సినిమాల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో సందేశాత్మక సినిమాలు కూడా ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు సందేశం అందించడానికి తీయకపోయినా కూడా అవి తెలిసి తెలియకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ఒక నీతిని అందిస్తాయి.
ఇలాంటి విషయాల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి. సినిమా గురించి, అందులో చూపించిన వాటి గురించి చిన్న చిన్న వివరాలతో సహా చాలా డీటెయిల్ గా పరిశీలించి మాట్లాడుతారు. ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా బేబీ.

సినిమాని చూసి కొంత మంది, “చాలా బాగుంది” అంటే, మరి కొంత మంది మాత్రం, “సినిమా మొత్తం వన్ సైడ్ మాత్రమే చూపించినట్టు ఉంది” అని అన్నారు. కానీ దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించిన విషయం ఒకటే. ఇందులో లీడ్ రోల్స్ లో నటించిన ముగ్గురు కూడా కరెక్ట్ గా ఉండరు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేశారు.

తెలిసి తెలియని వయసులో వాళ్ళు చేసిన తప్పుల వల్ల తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనే విషయాన్ని ఈ సినిమాలో దర్శకుడు చూపించడానికి ప్రయత్నించారు. అయితే ఈ సినిమా ద్వారా మనకి అందిన నీతి ఏంటి అని కోరాలో ఒక వ్యక్తి ప్రశ్న పోస్ట్ చేశారు. ఈ ప్రశ్నకి సంతోష్ కుమార్. కె అనే ఒక వ్యక్తి ఈ విధంగా సమాధానం చెప్పారు.

ఈ ప్రశ్నకి సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ, “ఓ అరవై ఐదేళ్ల ఏళ్ల క్రితం కాలాతీత వ్యక్తులు అనే నవల వచ్చింది … చాలా పాపులర్ నవల అది … కాలాతీత వ్యక్తులు అంటే కాలానికి ఎదురు నిలిచి గెలిచే వారుగా పేర్కొనవచ్చు (తప్పులున్నచో పెద్దలు సవరించగలరు ) ఈ నవల లో ఇందిర అనే ఓ పాత్ర ఉంటుంది …ఆ పాత్ర ఎంత బోల్డ్ గా ఉంటుంది అంటే … మొదట ప్రకాశం అనే పాత్ర తో ప్రేమాయణం నడిపి … ఆ తరువాత కృష్ణ మూర్తి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది …

ఈ మధ్యలో చాలా ప్రాసెస్ నడుస్తుంది …ప్రేమాయణం లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా చెప్పబడతాయి . ఇందిర వ్యక్తిత్వం తెలిసి ఓ సమయం లో కృష్ణ మూర్తి పాత్ర భయపడేంతగా ఉంటుంది. నవల పేరులో పేర్కొన్న ట్టుగా కాలాతీత వ్యక్తులు లో ఒకరిగా అంటే లీడ్ రోల్ లో ఇందిర పాత్ర ను చూపిస్తారు … మిగిలిన కాలాతీత వ్యక్తులు వేర్వేరు మంచి లక్షణాలతో ఉంటారు …

ఇక్కడ గెలుపే కొలమానం అయినప్పుడు ఆమె పాత్ర లో లోపాలు ఎంచలేము … మొదటి సారి ఈ పుస్తకం (అంటే మాకు డిగ్రీ లో తెలుగు నవల గా ఉండేది ) చదివినప్పుడు నాకు కొంత అదోలా అనిపించినా … తరువాత లీడ్ రొలెస్ కి పాఠం చివరలో ఇచ్చిన జస్టిఫికేషన్ చదివాకా కొంత సంతృప్తిగానే అనిపించింది.”

పైన ఫోటో లో సినిమా (ఊహలు గుసగుసలాడే) చూసే ఉంటారు … హీరోఇన్ మొదట హీరో ని ప్రేమిస్తుంది … ఆ తరువాత మరొకరి తో పెళ్ళికి సిద్ధపడుతుంది… ఏంటని హీరో అడిగితె ఓ డైలాగు చెపుతుంది … నా కాళ్ళు / పాదాలు ఎప్పుడూ నేల మీద ఉంటాయి … అది తనలోని ప్రాక్టికల్ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

image courtesy : Chai Bisket
ఆకలి రాజ్యం (ఈ సినిమాలోని, “ఎలాగోలా బతకాలనుకుంటే ఎలాగైనా బతకవచ్చు. కానీ ఇలాగే బతకాలి అనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో” అనే డైలాగ్ ఫోటో పోస్ట్ చేసి) పైన డైలాగ్ కి అర్థం వివరించక్కర్లేదు అనుకుంటా ! ఇప్పుడు పైన పేర్కొన్న మూడు ఉదాహరణలు తరచి చూస్తే బేబీ సినిమా పైన క్లారిటీ వస్తుంది అనుకుంటా…. అయితే మీకు ఏం అర్థం అయిందనేది మీ ఇంట్యూషన్ పైన ఆధారపడి ఉంటుంది.” అని రాశారు. ఈయన చెప్పిన మాట కూడా నిజమే కదా. ఇదే మీలో ఎంత మందికి అనిపించింది.
ALSO READ : “పవన్ కళ్యాణ్” లాగానే… తమ సినిమాలని తామే “డైరెక్ట్” చేసుకున్న 10 హీరోస్..!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి మూవీ. గతనేల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక విజయ్ దేవరకొండ, సమంత చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీకి భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ కు వచ్చాయి.
ఇటీవలే ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఒక ఓటీటీలో పలుమార్లు చూసిన నెటిజెన్లు ఆ మూవీలోనీ పొరపాట్లను గమనించి సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానిని చూసిన నెటిజెన్లు కామెంట్లు పెట్టడం ఇటీవల కాలంలో సాధారణం అయ్యింది. వీటిలో కొన్ని వైరల్ గాను మారుతున్నాయి.
ప్రస్తుతం ఖుషీలో కూడా ఇలాంటి మిస్టేక్ ను గమనించిన ఒక యూజర్, దానికి సంబంధించిన వీడియో క్లిప్ ను షేర్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ బైక్ నడుపుతుండగా సమంత వెనకాల కుర్చుని ఉన్నారు. విజయ్ దేవరకొండ తమను వెంబడిస్తున్న బైక్ ఎడమ వైపు పట్టుకుని పైకి లేపాడు. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి, బైక్ కి లెఫ్ట్ సైడ్ కూడా యాక్సిలరేటర్ ఉంటాయా అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపకపోవడంతో సామాజిక మధ్యమాలలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడిపి కార్యకర్తలు మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడిపి అభిమాని ఒకరు ఎన్టీఆర్ కు స్వయంగా కాల్ చేసి, ఎన్టీఆర్ చిత్రాల గురించి వార్నింగ్ ఇచ్చారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ చంద్రబాబుకు మద్దతు తెలపకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఆడనివ్వము అని గట్టిగా హెచ్చరించారట. వచ్చే ఎలెక్షన్స్ లో టీడిపి అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆడనివ్వము అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సైతం కౌంటర్ ఇచ్చారని సమాచారం. చంద్రబాబు అరెస్టు కావడంతో నెట్టింట్లో అభిమానుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది.
అయితే ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించలేదు. ఇలా ఎన్టీఆర్ చంద్రబాబు విషయంలో స్పందించకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు కొన్నేళ్ళ నుండి ఫలితాలతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఆయన సినిమాలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ లియో అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇటీవల కాలంలో ఏ తమిళ సినిమాకి లేనంత హైప్ లియో సినిమా పై నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ఈ మూవీ తెలుగు సినిమా కాపీ అని చర్చ జరుగుతోంది. ఆ తెలుగు మూవీ ఏమిటంటే 2010లో వచ్చిన గాయం 2. రామ్ గోపాల్ వర్మ ఈ మూవీని సమర్పించగా, ప్రవీణ్ శ్రీ డైరెక్షన్ లో తెరకెక్కింది.
గాయం 2 మూవీని హాలీవుడ్ సినిమా ‘ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్’ ఆధారంగా తీశారు. కట్ చేస్తే, లియో ట్రైలర్ కి గాయం 2కి పోలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ హిల్ స్టేషన్ లో హోటల్ రన్ చేయడం, భయపడుతూ బ్రతకడం, ప్రత్యర్థులు వచ్చి అటాక్ చేస్తే తప్పించుకోవడం, ఆఖరికి ఎదురు తిరగడం లాంటివి ట్రైలర్ లో చూపించారు. ఆ సీన్స్ ని, గాయం 2 సీన్స్ ను పోలుస్తూ రెండింటి వీడియోస్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండున్నర నిముషాల నిడివి గల ట్రైలర్ లో బాలయ్య, శ్రీలీల తండ్రి కూతుర్లుగా కనిపించారు. బాలయ్య పక్కా తెలంగాణ యాసతో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విలన్ కు సవాలు విసిరే సీన్స్ లో, బిడ్డ శ్రీలీల గురించి తల్లడిల్లిపోయే సన్నివేశాలలో బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరో వైపు సోషల్ మీడియాలో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. భగవంత్ కేసరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా రొటీన్ గా ఉందని, పాత సినిమాలలోని మ్యూజిక్ నే కొంచెం అటు ఇటుగా మార్చి ఇచ్చారని కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో అర్జున్ రాంపాల్ ను విలన్ గా సెలెక్ట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు.














బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – “ఈ రోజు మధురపూడి గ్రామం అనే నేను థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్ర దర్శకుడు మల్లి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. నా సొంత మనిషి. హైదరాబాద్కి, ఇండస్ట్రీకి వచ్చిన క్రొత్తలో ఒకే బైక్ మీద తిరిగేవాళ్లం. అప్పట్లో నాకు మోరల్ సపోర్ట్గా ఉండేవారు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవారు. నా కెరీర్లో ఫస్ట్ కథ ఇచ్చిన శ్రీహరి గారి భద్రాద్రి సినిమాకు మల్లి గారే దర్శకులు. అప్పటి నుండి ఇప్పటి దాకా మా రిలేషన్ అలాగే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశారు. మధుర పూడి గ్రామం అనే నేను ట్రైలర్ చూశాను..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకే ఊరిలో జరిగే కథ. రా అండ్ రప్టిక్గా ఉంటూనే ఎమోషన్స్తో నిండి ఉంది. మరో గొప్ప విషయం ఏంటంటే మణిశర్మగారు సంగీతం అందించారు. అలాగే మా అందరికీ గురు సమానులు గౌతమ్ రాజు గారు ఎడిటర్గా చేశారు. ట్రైలర్లో హీరో శివ కంఠమనేని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. అలాగే హీరోయిన్ క్యాథలిన్ గౌడ, మిగతా ఆర్టిస్టులు చక్కగా చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
























