కేసు కూడా నమోదు చేశారు. అయితే మన్సూర్ తనని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ అప్లై చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది.

అయితే మనసూర్ వ్యాఖ్యల పైన తీవ్ర నిరసన రావడంతో త్రిషాకి మన్సూర్ క్షమాపణలు చెప్పాడు. త్రిష ఆ క్షమాపణను అంగీకరించింది. అయితే తర్వాత మన్సూర్ తన పరువు కి నష్టం కలిగించారు అంటూ చిరంజీవి పైన, త్రిష పైన, ఖుష్బు పైన పరువు నష్టం దావ వేస్తానంటూ ప్రకటించాడు. ఇప్పుడు నిజంగా పరువు దావా వేసి అనంతపని చేశాడు.








బాలనటిగా శ్వేత బసు మొదటి హిందీ సినిమా ‘మక్డీ’ లో డబుల్ రోల్ చేసి అలరించిడమే కాక, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్వేత బసుకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పట్లో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అది జరిగిన తరువాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడే ఉంటూ హిందీలో సీరియల్స్ లో నటిస్తూ, ఇంకో వైపు అసిస్టెంట్ డైరెక్టర్గానూ పని చేసింది. శ్వేత బసు డిసెంబర్ 2018 లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది.కానీ ఏం జరిగిందో కానీ ఏడాదికే విడిపోయారు.
అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది. అందుకేనేమో ఇటీవల హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ, ఇన్స్టాలో హీట్ పెంచుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించింది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లిన శ్వేత బసు బీచ్లో సందడి చేసింది. ‘ఇండియా లాక్డౌన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరియు ప్రమోషన్స్లోనూ అందాల ఆరబోతతో రచ్చ లేపింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేత బసును ఇన్స్టాగ్రామ్లో 440K ఫాలో అవుతున్నారు.






యానిమల్ సినిమాలో బాబి డియోల్ పాత్ర పేరు అబ్రర్. ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిగా అబ్రర్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. అయితే ఇందులో అబ్రర్ రెండో భార్యగా నటించిన ఆమె కనిపించింది కొద్దిసేపైనా కూడా మంచి నటన కనబరిచింది. అబ్రర్ మిగతా భార్యలతో కలిసి వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చేసి సీన్స్ లో తన నటన అద్భుతంగా ఉంది. అయితే ఆమె ఎవరు అంటూ చాలామంది ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆమె లండన్ కి చెందిన పాకిస్తానీ నటి షఫీనా షా..!