డైరెక్టర్ లు ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా సినిమాలో అనుకోకుండా చిన్న చిన్న తప్పులు దొర్లుతూ ఉంటాయి. అవి కావాలని చేసినవి కాదు. ఆ తప్పులను పట్టుకుని చాలామంది వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఆ తప్పులు కూడా భారీ తప్పులు కూడా ఏం కాదు. చిన్న చిన్న తప్పులే. అవి ఏలాంటివి అంటే సినిమాలో టైం చూపించేటప్పుడు, సంవత్సరాల గురించి చెప్పేటప్పుడు, ఏదైనా వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు లేదా వస్తువులు, బట్టలు ఇలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు అలాంటిదే ఖైదీ సినిమాలో జరిగిన చిన్న తప్పు గురించి చెప్పుకుందాం. ఖైదీ అంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ కాదు, తమిళ హీరో కార్తి నటించిన ఖైదీ మూవీ లోది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీ ఎంతటి విజయం సాధించింది అందరికీ తెలిసిందే.

అప్పటి వరకు ఉన్న మూస ఫార్మాట్లకు ఖైదీ మూవీ మంచి సమాధానం చెప్పింది. కార్తిని సరికొత్తగా ప్రజెంట్ చేశారు. ఒక నైట్ లో జరిగే సినిమాలో ఎన్నో డీటెయిల్స్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమా టికెట్ యూనివర్సిటీలో ఉందని కూడా తెలిసింది.అయితే ఇప్పుడు ఈ మూవీలో జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే కార్తి తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతూ ఒకరోజు శుక్రవారం చిరంజీవి సినిమా ఫ్లాట్ ఫామ్ జనం అంత సెకండ్ షో సినిమాకు పోయారు… అంటూ చెప్పుకొస్తూ ఉంటాడు. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా. ఖైదీ సినిమా వచ్చిన సంవత్సరం 2019. కార్తి సినిమాలో పది ఏళ్ల క్రితం జైలుకి వెళ్లినట్టు చెబుతాడు. అంటే అది 2009వ సంవత్సరం. అప్పటికి చిరంజీవి సినిమాలో నటించిన లేదు, రాజకీయాల్లో ఉన్నారు.

చిరంజీవి మగధీర సినిమాలో చిన్న క్యామియో చేశారు. అది చిరంజీవి సినిమా లెక్కల్లోకి రాదు. లోకేష్ కనకరాజు చిరంజీవి సినిమా రిఫరెన్స్ అయితే తీసుకున్నాడు గాని సంవత్సరాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇక్కడే సోషల్ మీడియాలో తప్పులు వెతికే వారికి దొరికేశాడు. ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోండి. అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పుడు చూసుకోవాలి కదా లోకి బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read:ఇవన్నీ విచిత్ర ఆరోపణలు..! హిట్స్ వస్తున్న కారణంగానే..?” అంటూ… “నందమూరి చైతన్య కృష్ణ” కామెంట్స్..!




పైన ఫోటోలో ఉన్న యాక్టర్ ను వెంటనే గుర్తు పట్టడం కష్టంగా ఉన్నా, ఆ హీరోకి పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ హీరో నెక్స్ట్ సినిమా ఏమిటా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఆ కన్నడ స్టార్ హీరో మొదట్లో బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన యష్ యాక్టర్ నుండి ‘రాకింగ్ స్టార్’ గా ఎదిగారు.
యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 1986లో కర్ణాటకలోని హసన్ జిల్లాలోని భువనహళ్లిలో జె అరుణ్ కుమార్, పుష్ప దంపతులకు జనవరి 8న జన్మించాడు. యష్ తండ్రి బస్సు డ్రైవర్. యష్ కు చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే టివి ఇండస్ట్రీలో ఉత్తరాయణ అనే సీరియల్తో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఈటీవీ కన్నడలో ప్రసారమైన సీరియల్ సిల్లీ లల్లీ, నంద గోకుల్ వంటి పలు సీరియల్స్ లో నటించాడు. నందగోకుల్ సీరియల్ లో నటించిన రాధిక పండిట్ని ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో కలిసి నటించారు.
2007లో ‘జంబద హుడుగి’ మూవీతో యష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రెండవ సినిమా మొగ్గిన మనసులో చేసిన పాత్రకు గుర్తింపు వచ్చింది. ఆ మూవీకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. 2008 లో రాకీ మూవీలో హీరోగా నటించి, ఆకట్టుకున్నాడు. వరుస చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎదుగారు. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారారు.
హీరోయిన్ సంఘవి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. 1993 నుండి 2004 వరకు సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 15 ఏళ్ళ పాటు సాగిన సంఘవి కెరీర్లో 80కి పైగా సినిమాలలో నటించింది. సంఘవి కర్ణాటకలోని మైసూర్లో 1977 లో అక్టోబర్ 4న జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్. రమేష్, మైసూర్ మెడికల్ కాలేజీలో ఈఎన్టి ప్రొఫెసర్ , మరియు ఆమె తల్లి శ్రీమతి రంజన.
సంఘవి బాలనటిగా సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. సంఘవి నాయనమ్మకు ప్రముఖ కన్నడ నటి ఆరతి, చిన్న చెల్లెలు. సంఘవి ఆమెతో పాటు షూటింగ్స్ కు వెళ్ళేది. అలా సినిమాలలో నటించాలన్న ఆసక్తి ఏర్పడింది. 1993లో తమిళ సినిమా అజిత్ హీరోగా వచ్చిన ‘అమరావతి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస ఆఫర్స్ రావడంతో అక్కడ స్టార్ హీరోయిన గా మారారు. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ మూవీతో సంఘవి టాలీవుడ్ లో అడుగుపెట్టారు.
సిందూరం, సూర్యవంశం అవంతి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ లో రాణిస్తున్న దశలో 1998లో శివయ్య మూవీలో నటించింది. ఆ మూవీ సమయంలో ఆ మూవీ డైరెక్టర్ సురేశ్ వర్మను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన ఏడాదికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత 2016 లో బెంగుళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ వెంకటేష్ని రెండవ పెళ్లి చేసుకుంది. ఈ జంటకు జనవరి 2020లో ఆడపిల్ల జన్మించింది.
దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం హేయ్ పిల్లగాడ. మలయాళంలో రిలీజ్ అయ్యి, భారీ వసూళ్ళు రాబట్టి, సంచలన విజయం సాధించిన `కలి` మూవీని తెలుగులో హేయ్ పిల్లగాడ గా డబ్ చేసి, రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సమీర్ తాహిర్ దర్శకత్వం వహించగా, డి.వి.కృష్ణస్వామి నిర్మించారు. తమిళంలో కూడా ఈ మూవీ విజయం సాధించింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, సిద్దు (దుల్కర్ సల్మాన్) కు చిన్న చిన్న విషయాలకు సైతం విపరీతమైన కోపం వస్తుంటుంది. అతను అంజలి (సాయి పల్లవి) ని లవ్ చేసి, పెళ్లి చేసుకుంటాడు. అంజలికి సిద్ధూ కోపం గురించి తెలిసినా, ఎప్పటికైనా సిద్దు కోపం తగ్గించుకుంటాడని, మారతాడని వెయిట్ చేస్తుంటుంది. అయితే సిద్దు మాత్రం అదే విధంగా ఉంటాడు. వీరిద్దరూ ఓసారి వైజాగ్ కు బయలుదేరుతారు.
మార్గ మధ్యలో ఒక డాబాలో ఆగిన సమయంలో అక్కడ ఉన్న రౌడీలకు సిద్ధుకు గొడవ జరుగుతుంది. ఆ గొడవ వారి జీవితంలో ఎలాంటి మార్పులను తెచ్చింది? ఆ తరువాత వారిద్దరూ ఎలాంటి ప్రమాదంలో పడ్డారు అనేదే మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సిద్దుగా చక్కగా నటించారు. ఆ పాత్ర చుట్టూనే స్టోరీ తిరుగుతుంది. సిద్ధూ ప్రేయసిగా, భార్యగా అంజలి పాత్రలో సాయి పల్లవి నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.








