అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య మొదటిసారి దూతా వెబ్ సిరీస్ తో ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకునే నాగచైతన్య దూతతో ఒక కొత్త ప్రయోగాన్ని చేశాడని చెప్పాలి. నాగచైతన్యతో మనం, థాంక్యూ మూవీలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఈ దూత వెబ్ సిరీస్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో స్టీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ఆకట్టుకుందో లేదో చూద్దాం…!
చిత్రం: దూత
నటీనటులు: నాగచైతన్య, ప్రియా భవాని శంకర్, పార్వతి తిరువోతూ, తరుణ్ భాస్కర్, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు.
దర్శకుడు: విక్రమ్ కె కుమార్
నిర్మాత:శరత్ మారార్
సంగీతం: ఇషాన్ చాబ్రా
సినిమాటోగ్రఫీ: మికోలాజ్ సైగులా
విడుదల తేదీ:డిసెంబర్ 1

కథ:
సాగర్ (నాగచైతన్య) మొదట జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం సమాచార్ పత్రికకు చీఫ్ ఎడిటర్ గా ఎదుగుతాడు. దీంతో సాగర్ చాలా ఉప్పొంగిపోతాడు. అయితే తన జీవితంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో అతని ఆనందం ఎక్కువ కాలం నిలవదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని వార్తాపత్రికలు క్లిప్పింగ్ లు ఈ విషాదాలను ముందుగానే అంచనా వేస్తాయి. మరి అది ఎలా సాధ్యమైంది, సాగర్ కి తన ప్రొఫెషన్ లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? మరి చివరిగా ఆ వార్తాపత్రికలు వెనుక రహస్యాన్ని సాగర్ ఎలా చేదించగలిగాడు? అనేది దూత వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
దర్శకుడు విక్రమ్ కె కుమార్ సినిమాలు చూస్తే ఒక చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూరు కథనం అల్లి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాడు. దూత కథ ఏమిటనేది అయిదారు ఎపిసోడ్ ల తర్వాత గాని క్లారిటీ రాదు.అప్పటివరకు కథ గురించి ఆలోచించే అవకాశాన్ని ప్రేక్షకులకు డైరెక్టర్ ఇవ్వలేదు. ఏదో ఒక మ్యాజిక్ చేస్తూ ముందుకు వెళ్లాడు. మొదటి ఎపిసోడ్ లో కాసేపటికి కథలోకి వెళ్ళాడు. కళ్ళ ముందు కనిపించే పాత్రలతో ప్రయాణం చేసేలా చేశారు. ఫ్లాష్ బ్యాక్ వచ్చేవరకు ఉత్కంఠను కంటిన్యూ చేశారు. దూతలో దెయ్యం లేదు కానీ కంటికి కనిపించని అతీంద్రియ శక్తి ఉందని చెప్పారు. రెగ్యులర్ హర్రర్ నేపథ్యంలో సంగీతంతో భయపట్టే ప్రయత్నం చేయలేదు కానీ కంటికి కనిపించని పాత్రలను ఫీలయ్యేలా చేశారు.

చిన్న చిన్న చమక్కులతో, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. కొన్ని సీన్లలో విక్రమ్ డీటెయిల్ సామాన్య ప్రేక్షకులను సైతం గమనించేలా ఉంటుంది.ఐదారు ఎపిసోడ్లు వరకు సస్పెన్షన్ మెయింటైన్ చేసి తర్వాత కథను ముగింపు దశకు తీసుకురావడానికి డైరెక్టర్ చాలా స్వేచ్ఛ తీసుకున్నాడు. క్యారెక్టర్ లను కనెక్ట్ చేసిన విధానం కాస్త సినిమాటిక్ టైప్ లో ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నుంచి 50 నిమిషాల మధ్య ఉండడం కూడా కాస్త మైనస్ అని చెప్పాలి. ఈ దూత సీరీస్ చూస్తునంత సేపు విక్రమ్ కుమార్ తీసిన 13B ఛాయలు కనిపిస్తాయి. మీడియాలో అవినీతి కొత్త కాదు కానీ దాన్ని ప్రధాన అంశంగా తీసుకున్న డైరెక్టర్ క్లాస్ పీక లేదు. జర్నలిజం, రాజకీయం, పోలీసు వ్యవస్థల్లో ఉన్న మంచి చెడులను చూపించారు.

ఇక టెక్నికల్ గా చూసుకుంటే దూత ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. సంగీతం కూడా కథకి తగ్గట్టుగా ఉంది.నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక నటీనటుల విషయానికొస్తే నాగచైతన్యది పాజిటివ్ రోల్ అని చెప్పలేము, అలాగని నెగిటివ్ కూడా కాదు. గ్రేషేడ్స్ ఉన్నాయి.యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉంది. లుక్స్ నుంచి ఎక్స్ప్రెషన్ వరకు చైతన్య ఇంప్రెస్ చేశాడు. పార్వతి నటన ఆకట్టుకుంటుంది, ఎస్పీ క్రాంతి గా ఒదిగిపోయింది. మిగతా పాత్రలు పరిమితమే కానీ ఉన్నంతలో బాగా నటించారు. ఇతర సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా కొన్నిచోట్ల ఆశ్చర్యపరుస్తారు.
రేటింగ్: 3/5
ఫైనల్ గా : దూత మొదలైన 15 నిమిషాల్లో ఆ ప్రపంచంలోకి ప్రేక్షకులు వెళతారు. థ్రిల్లర్ జానర్ ఫిలిమ్స్ ను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇది మంచి ఆప్షన్. నిడివి కాస్త ఎక్కువైనా కూడా డీసెంట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది.
Watch Trailer:















అది ఆయన ఇష్టమని, చిరంజీవి నిజమేంటో తెలుసుకాకుండా కామెంట్లు చేయడం బాధ అనిపించిందని అందుకే ఆయన పైన 20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై చెరో పది కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ డబ్బును తమిళనాడులో ఇటీవల మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబానికి పంచుతానని అన్నాడు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నాడు. ఇప్పుడు మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.అయితే త్రిషకి మద్దతుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్లందరిని వదిలేసి ఒక్క చిరంజీవి పైనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. మన్సూర్ అలీ ఖాన్ కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చిరంజీవి అభిమానులు అంటున్నారు.






పైన ఫోటోలో ఉన్న యాక్టర్ ను వెంటనే గుర్తు పట్టడం కష్టంగా ఉన్నా, ఆ హీరోకి పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ హీరో నెక్స్ట్ సినిమా ఏమిటా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఆ కన్నడ స్టార్ హీరో మొదట్లో బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన యష్ యాక్టర్ నుండి ‘రాకింగ్ స్టార్’ గా ఎదిగారు.
యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 1986లో కర్ణాటకలోని హసన్ జిల్లాలోని భువనహళ్లిలో జె అరుణ్ కుమార్, పుష్ప దంపతులకు జనవరి 8న జన్మించాడు. యష్ తండ్రి బస్సు డ్రైవర్. యష్ కు చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే టివి ఇండస్ట్రీలో ఉత్తరాయణ అనే సీరియల్తో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఈటీవీ కన్నడలో ప్రసారమైన సీరియల్ సిల్లీ లల్లీ, నంద గోకుల్ వంటి పలు సీరియల్స్ లో నటించాడు. నందగోకుల్ సీరియల్ లో నటించిన రాధిక పండిట్ని ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో కలిసి నటించారు.
2007లో ‘జంబద హుడుగి’ మూవీతో యష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రెండవ సినిమా మొగ్గిన మనసులో చేసిన పాత్రకు గుర్తింపు వచ్చింది. ఆ మూవీకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. 2008 లో రాకీ మూవీలో హీరోగా నటించి, ఆకట్టుకున్నాడు. వరుస చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎదుగారు. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారారు.
హీరోయిన్ సంఘవి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. 1993 నుండి 2004 వరకు సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 15 ఏళ్ళ పాటు సాగిన సంఘవి కెరీర్లో 80కి పైగా సినిమాలలో నటించింది. సంఘవి కర్ణాటకలోని మైసూర్లో 1977 లో అక్టోబర్ 4న జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్. రమేష్, మైసూర్ మెడికల్ కాలేజీలో ఈఎన్టి ప్రొఫెసర్ , మరియు ఆమె తల్లి శ్రీమతి రంజన.
సంఘవి బాలనటిగా సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. సంఘవి నాయనమ్మకు ప్రముఖ కన్నడ నటి ఆరతి, చిన్న చెల్లెలు. సంఘవి ఆమెతో పాటు షూటింగ్స్ కు వెళ్ళేది. అలా సినిమాలలో నటించాలన్న ఆసక్తి ఏర్పడింది. 1993లో తమిళ సినిమా అజిత్ హీరోగా వచ్చిన ‘అమరావతి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస ఆఫర్స్ రావడంతో అక్కడ స్టార్ హీరోయిన గా మారారు. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ మూవీతో సంఘవి టాలీవుడ్ లో అడుగుపెట్టారు.
సిందూరం, సూర్యవంశం అవంతి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ లో రాణిస్తున్న దశలో 1998లో శివయ్య మూవీలో నటించింది. ఆ మూవీ సమయంలో ఆ మూవీ డైరెక్టర్ సురేశ్ వర్మను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన ఏడాదికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత 2016 లో బెంగుళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ వెంకటేష్ని రెండవ పెళ్లి చేసుకుంది. ఈ జంటకు జనవరి 2020లో ఆడపిల్ల జన్మించింది.
దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం హేయ్ పిల్లగాడ. మలయాళంలో రిలీజ్ అయ్యి, భారీ వసూళ్ళు రాబట్టి, సంచలన విజయం సాధించిన `కలి` మూవీని తెలుగులో హేయ్ పిల్లగాడ గా డబ్ చేసి, రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సమీర్ తాహిర్ దర్శకత్వం వహించగా, డి.వి.కృష్ణస్వామి నిర్మించారు. తమిళంలో కూడా ఈ మూవీ విజయం సాధించింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, సిద్దు (దుల్కర్ సల్మాన్) కు చిన్న చిన్న విషయాలకు సైతం విపరీతమైన కోపం వస్తుంటుంది. అతను అంజలి (సాయి పల్లవి) ని లవ్ చేసి, పెళ్లి చేసుకుంటాడు. అంజలికి సిద్ధూ కోపం గురించి తెలిసినా, ఎప్పటికైనా సిద్దు కోపం తగ్గించుకుంటాడని, మారతాడని వెయిట్ చేస్తుంటుంది. అయితే సిద్దు మాత్రం అదే విధంగా ఉంటాడు. వీరిద్దరూ ఓసారి వైజాగ్ కు బయలుదేరుతారు.
మార్గ మధ్యలో ఒక డాబాలో ఆగిన సమయంలో అక్కడ ఉన్న రౌడీలకు సిద్ధుకు గొడవ జరుగుతుంది. ఆ గొడవ వారి జీవితంలో ఎలాంటి మార్పులను తెచ్చింది? ఆ తరువాత వారిద్దరూ ఎలాంటి ప్రమాదంలో పడ్డారు అనేదే మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సిద్దుగా చక్కగా నటించారు. ఆ పాత్ర చుట్టూనే స్టోరీ తిరుగుతుంది. సిద్ధూ ప్రేయసిగా, భార్యగా అంజలి పాత్రలో సాయి పల్లవి నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.