‘బబుల్గమ్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో నేచురల్ స్టార్ నాని పాల్గొని బబుల్గమ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కృష్ణ అండ్ హిజ్ లీల, క్షణం చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ రవికాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీలో హీరోగా నటించిన అబ్బాయి తల్లితండ్రులు గురించి తెలియనివారు ఎవరు ఉండరు. మరి అబ్బాయి ఎవరో? అతని పేరెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన కనిపిస్తున్న అబ్బాయి పేరు రోషన్ కనకాల. అతను స్టార్ యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు. వారి గురించి బుల్లితెర నుండి వెండి తెర ప్రేక్షకుల వరకు అందరికీ సుపరిచితులే. వారి తనయుడు రోషన్ కనకాల బబుల్గమ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. హీరోగా ఇదే మొదటి సినిమా అయినా, నటుడుగా రోషన్ కనకాల 2016 లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో హీరో ఫ్రెండ్ భాషాగా నటించాడు.
ఆ తరువాత రోషన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. తన స్టడీ పూర్తి అవడంతో, తిరిగి వచ్చిన రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం శిక్షణ తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో రవికాంత్ దర్శకత్వంలో బబుల్గమ్ మూవీలో నటించాడు. ఈ మూవీలో హీరోయిన్గా మానస చౌదరీ చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. హీరో నాని పాల్గొని మూవీయూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ ఈవెంట్ కు హోస్ట్ గా సుమ, గెస్ట్ గా రాజీవ్ కనకాల పాల్గొని సందడి చేశారు. ఈవెంట్లో నాని సుమ, రోషన్ గురించి మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఈవెంట్లో హీరో రోషన్ కనకాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలా మాట్లాడిన విధానం అందరినీ ఆకర్షించింది.
Also Read: 45 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప సినిమా వచ్చిందా..? ఈ సినిమా చూశారా..?





తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్, జేమ్స్ బాండ్ అనగానే గుర్తుకువచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పలు గుడాచారి సినిమాలలో నటించారు. వాటిలో ప్రత్యేకంగా నిలిచిన మూవీ ఏజెంట్ గోపి. ఈ సినిమాని లెజెండరీ డైరెక్టర్ కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించారు. కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, రాజనాల వంటి లెజెండరీ నటులు కీలకపాత్రలలో నటించారు. ఏజెంట్ గోపి మొదటి సినిమా స్కోప్ జేమ్స్ బాండ్ సినిమాగా నిలిచింది.
ఇక ఈమూవీ స్టోరీ విషయానికి వస్తే, గోపాల్ కృష్ణ అలియాస్ గోపి (ఘట్టమనేని కృష్ణ) ఒక తెలివైన పోలీస్ ఏజెంట్. 50 కోట్ల విలువైన వజ్రాల దొంగలను కనుగొనే క్రమంలో చాలా మంది పోలీసు అధికారులు చంపబడతారు. దాంతో ఉన్నతాధికారి ఈ పనిని ఏజెంట్ గోపీకి అప్పగిస్తాడు. తనకు అప్పగించిన బాధ్యతలో భాగంగా గోపీ విశాఖపట్నం వెళ్తాడు. అక్కడ ఎస్ఐ రాజారావు (ప్రభాకర్ రెడ్డి) కలుస్తాడు. అతని చెల్లి పేరు లత(జయప్రద) అని తెలుస్తుంది.
లత గోపి ఉన్న హోటల్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తుంది. అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తున్న గోపి గురించి తెలుసుకోవడం కోసం ప్రేమించినట్టుగా నటిస్తుంది. అయితే ఆమె గురించి తెలిసిన గోపి, లతను ఆమె అన్న రాజారావు దగ్గరకు గోపి తీసుకువెళతాడు. కానీ లత అది నిజం కాదని, రాజారావును నమ్మకూడదని అతను మోసగాడని చెప్తుంది. తన అన్నయ్య రాజారావును వజ్రాల కోసం స్మగ్లర్ల గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని చెప్తుంది.
ఆ తరువాత అసలైన రాజారావు స్మగ్లర్ల నుండి తప్పించుకుని వచ్చి, స్మగ్లర్ల గుహకు దారిచూపే మ్యాప్ను గోపికి ఇస్తాడు. లత, గోపి, అతని కొలీగ్ చిట్టి(పద్మనాభం) కలిసి గుహను కనుగొంటారు. అయితే వారిని స్మగ్లర్లు పట్టుకుంటారు. గోపి స్మగ్లర్ల డాన్ (రాజనాల)ని కలుస్తాడు. డాన్, అతని గ్యాంగ్ వజ్రాల కోసం ఇదంతా చేయడం లేదని, ప్రపంచ విధ్వంసం కోసం అని గోపి తెలుసుకుంటాడు. ఆ తరువాత గోపి, ఎస్ఐ రాజారావు, లత, చిట్టిల సహాయంతో స్మగ్లర్లను అంతం చేసి ప్రపంచాన్ని కాపాడుతాడు.
అప్పట్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్. అసలు ఇలాంటి సినిమా అప్పుడు వచ్చిందంటే చాలా గొప్ప విషయం అని అంటున్నారు. కె.ఎస్.ఆర్.దాస్ అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీకి చెందిన వాటిని ఈ సినిమాలో చూపించారు. హీరో అడివి శేష్ గూడాచారి2 మూవీలో ఏజెంట్ గోపికి నివాళిగా తన క్యారెక్టర్ ను రాసుకున్నారు.
ఇప్పటికే నవదీప్ను ఈ కేసులో సెప్టెంబర్ 23న ఈడీ అధికారులు విచారించారు. అయితే వారు అడిగిన కొన్నింటికి నవదీప్ జవాబులు చెప్పినా, కొన్నింటిని దాటవేశారని తెలుస్తోంది. రామ్చంద్ పదేళ్ల కిందటే తనకు పరిచయమని, అయినప్పటికీ, తాను ఎవరికీ వాటిని ఇవ్వలేదని చెప్పారు. దాంతో 2017లో నమోదైన టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసును, మాదాపూర్ మాదకద్రవ్యాల కేసును కలిపి ఈడీ ఈరోజు నవదీప్ని ప్రశ్నిస్తోంది. మాదకద్రవ్యాల కేసులో ఉన్న నైజీరియన్లతో మీకున్న సంబంధం ఏమిటి? వారితో ఆర్ధిక లావాదేవీలను ఎందుకు జరిపారు?
ముగ్గురు నైజీరియన్ల మనీలాండరింగ్ కేసు గురించి ఏం తెలుసు? ఈడీకి మీ అకౌంట్ల అన్ని వివరాలను ఇవ్వగలరా? మీరు మేనేజర్ మరియు డ్రైవర్ అకౌంట్లతో ఏమైనా ట్రాన్సాక్షన్లు చేశారా? రామ్చంద్, కలహర్ రెడ్డితో ఉన్న లావాదేవీల విషయం ఏమిటి? ఈవెంట్లకు సంబంధించిన అన్ని రికార్డులను ఇస్తారా? వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో కొంతమంది కీలకమైన వారి పేర్లు బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే విచారణ తరువాత బయటికి వచ్చిన నవదీప్ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.
జగతి కన్నుమూయడంతో ఆమెనే తలుచుకుంటూ మహేంద్ర తాగి రోడ్డు పక్కన పడిపోతాడు. ఆ విషయం వేరేవాళ్ల ద్వారా తెలుసుకున్న రిషి, వసుధార మహేంద్ర గగగరికి వెళ్తారు. చెట్టుకింద ఉన్న మహేంద్రను అలా చూసి బాధపడుతూ, ఇంటికి తీసుకొని వస్తారు. అది చూసిన దేవయాని మహేంద్ర పై కోప్పడుతుంది. దాంతో ఫణీంద్ర భార్యపై ఫైర్ అవుతాడు.
తరువాతి రోజు ఫణీంద్ర, జగతి లేదనే బాధలో ఉండి, చేసే పనులు, బాధ్యతల్ని పట్టించుకోకపోతే తమనే నమ్మకున్న విద్యార్ధులు, ఉద్యోగుల జీవితాలు ఇబ్బందిలో పడతాయని రిషితో అంటాడు. ఇవన్నీ తొలగిపోవాలంటే ఎండీ సీట్లో నువ్వే కూర్చోవాలని రిషిని, దేవయాని, శైలేంద్రల ముందే రిక్వస్ట్ చేస్తాడు. దానికి చేయలేనని రిషి చెప్తాడు. వసు కలుగజేసుకుని, మీ పైన పడిన నింద గురించే కదా, కానీ దాని గురించి ఇకపై ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. దాన్ని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది.
రిషి ఏం చెప్తున్నావు వసుధారా అని అడుగుతాడు. వసుధార మాటలు అర్ధం కానీ శైలేంద్ర, దేవయానీలు షాకింగ్గా చూస్తారు. వసుధార మాట్లాడుతూ, తాను, ఫణీంద్ర సార్ కలిసి ఎస్ఐ గారిని మరియు మినిస్టర్ గారిని కలిసి, సమస్యను సాల్వ్ చేశామని చెప్తుంది. ఇక రిషిని ఎండీ సీట్లో చూడాలని ఫణీంద్ర, వసుధార బలంగా కోరుకుంటున్నారు కాబట్టి తరువాతి ఎపిసోడ్లో దేవయాని, శైలేంద్రల షాక్ ఇస్తూ రిషి ఎండీ సీట్ ని స్వీకరిస్తాడో చూడాలి.











విజయ్ దళపతి, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.
ఇక ట్రైలర్ చూసిన తరువాత ఈ మూవీ హాలివుడ్ మూవీ రీమేక్ అని కొందరు, లేదు తెలుగు మూవీకి రీమేక్ అని మరికొందరు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని మేకర్స్ ప్రకటించారు.
సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీకి 13 కట్స్ చెప్పినట్టుగా సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ తో స్పష్టత వచ్చింది. అందులో ఒకొక్క కట్ లో కొన్ని పదాలను మరియు కొన్ని సీన్లను కూడా ప్రస్తావించారు. సెన్సార్ మెంబర్స్ సూచనల మేరకు మొత్తం 47 సెకన్ల నిడివిని తగ్గించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
స్రవంతి చొక్కారపు యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. జెమినిలో కొన్ని రోజులు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. ‘పుష్ప’ మూవీ విడుదల సమయంలో పుష్ప యూనిట్ ఇంటర్వ్యూ చేసి స్రవంతి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత మల్లెమాల సంస్థ షోస్ లో స్రవంతి సందడి చేసింది. దీనివల్ల ఆమెకు ‘బిగ్ బాస్’ లో పాల్గొనే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ షోతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. అఖిల్, అజయ్ లతో ఉంటూ వార్తల్లో నిలిచేది. స్రవంతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఆమెకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖలో షేర్ చేస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది. వీటిని చూసిన నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
ఒక నెటిజెన్ మాత్రం “నీ వయసుకి మరియు నువ్వు వేసే వేషాలకి ఏమైనా సంబంధం ఉందా?” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పెట్టిన వ్యక్తికి స్రవంతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తరువాత ఆ వ్యక్తి తన కామెంట్లను డిలీట్ చేశాడు. దానికి కూడా స్రవంతి “ఏంట్రా నాన్న భయమేసిందా కామెంట్స్ అన్ని డిలీట్ చేసేశావు” అంటూ కామెంట్ చేసింది.